Reliance AGM: 5జీ ఫోన్.. 5జీ ప్లాన్స్.. రిలయన్స్ ఏజీఎం రానున్న ప్రకటనలు ఇవే!
RIL AGM Expectations: ఆగస్టు 28న రిలయన్స్ ఏజీఎం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సారీ పలు కీలక ప్రకటనలు ఉండే అవకాశం కల్పిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ముకేశ్ అంబానీకి (Mukesh ambani) చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సాధారణ సమావేశం (Reliance AGM) ఆగస్టు 28న జరగనుంది. 2016లో జియో టెలికాం నెట్వర్క్ లాంచింగ్ అనంతరం రిలయన్స్ ఏజీఎంల పట్ల ఆసక్తి మొదలైంది. సామాన్యులకూ కనెక్ట్ అయ్యే విధంగా ప్రతి ఏజీఎంలోనూ ఏదో ఒక ప్రకటన ఉంటూ వస్తోంది. దీంతో ఈ సారి ఏజీఎంలో ఎలాంటి ప్రకటనలు ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. టెలికాం, రిటైల్, ఎనర్జీ వంటి కీలక రంగాలపై ఈ సారి ప్రకటనలు ఉండే అవకాశం ఉంది.
5జీ ప్లాన్స్: రిలయన్స్ జియో 2016లో దేశీయ టెలికాం మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో సంచలనాలకు వేదికైంది. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద టెలికాం నెట్వర్క్గా అవతరించింది. గతేడాది 5జీ సేవలనూ ప్రారంభించింది. అయితే ప్రస్తుతం జియో వెల్కమ్ ఆఫర్ కింద అపరిమిత 5జీ డేటాను జియో ఉచితంగా అందిస్తోంది. ఈ ఏజీఎంలో 5జీ ప్లాన్లను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, 4జీ ధరల్లోనే ఇవీ ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
చంద్రయాన్-3 నేర్పే ఆర్థిక పాఠాలు
5జీ ఫోన్: ‘2జీ ముక్త్భారత్’ నినాదంతో జియో ఇప్పటికే పలు ఫోన్లను లాంచ్ చేసింది. సాధారణ స్మార్ట్ఫోన్లతో పోలిస్తే తక్కువ ధరలో ఈ ఫోన్ ధరలు, టెలికాం ప్లాన్లూ ఉంటాయి. ఇదే కోవలో గూగుల్తో కలిసి ఓ 5జీ ఫోన్ను తీసుకొస్తున్నట్లు గతేడాది రిలయన్స్ ప్రకటించింది. ఈ సారి రెండు ఫోన్లను తీసుకొస్తారని ప్రచారం జరుగుతోంది. వీటి ధరలు ఎంత? ఏమేం ఫీచర్లు ఉంటాయి? వీటికోసం స్పెషల్ ప్లాన్లు తీసుకొస్తారా? అనేది తెలియాలి.
ఎయిర్ ఫైబర్.. కొన్ని రోజులు ఫ్రీ!: టెలికాం సర్వీసులతో పాటు ఫైబర్ సేవలనూ అందిస్తోంది జియో. త్వరలో ఫైబర్ కేబుల్స్ అవసరం లేకుండా ఎయిర్ఫైబర్ పేరుతో ఓ 5జీ డివైజ్నూ జియో తీసుకురాబోతోంది. ఇప్పటికే ఎయిర్టెల్ ఈ తరహా ఫైబర్ డివైజ్ను తీసుకొచ్చింది. ఈ ఏజీఎంలో జియో ఎయిర్ఫైబర్ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. డివైజ్ లాంచ్ చేసిన కొన్ని రోజుల వరకు కొనుగోలుపై డిస్కౌంట్ లేదా కొంత కాలం పాటు ఫ్రీ ట్రయల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలా?.. ఇలా చేయండి..
ఐపీఓలపై అప్డేట్: రిలయన్స్ నుంచి రానున్న ఐదేళ్లలో రెండు ఐపీఓలు రానున్నట్లు రిలయన్స్ 2019లోనే వెల్లడించింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్లో ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ రూ.8,278 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీంతో రిలయన్స్ రిటైల్ ఐపీఓకు సంబంధించి ఏజీఎంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించీ అప్డేట్ ఉండే అవకాశం ఉంది. ఇదే ఏజీఎంలో క్లీన్ ఎనర్జీలో పెట్టుబడుల గురించీ ఏవైనా ప్రకటనలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. గిగా ఫ్యాక్టరీల ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనలూ వచ్చే అవకాశం ఉంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఏజీఎం ప్రారంభం కానుంది. యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్