Reliance: రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.15 వేల కోట్ల బాండ్ల విక్రయాలు?
Reliance: వివిధ రంగాల్లోకి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ఎత్తున నిధుల సమీకరణను చేపడుతోంది. అందులో భాగంగా తాజాగా దేశీయ కరెన్సీ బాండ్లను విక్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
దిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) భారీగా నిధుల సమీకరణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దాదాపు రూ.15,000 కోట్లు విలువైన స్థానిక కరెన్సీ బాండ్ల విక్రయాల ద్వారా తమ లక్ష్యాన్ని సాధించాలని భావిస్తోంది. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని.. చర్చలు తుది దశలో ఉన్నాయని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ కీలక వ్యక్తి ఆంగ్లపత్రిక బ్లూమ్బెర్గ్కు వెల్లడించారు.
ఒకవేళ ఈ వార్తలు నిజమైతే.. స్థానిక కరెన్సీ బాండ్లలో రిలయన్స్ (Reliance Industries) ఈ స్థాయిలో నిధులను సమీకరించడం ఇదే తొలిసారి. అలాగే 2020 తర్వాత దేశీయ బాండ్ల ద్వారా నిధులను సేకరించడం కూడా ఇదే మొదటిసారని బ్లూమ్బెర్గ్ పేర్కొంది. పెట్రోకెమికల్స్ వ్యాపారం నుంచి రిలయన్స్ క్రమంగా ఇతర రంగాలకూ వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ ఎత్తున నిధులను సమీకరిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది ‘ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ’కి రిలయన్స్ రిటైల్ వాటాలు విక్రయించింది. అలాగే కేకేఆర్ అండ్ కంపెనీ నుంచి నిధులను సమీకరించింది.
గత కొన్ని నెలల్లో భారత్లో రుణ రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries)కు క్రిసిల్ రేటింగ్స్ AAA క్రెడిట్ స్కోర్ను ఇచ్చింది. మూడీస్, ఫిచ్ మాత్రం రిలయన్స్కు వరుసగా Baa2, BBB రేటింగ్ను కొనసాగిస్తున్నాయి.
సెప్టెంబరు త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) నికర లాభం రూ.17,394 కోట్లు లేదా ఒక్కో షేరుకు రూ.25.71గా నమోదైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో లాభం రూ.13,656 కోట్ల (ఒక్కో షేరుకు రూ.19.92)తో పోలిస్తే ఇది 27.3 శాతం అధికం. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయాలు పెద్దగా మార్పు లేకుండా రూ.2.55 లక్షల కోట్లుగానే నమోదయ్యాయి. మరోవైపు కంపెనీ ఆర్థిక వ్యయాలు వార్షిక ప్రాతిపదికన 25.8 శాతం పెరిగి రూ.5,731 కోట్లకు చేరాయి. అధిక వడ్డీరేట్లు, మారక విలువ పతనం కొంత ప్రతికూలంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.