Zomato: జొమాటో కొత్త సేవలు.. వెజిటేరియన్స్కు ఇక ప్రత్యేకంగా
Zomato launches Pure Veg Mode: వెజిటేరియన్ల కోసం జొమాటో కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టింది. శాకాహార పదార్థాలను ప్రత్యేకంగా డెలివరీ చేసేందుకు ప్యూర్ వెజ్ మోడ్ను తీసుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో (zomato) కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టింది. శాకాహారుల కోసం ‘ప్యూర్ వెజ్ మోడ్’ను ( Pure Veg Mode) తీసుకొచ్చింది. ఈ ఆహారాన్ని డెలివరీ చేసేందుకు ప్రత్యేకంగా డెలివరీ ఏజెంట్లను ఏర్పాటుచేసింది. దేశంలో పెద్దసంఖ్యలో శాకాహారుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ సేవలు ప్రారంభించినట్లు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈతరహా సేవలు మరిన్ని తీసుకురానున్నట్లు చెప్పారు.
దేశంలో శాకాహారులు పెద్దసంఖ్యలో ఉన్నారని గోయల్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆన్లైన్లో వారు ఆహారం తెప్పించుకునేటప్పుడు దాన్ని ఎలా వండుతున్నారు? దాన్ని ఎలా తీసుకొస్తారనే విషయంలో ఆందోళన చెందుతున్నారని, ఈవిషయంలో తమకు ఫీడ్బ్యాక్ అందిందని చెప్పారు. ఈ క్రమంలోనే గ్రీన్ మోడ్ సేవలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తోటి ఉద్యోగితో కలిసి స్వయంగా డెలివరీ అందజేశారు.
₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్
ప్యూర్ వెజ్ మోడ్ ఎంచుకున్నప్పుడు ఆ లిస్ట్లో ఉన్న రెస్టరంట్ల నుంచే ఆహారం అందిస్తామని గోయల్ పేర్కొన్నారు. ఈ ఫుడ్ డెలివరీ చేసే ఏజెంట్లను సైతం ప్రత్యేకంగా నియమించినట్లు చెప్పారు. నాన్-వెజ్ రెస్టరంట్లు, ఆయా రెస్టరంట్లు అందించే శాకాహార పదార్థాలు కూడా ఈ జాబితాలో కనిపించబోవని తెలిపారు. ఈ పదార్థాలను సరఫరా చేసే ఏజెంట్లు సైతం ఇతర ఆహారాన్ని బ్యాగుల్లో పెట్టుకోరని పేర్కొన్నారు. ఈ సేవల ప్రారంభం వెనక మతపరమైన, రాజకీయపరమైన ఉద్దేశాలేవీ లేవని పేర్కొన్నారు. భవిష్యత్లో కేక్ డెలివరీ కోసం ప్రత్యేక ఫ్లీట్ను ఏర్పాటుచేయనున్నామని, డెలివరీ సమయంలో కేక్ ఏమాత్రం పాడవకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాటు ఉంటుందని చెప్పారు. ఈ సేవలు కూడా మరికొన్ని వారాల్లోనే ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్