Nasiruddin Ansari: యూట్యూబర్పై సెబీ కొరడా.. రూ.17 కోట్లు కట్టాలని ఎందుకు ఆదేశించింది?
Nasiruddin Ansari: సామాజిక మాధ్యమాల వేదికగా స్టాక్ సిఫార్సులను అందిస్తున్న నసీరుద్దీన్ అన్సారీపై సెబీ నిషేధం విధించింది. ఆయన బాప్ ఆఫ్ చార్ట్ పేరిట యూట్యూబ్ ఛానెల్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ముంబయి: ఇటీవల సామాజిక మాధ్యమాల్లో స్టాక్ మార్కెట్కు సంబంధించి చాలా సమాచారం అందుబాటులోకి వస్తోంది. చాలా మంది తమకు తాము స్టాక్ మార్కెట్ నిపుణులుగా చెబుతూ కొన్ని స్టాక్స్ను సిఫార్సు చేస్తున్నారు. దీంతో చాలా మంది సామాన్యులు నష్టపోతున్నారు. ఇలాంటి ఉదంతాలను అరికట్టేందుకు సెబీ (SEBI) నడుం బిగించింది. తాజాగా మహమ్మద్ నసీరుద్దీన్ అన్సారీ (Nasiruddin Ansari) అనే వ్యక్తిని స్టాక్ మార్కెట్ నుంచి నిషేధించింది. ఆయన నిర్వహిస్తున్న సంస్థ ‘బాప్ ఆఫ్ చార్ట్ (Baap Of Chart)’ను సైతం నిలిపివేయాలని ఆదేశించింది.
స్టాక్ మార్కెట్పై అవగాహన పేరుతో వివిధ కోర్సులు నిర్వహిస్తూ అన్సారీ (Nasiruddin Ansari) కొన్ని స్టాక్లను మదుపర్లకు సిఫార్సు చేస్తున్నాడు. అందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకున్నాడు. తన కోర్స్లో చేరిన వారికి కచ్చితమైన రాబడి ఉంటుందంటూ సామాన్యులను ప్రభావితం చేస్తున్నాడు. వివిధ కోర్సుల పేరిట సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని.. వారిని బలవంతంగా సెక్యూరిటీ మార్కెట్లోకి లాగుతున్నారని గుర్తించిన సెబీ (SEBI) అతణ్ని మార్కెట్ నుంచి నిషేధించింది. కోర్సుల పేరిట సామాన్య ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన రూ.17.2 కోట్లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
అన్సారీ (Nasiruddin Ansari) ప్రధానంగా సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్, ఎక్స్ (ట్విటర్), ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రాం వేదికగా స్టాక్లను సిఫార్సు చేస్తున్నాడు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉన్న తన యాప్లను డౌన్లోడ్ చేసుకొని కోర్సులను తీసుకోవాలని ప్రభావితం చేస్తున్నాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ మార్కెట్లకు సంబంధించి 19 కోర్సులను విక్రయిస్తున్నాడు. వీటిలో నాలుగింటిలో కచ్చితమైన రాబడి ఉంటుందని హామీ ఇస్తున్నాడు. ‘బాప్ ఆఫ్ చార్ట్ (Baap Of Chart)’ యూట్యూబ్ ఛానెల్కు 4.43 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండడం గమనార్హం. దీంట్లో ఉన్న వీడియోలకు ఏడు కోట్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. ‘బాప్ ఆఫ్ చార్ట్ ఆప్షన్ హెడ్జింగ్’ టెలిగ్రాం ఛానెల్కు 53,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇన్స్టాలో 59 వేలు, ఎక్స్లో 78 వేల మంది బాప్ ఆఫ్ చార్ట్ (Baap Of Chart)ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాట్సాప్ ఛానెల్లోనూ 13 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీటితో పాటు ఆయన తరచూ నిర్వహించే వర్క్షాప్లకు వందలాది మంది హాజరవుతున్నారు.
