రిజిస్ట్రేషన్లలో సవరణలు సరళీకృతం
భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లలో దొర్లిన తప్పులను సవరించుకోవడానికి అవకాశం లేక వేలాదిమంది ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. కేవలం దస్తావేజులో ఉన్న చిన్న చిన్న తప్పుల కారణంగా బ్యాంకు, ఇతర తనఖా రుణాలు పొందలేక అవస్థలు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే
భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లలో దొర్లిన తప్పులను సవరించుకోవడానికి అవకాశం లేక వేలాదిమంది ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. కేవలం దస్తావేజులో ఉన్న చిన్న చిన్న తప్పుల కారణంగా బ్యాంకు, ఇతర తనఖా రుణాలు పొందలేక అవస్థలు పడుతున్న విషయాన్ని అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు రిజిస్ట్రేషన్లలో తప్పుల సవరణను సరళతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ కార్యాచరణ చేపట్టింది.
పొలాలు, ఇళ్లు ఇలా ఏది కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్ తప్పని సరి. అలా రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తయారు చేసే దస్తావేజులో వివరాలు నమోదులో ఒకోసారి తప్పులు దొర్లుతుంటాయి. సరిహద్దులు, భూమి విస్తీర్ణం, సర్వేసంఖ్యలు, క్రయ, విక్రయదారుల మధ్య జరిగిన ఒప్పంద తేదీలు.. వీటిలో ఎలాంటి తప్పుదొర్లినా సవరించుకోవడానికి అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. దస్తావేజును తనఖా పెట్టి బ్యాంకు రుణాలు పొందాలనుకున్నా పరిశీలనలో దొర్లిన తప్పుల కారణంగా బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు. తప్పులు సవరిస్తేనే తదుపరి చర్యలు ఉంటాయంటూ వెనక్కి తిప్పి పంపుతున్నారు.మళ్లీ సవరించుకోవాలంటే భూమిని అమ్మిన వారు రాకపోవడం, ఒక వేళ వచ్చినా మళ్లీ అదనంగా డబ్బులు అడగడం, కొందరు విదేశాల్లో ఉండటం ఇలా వివిధ కారణాలతో తప్పులు సవరించుకోలేక జిల్లాలో వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. మచిలీపట్నంలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏటా 10 నుంచి 20వేల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. అవనిగడ్డ, చల్లపల్లి, గుడివాడ, మొవ్వ, పామర్రు, పెడన, కవుతరం ఇలా జిల్లాలో 13 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కలిపి సగటున 70వేల వరకు వివిధ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆయా కార్యాలయాల పరిధిలో తప్పుల సవరణకు ఎదురు చూస్తున్నవారు వేలసంఖ్యలో ఉన్నారు.
జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం
వ్యక్తిగత అఫిడవిట్తో..
భూములకు సంబంధించిన సర్వేసంఖ్య, సరిహద్దులు, తేదీల్లో సహా కొన్ని పొరపాట్లు రిజిస్ట్రేషన్ పత్రంలో నమోదైతే వాటిని వ్యక్తిగత అఫిడవిట్తో సవరించుకుని కొత్త రిజిస్ట్రేషన్ పత్రం పొందడానికి అవకాశం కల్పించారు. తాజాగా సవరించిన ఉత్తర్వుల ప్రకారం అనేకమందికి ఊరట లభించింది. ఎన్నో ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ చేసిన విక్రయదారులు అందుబాటులో లేకపోయినా, మరణించినా లేక వారి చిరునామా తెలియకపోయినా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. భూమి కొనుగోలు దారులే దొర్లిన తప్పులు, వాస్తవ వివరాలు తెలియజేస్తూ తగు విధంగా అఫిడవిట్ సమర్పిస్తే చాలు ఆమేరకు రిజిస్ట్రేషన్శాఖ పరిశీలించి రిజిస్ట్రేషన్ పత్రాల్లో మార్గదర్శకాలకు అనుగుణంగా మార్పులు చేసి కొత్త రిజిస్ట్రేషన్ పత్రాన్ని జారీ చేస్తుంది. పాత దస్తావేజుల్లో తప్పులను సవరించుకోవడంతోపాటు హద్దులు, స్థల విస్తీర్ణంలోనూ మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. అసలు భూమి విక్రయించిన వ్యక్తి లేకుండానే సవరణలు చేసుకోవడానికి మార్గం సుగమమయ్యింది. నిర్దేశించిన అంశాల వరకు మాత్రమే సవరించుకోవాలి. ఇదే అవకాశంగా భావించి ఎవరైనా ఇష్టానుసారంగా సర్వే సంఖ్యలు మార్చేసి అవకతవకలకు పాల్పడితే మాత్రం చట్టపర చర్యలు తీసుకుంటారు. దానికి రిజిస్ట్రార్లే బాధ్యత వహించాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భూవివాదాలు ఎక్కువగా ఉన్న సమయంలో వెలువడిన ఈ ఉత్తర్వులు బాధితులకు కొంత ఊరట ఇస్తుంది.
