Paytm crisis: ‘భయపడొద్దు’.. ఉద్యోగులకు పేటీఎం బాస్ భరోసా
Vijay Shekhar Sharma: పేటీఎంపై నెలకొన్న అనిశ్చితి వేళ కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఉద్యోగులకు భరోసానిచ్చారు. ఉద్యోగాలపై భయాందోళనలు అవసరం లేదని చెప్పారు.
దిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm payments bank) భవిష్యత్పై నీలినీడలు కమ్ముకున్న వేళ.. కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ (Vijay Shekhar Sharma) ఉద్యోగులతో భేటీ అయ్యారు. కంపెనీ భవిష్యత్పై ఆందోళన చెందొద్దని, ఉద్యోగులకు ఎలాంటి ముప్పూ లేదని భరోసానిచ్చారు. కంపెనీలో ఎలాంటి లేఆఫ్లు చేపట్టడం లేదన్నారు. ఆర్బీఐతో సంప్రదింపులు జరుపుతామన్నారు. వివిధ బ్యాంకులతోనూ చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఉద్యోగులతో విజయ్ శేఖర్ శర్మ టౌన్హాల్లో మీటింగ్ నిర్వహించారు. దాదాపు 800-900 మంది ఉద్యోగులతో గంటకు పైగా మాట్లాడారు. సరిగ్గా ఏం జరిగిందనేది తెలీనప్పటికీ.. మరికొన్ని రోజుల్లో సమస్యలు పరిష్కరించుకోగలమని భరోసా ఇచ్చారు. ‘‘పేటీఎం కుటుంబంలో మీరంతా సభ్యులు. మీ ఉద్యోగాలపై ఆందోళన అవసరం లేదు’’ అని విజయ్శేఖర్ శర్మ చెప్పినట్లు కొందరు సీనియర్ ఉద్యోగులు తెలిపారు.
ఆర్బీఐ ఆంక్షలు.. Paytm షేర్లలో కొనసాగుతున్న అమ్మకాలు
బ్యాంకులతో సంప్రదింపులు
మరోవైపు పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను బదిలీ చేసేందుకు పేటీఎం వివిధ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇదే విషయాన్ని టౌన్హాల్ మీటింగ్లో విజయ్ శేఖర్ శర్మ ప్రస్తావించారు. అయితే, ఇప్పటికిప్పుడు పేటీఎంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఏ బ్యాంకూ సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఆర్బీఐ నుంచి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చాకే ముందుకెళ్లాలని పబ్లిక్, ప్రైవేటు బ్యాంకులు భావిస్తున్నాయి. ఒకవేళ అకౌంట్లు ఇతర బ్యాంకులకు బదిలీ చేసినా.. పేటీఎం యాప్లోనే సేవలు కొనసాగుతాయి. స్పాన్సర్ బ్యాంక్ మాత్రమే మారుతుంది. ఇప్పటికే పేటీఎం వినియోగదారులకు సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎస్బీఐ ప్రకటించింది. ఒకవేళ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేస్తే పేటీఎంను కాపాడేందుకు మేం నేరుగా వెళ్లే ప్రణాళిక ఏదీ ఉండబోదని బ్యాంక్ ఛైర్మన్ దినేశ్కుమార్ స్పష్టంచేశారు. ఆర్బీఐ గనుక తమకు మార్గదర్శకాలు జారీ చేసి, ఏదైనా ప్రభావం ఉంటే మేం అక్కడ ఉంటామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.
తాజా వార్తలు (Latest News)
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్