వివిధ కోర్సులు, వర్క్షాప్ల ద్వారా నసీరుద్దీన్ ఇప్పటి వరకు దాదాపు రూ.13.78 కోట్లు వసూలు చేసినట్లు సెబీ (SEBI) దర్యాప్తులో తేలింది. మరోవైపు రూ.3.42 కోట్లు యూపీఐ ఐడీల ద్వారా సేకరించారు. మొత్తంగా రూ.17.2 కోట్లు తిరిగి చెల్లించాలని సెబీ ఆదేశించింది. తాము చెప్పే సలహాలు, సూచనలు కచ్చితమైనవని చెప్పడానికి అన్సారీ (Nasiruddin Ansari) పరిధులు దాటి వ్యవహరించారని స్పష్టం చేసింది. సామాన్యులను ప్రభావితం చేసేలా వీడియోలు చేస్తూ వారిని బలవంతంగా సెక్యూరిటీ మార్కెట్లోకి లాగే ప్రయత్నం చేశారని తెలిపింది. స్థూలంగా చూస్తే ఆయన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు నిర్ధారించింది.
ఇన్వెస్టర్లు ఆన్లైన్ మాధ్యమాల ద్వారా స్టాక్ మార్కెట్కు సంబంధించిన సలహాలు, సూచనలు తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సెబీ సూచించింది. సెబీ (SEBI) నమోదిత ఆర్థిక నిపుణులపైనే ఆధారపడాలని హితవు పలికింది. ప్రస్తుతం తమ వద్ద 1,313 మంది రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు ఉన్నట్లు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ 22,400 పైకి నిఫ్టీ
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో మదుపర్ల కొనుగోళ్ల జోరుతో గురువారం సూచీలు లాభాల్లో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు మార్కెట్లను నడిపించాయి. -
4 లక్షల కోట్ల డాలర్ల భారత్!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనే మన దేశ ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.332 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎమ్) సభ్యుడు సంజీవ్ సన్యాల్ అంచనా వేశారు. -
మహీంద్రా రూ.37,000 కోట్ల పెట్టుబడులు
మహీంద్రా గ్రూప్ తన వాహన విభాగంలో వచ్చే మూడేళ్లలో రూ.37,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. 2030 కల్లా మరో 23 కొత్త వాహనాలను విపణిలోకి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. -
కిమ్స్ హాస్పిటల్స్కు రూ.71.6 కోట్ల లాభం
కిమ్స్ హాస్పిటల్స్ (కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.637.6 కోట్ల ఆదాయాన్ని, రూ.71.6 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
261% పెరిగిన గెయిల్ లాభం
ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,176.97 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. -
వస్తువుల ఎగుమతులు రూ.41.5 లక్షల కోట్లకు!