వినియోగించుకోవాలి: ఉపేంద్రరావు, జిల్లా రిజిస్ట్రార్
రిజిస్ట్రేషన్లలో జరిగిన తప్పులను సవరించుకోవడానికి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా భూమి విక్రయించినవారు అందుబాటులో లేక, ఆ వ్యక్తి మరణిస్తే వారసులు ఎక్కడున్నారో తెలియక అవస్థలు పడుతున్నారు. అలాంటి వారందరికీ ఇది మంచి అవకాశం. దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఎక్కువగా భూమి విస్తీర్ణం సమస్యలతో సవరణలకోసం తిరుగుతున్నారు. దస్తావేజులో తక్కువగా ఉంటే క్షేత్రస్థాయిలో విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివన్నీ సంబంధిత వ్యక్తి వాస్తవిక పత్రాలు అందించి తనే సవరించుకోవచ్చు. దీనిపై అవగాహన కల్పించాలని జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
[ 06-05-2024]
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
పెద్దిరెడ్డీ.. నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయి: నారా లోకేశ్
[ 06-05-2024]
పాపాల పెద్దిరెడ్డీ.. నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
జగనాసుర వారి.. నరకాపురి..!
[ 06-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని రహదారులపై ప్రయాణించినవారెవరైనా సరే.. జగన్ సర్కారును శాపనార్థాలు పెట్టకుండా ఉండలేరు. అటు ప్రైవేటు వాహనాలవారే కాదు.. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సైతం మేం నడపలేం అంటూ మొత్తుకున్న సందర్భాలెన్నో. పల్లె వెలుగు బస్సులు నడి రోడ్డుమీదనే ఎన్నిసార్లు నిలిచిపోయాయో లెక్కే లేదు. -
ఉద్యోగుల ఓట్లకూ వైకాపా గాలం..!
[ 06-05-2024]
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. వందల సంఖ్యలో ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యారు. వారికి బ్యాలట్ విడుదల కాలేదు. -
ప్రవాసాంధ్రులూ.. పారాహుషార్!
[ 06-05-2024]
ఒక్క వ్యవసాయ భూములు, పొలాలే కాదు... ఇళ్లు, ఇళ్ల స్థలాలు, భవనాలు సహా.. అన్నిరకాల స్థిరాస్తులకు ఎసరు పెట్టేసింది జగన్ సర్కారు. కొత్తగా తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రకారం దొడ్డిదారిన ఆస్తులను కాజేసే అక్రమార్కులకు ఇది వరంగా మారనుంది. -
ప్రశాంతంగా నీట్
[ 06-05-2024]
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. విజయవాడతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు కళాశాలల వద్దకు విద్యార్థులు, తల్లిదండ్రులు నిర్దేశిత సమయం కంటే ముందే చేరుకున్నారు. -
పట్టా లేదు... వంశీ.. పత్తా లేరు..
[ 06-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు అర్హులకు అందని ద్రాక్షగానే మారాయి. రాజకీయ అండదండలు ఉన్నవారికే అధిక శాతం పట్టాలు దక్కాయి. -
ఉట్టిపడిన సంప్రదాయం
[ 06-05-2024]
రుగ్వేదం పద్మశ్రీకి ప్రపంచ రికార్డు ప్రదానం చేయడం సంతోషంగా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో స్వరలయ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వరలయ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. -
తెదేపా కార్యకర్తలపై రెచ్చిపోయిన వైకాపా మూకలు
[ 06-05-2024]
ప్రశాతంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్న తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడికి పాల్పడిన సంఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. -
పేర్ని నాని అరాచకానికి చెక్ పెడదాం
[ 06-05-2024]
మచిలీపట్నం నియోజకవర్గాన్ని సొంత సామాజ్యంగా భావిస్తూ రాచరికపు పోకడలతో అన్ని వర్గాలను అణిచివేస్తున్న పేర్ని వెంకట్రామయ్య(నాని) కబంధ హస్తాల నుంచి నియోజకవర్గాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సైనిక్ సమతాదళ్(ఎస్ఎస్డీ) నాయకులు స్పష్టం చేశారు. -
రేపు పవన్ రాక!
