Spam Calls: ఇకపై స్పామ్, ప్రమోషనల్ కాల్స్కు గుడ్బై!
స్పామ్ కాల్స్ (Spam Calls) నుంచి అవగాహనతో కొంత మంది యూజర్లు బయటపడుతుంటే.. అవగాహనలేమితో మరికొంత మంది మోసపోతున్నారు. ఈ తరహా ఫోన్ కాల్స్ నుంచి మొబైల్ యూజర్లకు విముక్తి కలిగించేందుకు ట్రాయ్ (TRAI) కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది.
దిల్లీ: సాధారణంగా మన కాంటాక్ట్ లిస్ట్లో లేని నంబర్ నుంచి ఫోన్ రాగానే ఎవరు చేస్తున్నారనే ఆసక్తితో కాల్ అటెండ్ చేస్తాం. అవతలి వ్యక్తులు ఫలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం.. లోన్ కావాలా?, క్రెడిట్ కార్డ్ ఇస్తామనే మాట వినగానే అది స్పామ్ కాల్ (Spam Call) అని తెలిసి పట్టరానంత కోపం వస్తుంది. మరోవైపు లాటరీ గెలుచుకున్నారని, క్రెడిట్/డెబిట్ కార్డు గడువు ముగిసిందంటూ మోసపూరిత కాల్స్ వస్తుంటాయి.
ఇలాంటి స్పామ్/స్కామ్ కాల్స్ నుంచి అవగాహనతో కొంత మంది యూజర్లు బయటపడుతుంటే.. అవగాహనలేమితో మరికొంత మంది మోసపోతున్నారు. ఈ తరహా ఫోన్ కాల్స్ నుంచి మొబైల్ యూజర్లకు విముక్తి కలిగించేందుకు టెలికామ్ నియంత్రణ సంస్థ (TRAI) కొత్త నిబంధనను నేటి (మే 1, 2023) నుంచి అమల్లోకి తీసుకొచ్చింది.
ఎలా పనిచేస్తుంది?
ఈ నిబంధన ప్రకారం టెలికాం నెట్వర్క్ ఆపరేటర్లు (ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్) ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్ సేవల్లో కృత్రిమ మేధ (AI) ఆధారిత స్పామ్ ఫిల్టర్స్ను ఉపయోగించాలి. ఈ ఫిల్టర్స్ వేర్వేరు వ్యక్తులు లేదా సంస్థల నుంచి వచ్చే నకిలీ, మార్కెటింగ్ కాల్స్తోపాటు మెస్సేజ్లను గుర్తించి అడ్డుకుంటాయని ట్రాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. దీని వల్ల యూజర్లు స్పామ్ లేదా స్కామ్ కాల్స్ (Scam Calls) మోసాలకు గురికాకుండా ఉంటారని వెల్లడించింది. ప్రస్తుతం ఎయిర్టెల్, జియో సంస్థలు ఈ ఫిల్టర్ల ద్వారా సేవలు అందించేందుకు అంగీకరించాయి. ఎయిర్టెల్ ఇప్పటికే వీటిని అమలు చేస్తుండగా, త్వరలో జియో కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
ప్రమోషనల్ కాల్స్ వద్దు.. కాలర్ ఐడీ ఉంటే మేలు
టెలికాం నెట్వర్క్ సంస్థలు 10 అంకెల మొబైల్ నంబర్ ద్వారా చేసే ప్రమోషనల్ కాల్స్ను అనుమతించవద్దని ట్రాయ్ సూచించింది. వీటి ద్వారా నేరగాళ్లు యూజర్లకు ఫోన్ చేసి బ్యాంకు ఖాతాల్లోని నగదు దొంగిలిస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. దీంతోపాటు ఫోన్ కాల్ ఎవరి నుంచి వస్తుందనేది తెలుసుకునేందుకు వీలుగా ఫోన్ చేస్తున్న వ్యక్తి ఫొటో, పేరు మొబైల్ స్క్రీన్పై కనిపించేలా కాలర్ ఐడీ (Caller ID) ఫీచర్ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది.
ఈ ఫీచర్తో ఫోన్ కాల్స్ ద్వారా జరిగే సైబర్ నేరాలకు అడ్డుకోవచ్చని ట్రాయ్ అభిప్రాయపడుతోంది. అయితే, గోప్యతా కారణాల రీత్యా ఎయిర్టెల్, జియో సంస్థలు ఈ ఫీచర్ను ఉపయోగించేందుకు ఆసక్తి వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాలర్ ఐడీ అమలుకు సంబంధించి టెలికాం నెట్వర్క్ సంస్థలు, ట్రాయ్ మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
BSNL: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు తమ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకునేవారి నుంచి ఎలాంటి ఇన్స్టలేషన్ ఛార్జీలు వసూలు చేయబోమని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. -
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
Wearable AC: మెడపై ధరించి ఎక్కడికైనా వెంట తీసుకెళ్లగలిగేలా సోనీ ఓ కొత్త ఏసీ డివైజ్ను తీసుకొచ్చింది. -
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఎయిర్టెల్ కొత్త రోమింగ్ ప్యాక్స్.. 184 దేశాలకు ఒకే ప్యాక్
ఎయిర్టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్టెల్ తెలిపింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్టాప్ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..?
తాజా వార్తలు (Latest News)
-
‘హార్దిక్ ధ్రుడంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య
-
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?