Zepto: జెప్టో జాక్పాట్.. ₹1,653 కోట్ల నిధుల సమీకరణ
Zepto funding: ముంబయికి చెందిన స్టార్టప్ కంపెనీ జెప్టో జాక్పాట్ కొట్టింది. స్టెప్స్టోన్ గ్రూప్ సహా ఇతర ఇన్వెస్టర్ల నుంచి రూ.1600 కోట్ల మేర నిధులు సమీకరించింది.
దిల్లీ: ముంబయికి చెందిన ఆన్లైన్ గ్రాసరీ స్టార్టప్ జెప్టో (Zepto) జాక్పాట్ కొట్టింది. స్టెప్స్టోన్ గ్రూప్, ఇతర కంపెనీల ఇన్వెస్టర్ల నుంచి 200 మిలియన్ డాలర్లు (రూ.1653 కోట్లు) నిధులు సమీకరించింది. ఈ ఫండింగ్ ద్వారా ఈ ఏడాది యూనికార్న్ అవతరించిన తొలి స్టార్టప్గా జెప్టో నిలిచిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. స్టార్టప్ కంపెనీలకు కొన్ని నెలలుగా ఫండింగ్ నెమ్మదించిన వేళ.. జెప్టోకు ఈ నిధులు అందడం గమనార్హం.
ఫండింగ్ నేపథ్యంలో జెప్టో తన ఐపీఓ ప్రణాళికను బయటపెట్టింది. 2025 నాటికి ఐపీఓకు రావాలనుకుంటున్నట్లు జెప్టో వ్యవస్థాపకులు అదిత్ పలీచా, కైవల్య వోహ్రా పేర్కొన్నారు. రానున్న 12-15 నెలల్లో కంపెనీని లాభాల్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఇది ఆరంభం మాత్రమేనని, అందుకోవాల్సింది చాలా ఉందని జెప్టో సీఈఓ అదిత్ పలీచా పేర్కొన్నారు. రాబోయే కొన్ని త్రైమాసికాల్లో 1 వార్షిక బిలియన్ డాలర్ల అమ్మకాలు సాధిస్తామని వోహ్రా పేర్కొన్నారు. ఈ ఫండింగ్ రౌండ్లో కాలిఫోర్నియాకు చెందిన గుడ్ వాటర్ కేపిటల్తో పాటు, స్టెప్స్టోన్ గ్రూప్ నిధులు అందించాయి. ఇప్పటికే నిధులు సమకూర్చిన నెక్సస్ వెంచర్ పార్టనర్స్, గ్లేడ్ బ్రూక్ క్యాపిటల్, ల్యాచీ గ్రూమ్ సైతం ఈ రౌండ్ ఫండింగ్లో పాల్గొన్నాయి.
Zepto: చిటికేసి... వేల కోట్లు సృష్టించిన చిన్నోళ్లు!
స్టాన్ఫర్డ్ చదువు వదిలేసి...
బెంగళూరులో జన్మించిన కైవల్య దుబాయ్ కాలేజీలో చదివాడు. అదిత్ ముంబయిలో పుట్టి పెరిగాడు. దుబాయ్లో చదివాడు. అలా ఇద్దరూ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదవటానికి విశ్వవిఖ్యాత స్టాన్ఫర్డ్ కాలేజీకి వెళ్లారు. చదువు మధ్యలోనే వదిలేసుకొని భారత్కు తిరిగి వచ్చారు. కరోనా లాక్డౌన్ వేళ తట్టిన ఐడియా.. వారి జీవితాన్నే మలుపు తిప్పింది. 2020 కరోనా లాక్డౌన్ సమయంలో ముంబయిలో అపార్ట్మెంట్లో ఉన్న వీరిద్దరూ.. చాలామంది సామాన్యుల మాదిరిగానే నిత్యావసర సరకులకు ఇబ్బంది పడ్డారు. తొలుత కైవల్య... కిరాణామార్ట్ పేరుతో ఈ స్టార్టప్ ఆరంభించాడు. తర్వాత అదిత్ చేరాడు. స్థానిక కిరాణా దుకాణాలతో ఒప్పందం కుదుర్చుకొని.. తక్షణమే ఇళ్లకు సామగ్రిని చేర వేయటం మొదలెట్టారు. కంపెనీ కార్యకలాపాలకు సంబంధించి తొలుత తమపై తామే ప్రయోగాలు చేసుకున్నారు. ఆ అనుభవాలతో సరిదిద్దుకుంటూ వెళ్లారు. అలా జెప్టో రూపంలో 10 నిమిషాల్లోనే వస్తువులను ఇంటికి చేర్చే స్టార్టప్ను నెలకొల్పారు. కేవలం ఆరు నెలల్లోనే నిలదొక్కుకున్నారు. అంతేకాదు 2022 ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా సంపన్నుల జాబితాలోనూ ఈ ఇద్దరు కుర్రాళ్లు చోటు దక్కించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఎఫ్అండ్ఓపై ఎందుకింత మోజు..?
దేశంలో పొదుపు మొత్తాలు ఎఫ్అండ్ఓ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) ట్రేడ్లోకి వెళ్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
ఐసీఐసీఐ మాజీ ఛైర్మన్ వాఘుల్ కన్నుమూత
ప్రభుత్వ రంగంలోని ఐసీసీఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నారాయణ్ వాఘుల్ (88) ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్ పరిశ్రమలో ఆయన ప్రస్థానం 1960లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. -
ఓయో ఐపీఓ దరఖాస్తు ఉపసంహరణ!
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును ఓయో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఉందని.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి ఐపీఓకు దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో దేశంలోకి పసిడి ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగి రూ.2225 కోట్ల (268.04 మిలియన్ డాలర్ల) స్థాయికి చేరాయని జెమ్ అండ్ జువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి తెలిపింది. 2023 ఏప్రిల్లో ఇవి సుమారుగా రూ.267 కోట్ల (32.12 మిలియన్ డాలర్ల) స్థాయిలోనే ఉన్నాయి. -
చైనా ఈవీలు, లోహాలపై దిగుమతి సుంకాల పెంపు
చైనాలో తయారయ్యే విద్యుత్ వాహనాలు (ఈవీ), అత్యాధునిక బ్యాటరీలు, సోలార్ సెల్స్, వైద్య సామగ్రితో పాటు అక్కడ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై కొత్త టారిఫ్లు విధిస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రత్యేక ట్రేడింగ్లో స్వల్ప లాభాలు
విదేశీ మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రాథమిక సైట్లో వైఫల్యం తలెత్తినా ఎదుర్కొనేందుకు వాటి సంసిద్ధతను తనిఖీ చేయడానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను శనివారం రెండు దఫాలుగా నిర్వహించాయి. -
వ్యవసాయ అంకురాలు దూసుకెళ్తున్నాయ్
అనుకూల వ్యాపార విధానాలు, ప్రభుత్వ మద్దతు కారణంగా గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ - అనుబంధ రంగాల్లో అంకురాల సంఖ్య దాదాపు 7,000కు పైగా పెరిగిందని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
దొడ్ల డెయిరీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.787.4 కోట్ల ఆదాయం, రూ.46.8 కోట్ల నికర లాభం, రూ.7.79 ఈపీఎస్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.724.3 కోట్లు, నికరలాభం రూ.22.5 కోట్లు, ఈపీఎస్ రూ.3.76 ఉన్నాయి. -
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
-
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం
-
పెట్టుబడి అంటే పట్టుబడినట్టే.. లాభాల పేరుతో సైబర్ నేరగాళ్ల దందా