మన దేశ వస్తువుల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో 60-70 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.98-5.81 లక్షల కోట్ల) మేర పెరిగి 500 బి.డాలర్ల (సుమారు రూ.41.5 లక్షల కోట్లు)ను అధిగమించే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సమాఖ్య ఫియో (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్) అంచనా వేసింది. -
రూ.7,675 కోట్లకు పెరిగిన వొడాఫోన్ ఐడియా నష్టం
వొడాఫోన్ ఐడియా, మార్చి త్రైమాసికంలో రూ.7,675 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.6,419 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
నరేశ్ గోయెల్ భార్య అనిత కన్నుమూత
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్ భార్య అనిత గోయెల్(70) గురువారం దక్షిణ ముంబయిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. -
వినీత్ నయ్యర్ కన్నుమూత
టెక్ మహీంద్రా మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి అయిన వినీత్ నయ్యర్ (85) గురువారం ఉదయం దిల్లీలో మృతి చెందారు. -
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్ మృతి
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్(65) కన్నుమూశారని బీకే బిర్లా గ్రూప్ గురువారం ప్రకటించింది. అనారోగ్య కారణంగా కోల్కతాలోని ఆమె స్వగృహంలో తుదిశ్వాస విడిచారని గ్రూప్ అధికారులు తెలిపారు. -
42 కోట్ల మంది గగన విహారం!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, దేశంలో విమాన ప్రయాణికుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరి రికార్డులు బద్దలు కొట్టొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. -
రికార్డు గరిష్ఠాలకు వెండి
బంగారం, వెండి ధరలు గత రెండు రోజుల్లో బాగా పెరిగాయి. వెండి అయితే కిలో ధర తొలిసారిగా రూ.88,000ను మించింది. గత రెండు రోజుల్లోనే కిలోకు రూ.1500కు పైగా పెరిగింది. -
62.48% పెరిగిన పిట్టీ ఇంజినీరింగ్ లాభం
ఎలక్ట్రికల్ స్టీల్ ల్యామినేషన్లు, మోటార్లు/ జనరేటర్లకు సబ్-అసెంబ్లీస్, డైకాస్ట్ రోటార్స్ ఉత్పత్తి చేసే సంస్థ పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. -
పోకర్ణ లాభం రూ.15.51 కోట్లు
పోకర్ణ లిమిటెడ్ మార్చి త్రైమాసికానికి రూ.164.38 కోట్ల ఆదాయాన్ని, రూ.15.51 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
ఎం అండ్ ఎం లాభం రూ.2,754 కోట్లు
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,754 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
ఐటీ, టెక్నాలజీ సొల్యూషన్లు అందించే ఏసర్ గ్రూప్, గృహోపకరణాల విపణిలోకి ప్రవేశించింది. ఇందుకోసం నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయంగా ఏసర్ప్యూర్ బ్రాండ్ను ఆవిష్కరించిన సంస్థ, తాజాగా వివిధ ఉత్పత్తులను మన దేశంలో ఆవిష్కరించింది. -
స్టాక్ మార్కెట్... పెట్టుబడులు.. కాస్త అప్రమత్తంగా
ఎన్నికలు.. ఇతర కారణాలతో స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మదుపరులు మన మార్కెట్లపై నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణం అంటూ సానుకూల మాటలు.. -
జీవిత బీమా పన్ను ఆదాకు మించి
ఆదాయపు పన్ను మినహాయింపు గురించి ఆలోచించే వారు ముందుగా చూసేది బీమా పాలసీలనే. పన్ను ప్రణాళికలను ప్రారంభించాల్సిన సమయం కావడంతో బీమా సంస్థలూ ఇప్పుడు పలు కొత్త పాలసీలతో ముందుకు వస్తుంటాయి. -
సూపర్ టాపప్ తీసుకోవచ్చా?
నా వయసు 57. నాకు బృంద ఆరోగ్య బీమా ఉంది. దీనికి అదనంగా వ్యక్తిగతంగా మరో పాలసీ తీసుకుంటే బాగుంటుందా? లేదా సూపర్ టాపప్ను ఎంచుకోవాలా? -
కార్డు బాకీ తీర్చలేకపోతే
చేతిలో డబ్బులు లేకపోయినా వస్తువులను కొనుగోలు చేసేందుకు క్రెడిట్ కార్డులు వెసులుబాటును అందిస్తాయి. ఈ సౌలభ్యం కొన్నిసార్లు అధిక ఖర్చుకూ దారి తీస్తుంది. చివరకు గడువులోపు బిల్లు చెల్లించలేని పరిస్థితి వస్తుంది. -
కారు రుణం ముందే తీర్చేస్తే
అప్పు చేసి కారు కొంటాం.. మన దగ్గర అనుకోకుండా డబ్బు వచ్చి, ఈ రుణం తీర్చేయాలని అనుకున్నాం అనుకోండి.. అప్పుడు ఏం చేయాలో చూద్దామా..
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
-
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!