[ 06-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 7న గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా ఆయన రానున్నట్లు సమాచారం. -
వైకాపాకు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది
[ 06-05-2024]
పెత్తందారులు.. పేదలు అంటూ నాలుగు సంవత్సరాల పాటు నయవంచక పాలనకు పాల్పడిన వైకాపాకు తగురీతిన బుద్ధి చెప్పేందుకు సమయం వచ్చిందని సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం అన్నారు. -
నిబంధనలు బేఖాతర్
[ 06-05-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వైకాపా నాయకులు వాటిని పట్టించుకోవడం లేదు. ఎటువంటి అనుమతులతో పనిలేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. -
సూపర్-6 పథకాలతో సంక్షేమం పరుగులు
[ 06-05-2024]
అవనిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించడమే లక్ష్యం. సూపర్-6 పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం. నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తాం. యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. -
మీ భూములు కొల్లగొట్టేస్తారు..!
[ 06-05-2024]
ప్రజల ఆస్తులు, భూములు కొల్లగొట్టేందుకే వైకాపా ప్రభుత్వం కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే భూసర్వే, భూరక్ష పేర్లతో రైతుల భూములను సర్వే చేసింది. ఇందులో చాలా వ్యత్యాసాలు బయటపడ్డాయి. -
‘జగన్.. అధికార దుర్వినియోగం చేశారు’
[ 06-05-2024]
గత ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇస్తే.. ముఖ్యమంత్రి జగన్ దుర్వినియోగం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దుయ్యబట్టారు. -
తెదేపాకు అవరోధం.. వైకాపాకు సహకారం
[ 06-05-2024]
నందిగామలో తెదేపా కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్యను పోస్టల్ బ్యాలట్ ఓటు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా ఆర్వో ఎ.రవీంద్రరావు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేదని ఆమెను బయటికి పంపించారు. -
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
[ 06-05-2024]
ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 8న భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా డీకే బాలాజీ తెలిపారు. -
పోస్టల్ బ్యాలట్ సమాచారానికి హెల్ప్లైన్లు
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ పట్ల సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్లైన్లను ఏర్పాటు చేసినట్లు నోడల్ అధికారి షాహిద్బాబు తెలిపారు. -
సీఎం పర్యటనకా? పోస్టల్ బ్యాలట్కా?
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ విషయంలో పోలీసులకు కొత్త సమస్య ఎదురైంది. ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బందికి ఈ ఓటింగ్కు 6వ తేదీ కేటాయించారు. -
ఈవీఎం-వీవీ ప్యాడ్ల ఓటింగ్ సజావుగా సాగాలి
[ 06-05-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం-వీవీ ప్యాడ్ల) ద్వారా జరిగే ఓటింగ్ ప్రక్రియ సక్రమంగా, సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల పరిశీలకురాలు మంజురాజ్వాల్ సూచించారు. -
జిల్లాలో తేలికపాటి వర్షాలు
[ 06-05-2024]
జిల్లాలోని రెండు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. మొత్తం 5.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా, సగటు వర్షపాతం 0.26 మి.మీ.గా ఉంది. -
ఫెసిలిటేషన్ కేంద్రాల సంఖ్య పెంపు
[ 06-05-2024]
ద్యోగుల పోస్టల్ బ్యాలట్ వినియోగ నిమిత్తం జిల్లాలో అదనపు ఫెసిలిటేషను కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల ఆర్వోల కార్యాలయాల్లో ఆదివారం నూతనంగా పోస్టల్ బ్యాలట్ వినియోగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
ఫారం-12 అందజేతకు మరో అవకాశం
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులు ముందుగా ఫారం-12 కచ్చితంగా అందజేయాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల వీటిని ఇప్పటి వరకు సమర్పంచని వారికి ఈసీఐ మరో అవకాశం కల్పించినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు