Mukesh Ambani: యంత్రాల కన్నా టాలెంట్పై పెట్టుబడితోనే అధిక లాభం.. ‘ఫ్యామిలీ డే’లో అంబానీ వ్యాఖ్యలు
Mukesh Ambani: రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకులైన ధీరూభాయ్ అంబానీ జయంతి సందర్భంగా ఏటా జరిపే ‘రిలయన్స్ ఫ్యామిలీ డే’లో పాల్గొన్న ముకేశ్ అంబానీ ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. యంత్రాలపై పెట్టుబడి కంటే ప్రతిభపై పెట్టుబడి అధిక రాబడిని తెస్తుందన్నారు.
Mukesh Ambani | ముంబయి: ప్రపంచంలోని టాప్ -10 వ్యాపార సంస్థల్లో ఒకటిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani). రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకులైన ధీరూభాయ్ అంబానీ (91) జయంతి సందర్భంగా ఏటా నిర్వహించే ‘రిలయన్స్ ఫ్యామిలీ డే’లో పాల్గొన్న ఆయన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. డిజిటల్ డేటా ప్లాట్ఫారమ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను అందిపుచ్చుకొని గ్లోబల్ లీడర్గా కంపెనీ స్థానాన్ని సుస్థిరం చేయడమే రిలయన్స్ ప్రస్తుత లక్ష్యమని చెప్పారు.
‘వ్యాపారం కోసం దేశీయ, ప్రపంచ స్థాయిలో వాతావరణం శరవేగంగా మారుతోంది. ఆత్మసంతృప్తికి ఆస్కారం లేదు. నిరంతరం కొత్త ఆవిష్కరణల కారణంగా మార్కెట్లో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అందుకే మేం అత్యున్నత స్థాయి లక్ష్యాల్ని పెట్టుకున్నాం. కొత్త రికార్డుల్ని సృష్టించడానికి ప్రయత్నించాం. అందువల్లే రిలయన్స్ ఈ స్థాయికి చేరుకుంది’ అని అంబానీ అన్నారు.
ఆజాద్ ఇంజినీరింగ్ లిస్టింగ్ అదుర్స్.. 7 రెట్లు పెరిగిన సచిన్ పెట్టుబడి!
ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరింస్తుందని ముకేశ్ అంబానీ విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో రిలయన్స్ ప్రపంచలోని టాప్ 10 వ్యాపార సంస్థల్లో ఒకటిగా ఎదుగుతుందన్నారు. ఈ సమావేశంలో భాగంగా మూడు కీలక అంశాల్ని ఉద్యోగులకు సూచించారు. ‘ఎల్లప్పుడూ కస్టమర్లకు విలువ ఇవ్వండి.. వారి అంచానాల్ని అందుకోండి. సమాజ విశ్వాసాన్ని గెలిచేలా కంపెనీ చర్యలు ఉండాలి. కస్టమర్ల ప్రేమ, నమ్మకాన్ని గెలుచుకొనేందుకు నిరంతరం సామర్థ్యాల్ని మెరుగుపరుచుకోండి’ అన్నారు.
డిజిటల్ డేటా ప్లాట్ఫారమ్లలో గ్లోబల్ లీడర్లలో తమ గ్రూప్ స్థానాన్ని సుస్థిరం చేయాలని అంబానీ ఈ సందర్భంగా సూచించారు. ‘ఉత్పాదకత, సామర్థ్యాన్ని సాధించడానికి ఏఐ సాంకేతికతను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లాలి. ఈ డిజిటల్ యుగంలో ప్రతిభ, డబ్బుతో పాటు సాంకేతికత కూడా ముఖ్యమైన అంశంగా మారింది. ఏఐ అవకాశాలను తయారీ రంగంలో కూడా ఉపయోగించుకోవటంలో ముందంజలో ఉండాలి. రానున్న ఏడాదిలో అన్ని వ్యాపారాల్లోనూ ఏఐ సాకేంతికతను అందిపుచ్చుకోవాలి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఉపాధి కల్పనల పరిష్కారించే దిశగా ఏఐని అభివృద్ధి చేయడంలో అగ్రగామిగా ఎదగాలి’ అని ఆయన తన సిబ్బందికి సూచించారు. యంత్రాలపై పెట్టుబడి కంటే ప్రతిభపై పెట్టుబడి అధిక రాబడిని తెస్తుందని అంబానీ అన్నారు. 2023 భారత్తో పాటు రిలయన్స్కు కూడా గొప్ప సంవత్సరంగా పేర్కొన్నారు. 2024 మరింత మెరుగ్గా ఉండనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.