IPO Rush: ఒకే రోజు 3 ఐపీఓలు.. ₹1700 కోట్లు సమీకరణే లక్ష్యం
IPO News: మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1700 కోట్లు సమీకరించనున్నాయి. వీటి సబ్స్క్రిప్షన్ ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు అందుబాటులో ఉంటాయి.
Latest IPOs | దిల్లీ: దేశీయ మార్కెట్లలో ఐపీఓ సందడి కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లలో అనుకూల పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతున్నాయి. కొత్త ఏడాదిలో ఇప్పటికే ఐదు కంపెనీలు రూ.3,266 కోట్లు మార్కెట్ల నుంచి సమీకరించగా.. తాజాగా మరో మూడు కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. రాశి పెరిఫెరల్స్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1700 కోట్లు సమీకరించనున్నాయి. ఫిబ్రవరి 7న వీటి సబ్స్క్రిప్షన్ ప్రారంభమై.. 9న ముగియనున్నాయి.
2024లో ఐపీఓ మార్కెట్లో బుల్లిష్ ఔట్లుక్ ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొత్త రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇదే అదునుగా నిధులు సమీకరించుకునేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గతేడాది సైతం మార్కెట్లో ఇదే ఉత్సాహం కనిపించింది. మొత్తం 58 కంపెనీలు రూ.52,637 కోట్ల నిధులను సమీకరించాయి. 2022లో 40 కంపెనీలు రూ.59,302 కోట్లు సమకూర్చుకున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీ అప్పుడే ఐపీఓకు వచ్చింది.
త్వరలో పసిడి బాండ్ల సబ్స్క్రిప్షన్.. ఆన్లైన్లో ఎలా కొనాలి?
ఐపీఓల వివరాలు ఇవీ..
- ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ఉత్పత్తులను డిస్ట్రిబ్యూటర్ రాశి పెరిఫెరల్స్ సంస్థ (Rashi Peripherals IPO) పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.600 కోట్లు సమీకరించనుంది. పూర్తిగా ఫ్రెష్ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ఈ మొత్తం సేకరించనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.295-311గా నిర్ణయించింది. ఈ మొత్తాన్ని రుణాలు తీర్చేందుకు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
- ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు టీపీజీ, మోర్గాన్ స్టాన్లీ మద్దతు కలిగిన జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ (Jana Small Finance Bank IPO) ద్వారా రూ.570 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ.462 కోట్లను తాజా షేర్ల జారీ ద్వారా, మిగిలిన రూ.108 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.393-414గా నిర్ణయించారు. ఈ నిధులను భవిష్యత్తు అవసరాల కోసం, క్యాపిటల్ అడిక్వసీ రేషియో మెరుగుదలకు వినియోగించనున్నారు.
- క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Capital Small Finance Bank IPO) రూ.450 కోట్లు విలువైన ఫ్రెష్ షేర్ల జారీ ద్వారా, రూ.73 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనుంది. మొత్తంగా రూ.523 కోట్లు సమీకరించనుంది. ఐపీఓ కోసం ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.445-468గా నిర్ణయించింది. ఐపీఓ నిధులను భవిష్యత్ అవసరాల కోసం వినియోగించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్