బహుజన, తెలంగాణవాదాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలి
రాజ్యాంగాన్ని కాపాడాలనే సంకల్పం, బహుజన, తెలంగాణ వాదం ఒక్కటేననే ఉద్దేశంతో తాను భారాసతో చేతులు కలిపినట్లు ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు.
భారాస నేత ఆర్ఎస్.ప్రవీణ్కుమార్
ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, ఆర్ఎస్.ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్నలను సన్మానిస్తున్న కార్యకర్తలు
కాగజ్నగర్, న్యూస్టుడే: రాజ్యాంగాన్ని కాపాడాలనే సంకల్పం, బహుజన, తెలంగాణ వాదం ఒక్కటేననే ఉద్దేశంతో తాను భారాసతో చేతులు కలిపినట్లు ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం కాగజ్నగర్లోని ఓ పంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికలలో సిర్పూరు నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేయగా, 44వేల ఓట్లు వేసిన వారికి, అభిమానులు, శ్రేయోభిలాషులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తాను పార్టీ మారితే మాజీ ఎమ్మెల్యే కోనప్పకు మింగుడు పడటం లేదని విమర్శించారు. భారాసలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేసిన కోనప్ప కేవలం అధికార దాహం కోసమే పార్టీ ఫిరాయించినట్లు ఆరోపించారు. బహుజన, తెలంగాణ వాదం నిలబడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు దోపిడీ పార్టీలేనని, వచ్చే ఎన్నికల్లో పట్టుమని మూడు సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు.
ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ.. భారాస ప్రభుత్వ హయాంలోనే సిర్పూరు, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీని కూడా సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. గతంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మళ్లీ భారాసను ఆదరించాలని కోరారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, ప్రజలకు అందుబాటులో మెరుగైన పాలన అందించాలనే ఉద్దేశంతో జిల్లాలను ఏర్పాటు చేసిన ఘనత భారాసకే దక్కుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ.. నాయకులు పార్టీలు ఫిరాయించినా భారాసకు పెద్దగా నష్టమేమీ లేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయన్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ నుంచి పలువురు భారాసలో చేరగా.. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బెజ్జూరు జడ్పీటీసీ సభ్యురాలు పుష్పలత, జడ్పీటీసీ సభ్యుడు అరిగెల నాగేశ్వర్రావు, నాయకులు మోయిన్, రాజ్కుమార్, నక్క శంకర్, లెండుగురు శ్యాంరావు, సోయం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమాలకే ప్రా‘ధాన్యం’?
[ 28-04-2024]
ఎక్కడ ముడిసరకు లభ్యమవుతుందో సాధారణంగా అక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ధాన్యం ఆశించిన రీతిలో పండకున్నా ఇక్కడ ఏకంగా తొమ్మిది రైస్ మిల్లులు ఏర్పాటయ్యాయి. -
భాజపా బలగాల మోహరింపు
[ 28-04-2024]
ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేలా భాజపా కార్యాచరణ చేపట్టింది. -
మండుటెండల్లో అంటుకుంటున్న అడవులు
[ 28-04-2024]
జిల్లాలో గతంకంటే ఈ ఏడాది ఎండల తీవ్రత అత్యధికంగా ఉండి ఉదయం పది గంటలకే ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. -
వంద ఎకరాలు కొట్టేసే పన్నాగం
[ 28-04-2024]
‘వడ్డించే వాడు మనవాడైతే చివర్లో కూర్చున్నా కంచంలోకి అన్నీ వచ్చి చేరుతాయి’ అన్న చందంగా అధికారులు, నేతలు కుమ్మక్కై వంద ఎకరాల భూమిని ఆక్రమించే ప్రయత్నం సాగుతోంది. -
నిధులు రాక.. నిర్వహణ లేక
[ 28-04-2024]
రైతులకు పండ్ల తోటల పెంపకంపై శిక్షణ ఇవ్వడం, మొక్కల ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన ఉద్యానవన నర్సరీ, రైతు శిక్షణ కేంద్రాలు నిర్వహణ లోపంతో మూతపడే దశకు చేరుకున్నాయి. -
ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 28-04-2024]
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కార్యకర్తలకు సూచించారు. -
నేర ప్రవృత్తి మార్చుకోవాలి : ఎస్పీ
[ 28-04-2024]
జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె.సురేష్కుమార్ తెలిపారు. -
ఓటర్లు @ 15,96,430
[ 28-04-2024]
మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్టుడే: ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా కొలిక్కివచ్చింది. -
సిబ్బంది కొరత.. వసతుల లేమి
[ 28-04-2024]
జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత, వసతుల లేమితో సరైన సేవలు అందక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ను గెలిపించాలి
[ 28-04-2024]
మనిషికి చేతులు ఎంతముఖ్యమో.. దేశానికి చేతిగుర్తు పార్టీ అవసరం అంతే ఉందని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ కోరారు. -
అవగాహన లేక.. అనుమతి పొందక..!
[ 28-04-2024]
పెళ్లి.. రిసెప్షన్.. పుట్టినరోజు.. ఇలా వేడుకేదైనా చాలామంది ఎంతో ఆర్భాటంగా నిర్వహించాలనుకుంటున్నారు. -
నీతి ఆయోగ్ పథకం.. అమలైతే అభివృద్ధి యోగం
[ 28-04-2024]
మారుమూల గిరిజన ప్రాంతమైన పెంబి మండలం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. కనీస వసతులు, రవాణా సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనేకం. -
గుంపులున్న చోటుపై గురి..
[ 28-04-2024]
ఎన్నికల ప్రచారానికి మరో 14 రోజులు మాత్రమే గడువుంది. లోక్సభ పరిధిలో రెండు వేలకు పైగా గ్రామాలు, 380కి పైగా గూడేలు, తండాలు ఉన్నాయి. -
పెద్దపల్లిలో స్థానికేతరులకే పెద్దపీట
[ 28-04-2024]
పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి ఎంపీలుగా ఎన్నికైనవారిలో ఇప్పటి వరకు స్థానికులెవరూ విజయం సాధించలేకపోయారు. -
మండే ఎండతో జాగ్రత్త..
[ 28-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆరెంజ్ జోన్లో ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. -
తూర్పున ఎంపీ.. పశ్చిమాన అభ్యర్థి
[ 28-04-2024]
జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామం మరోసారి తెరపైకి వచ్చింది. -
వేసవి తాపం.. కొబ్బరినీరే ఉపశమనం
[ 28-04-2024]
రామకృష్ణాపూర్లోని ఆర్కేపీ ఓసీ, సీహెచ్పీ, సింగరేణి ఏరియా ఆసుపత్రితో పాటు కాలనీల్లో భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం