Kodali Nani: గాలి మేడలు... ప్రగతి బీటలు
ఇదీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (శ్రీవెంకటేశ్వరరావు) నివాసానికి వెళ్లే రహదారి. అంతా గుంతలమయం. నిత్యం ఎమ్మెల్యే ఈ మార్గంలోనే ప్రయాణం చేస్తుంటారు. ఈ రహదారిని మాత్రం నిర్మించాలని పురపాలక సంఘం అధికారులను అడగలేరు.
గుడివాడ అభివృద్ధి పట్టని ఎమ్మెల్యే నాని
నాలుగేళ్లుగా పైకం విదల్చని రాష్ట్రం
కేంద్రం నిధులు, ప్రజల పన్నులే ఆసరా
నిత్యం ఎమ్మెల్యే నాని ఇంటికి వెళ్లే దక్షిణం రోడ్డు
ఈ రహదారి చూశారా...
ఇదీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (శ్రీవెంకటేశ్వరరావు) నివాసానికి వెళ్లే రహదారి. అంతా గుంతలమయం. నిత్యం ఎమ్మెల్యే ఈ మార్గంలోనే ప్రయాణం చేస్తుంటారు. ఈ రహదారిని మాత్రం నిర్మించాలని పురపాలక సంఘం అధికారులను అడగలేరు. ఎందుకంటే పురపాలక సంఘం వద్ద ఖజానా ఖాళీ. ఈ ఒక్క రోడ్డు మాత్రమే కాదు. గుడివాడ పట్టణంలో ఏ రహదారి చూసినా ఏముంది గర్వకారణం అన్నట్లు గుంతలమయం. రోడ్డుపైనే డ్రెనేజీ నీరు పారడం.. పారిశుద్ధ్య లేమి.. ఇరుకు రహదారులు. ప్రజలపై పన్ను భారం వేసి ముక్కుపిండి వసూలు చేస్తున్నా అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలో ఉంది. దోమల స్వైర విహారం, పందుల సంచారం.. రోగాలతో ప్రజల సహజీవనం.. ఇదీ గుడివాడ పట్టణం పరిస్థితి.
ఇటీవల కురిసిన వర్షాలకు మునిగిన గుడివాడ బస్టాండు రోడ్డు
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే, గుడివాడ (నెహ్రూచౌక్)
గుడివాడ పట్టణానికి ఎంతో చరిత్ర ఉంది. 1927లోనే ఇది పురపాలక సంఘంగా ఆవిర్భవించింది. దాదాపు వందేళ్ల చరిత్రకు దగ్గర అవుతోంది. అలాంటి గుడివాడ పట్టణం.. అభివృద్ధి లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. వరుసగా నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలుపొంది.. ఒకసారి మంత్రిగా పనిచేసిన కొడాలినాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ పట్టణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో నిధులు అందకపోవడం గమనార్హం. కేంద్రం విడుదల చేసే గ్రాంట్లతో కాస్తాకూస్తో నడిపిస్తున్నారు. పట్టణ శివారులో వేల టన్నుల చెత్త పేరుకుపోయినా తొలగించే నాథుడే లేరు. రోడ్లకు ఇరువైపులా డ్రెనేజీలు శుభ్రం చేయక నెలలు గడుస్తున్నాయి. చిన్నపాటి వర్షం వస్తే రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. ఎప్పుడో తెదేపా ప్రభుత్వ హయాంలో వేసిన రహదారులకు ఇప్పటికీ మరమ్మతులకు మోక్షం కలగడం లేదు. ప్రధాన ర.భ శాఖ పరిధిలోని రహదారులే అంతంత మాత్రంగా ఉన్నాయి. పురపాలక సంఘానికి చెందిన రహదారులు, కాలనీ రహదారులు దారుణంగా ఉన్నాయి. గుంతల మధ్య వాహనాలు నడపడం అలా ఉంచితే నడిచే పరిస్థితి లేదని పాదచారులు వాపోతున్నారు.
ఏవీ గ్రాంట్లు...
కొడాలి నాని మంత్రిగా పనిచేసినా గుడివాడ పట్టణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 14, 15వ ఆర్థిక సంఘం నిధులు, అమృత్ గ్రాంటు, రుణం తప్ప రాష్ట్రం నుంచి ఇతర నిధులు రాలేదు. ఎస్సీ ఎస్పీ గ్రాంటు కింద ఒకే సంవత్సరం (2021-22) రూ.1.03 కోట్లు వచ్చాయి. 14, 15వ ఆర్థిక సంఘం కింద రూ.2.46 కోట్లు, 8.07 కోట్లు, రూ.9.61 కోట్లు, 10.23 కోట్లు, 4.38 కోట్లు అందాయి. అభివృద్ధి కేంద్రం నిధులతోనూ, పురపాలక సంఘం సొంత నిధులతోనే చేపట్టారు. కానీ ప్రభుత్వం నుంచి మౌలిక వసతులకు మున్సిపాలిటీకి ఒక్క రూపాయి విదల్చలేదు. మున్సిపాల్టీ సాధారణ నిధులు గత అయిదేళ్లుగా రూ.1.35కోట్లు, రూ.2.85కోట్లు, రూ.1.23కోట్లు, రూ.1.75కోట్లు, రూ.1.37కోట్లు అభివృధ్ధి పనుల కోసం వెచ్చించారు.
కనిపించని మౌలిక వసతులు...
గుడివాడ పట్టణం విస్తరించింది. శివారు పంచాయతీల విలీనం, వార్డుల విభజనలో తేడా రావడంతో గత పురపాలక సంఘం ఎన్నికలు నిర్వహించలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం 1,18,167 మంది ఉన్నారు. 2021 ప్రకారం 1.53లక్షలకు చేరుకున్నారు. అమృత్ పథకం కింద మంచి నీటి ట్యాంకుల నిర్మాణం చేయాల్సి ఉంది. కేంద్రం నుంచి నిధులు అందినా నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. ముబారక్ సెంటర్, చేపల మార్కెట్, బంటుమిల్లి రోడ్డు వద్ద ట్యాంకులు నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని పూర్తి అయినా ప్రారంభించలేదు. ఇటీవల ఒక ట్యాంకులో పడి బాలుడు మృతి చెందాడు.
వందేళ్ల చరిత్ర ఉన్న గుడివాడ పట్టణంలో మున్సిపల్ అధికారులు ఇంకా ట్యాంకర్లతోనే మంచి నీటిని సరఫరా చేసే పరిస్థితి ఉంది.
పన్నుల భారం సరేసరి...
మరోవైపు పన్నుల భారం భారీగా మోపుతున్నారు. చెత్త సేకరణకు సైతం యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. 2018-19లో రెవెన్యూ పన్నులు రూ.6.07కోట్లు ఉంటే.. 2022-23లో వసూలు రూ.8.41కోట్లకు చేరింది. నాలుగేళ్లలో దాదాపు రూ.2.30కోట్లు పన్నుల భారం పెరిగింది. ఇతర పన్నులు కూడా అదే స్థాయిలో పెరిగినా మౌలిక వసతులు మాత్రం పెరగలేదని ప్రజలు వాపోతున్నారు.
పారిశుద్ధ్యం దారుణం...
శివారులో చెత్త పేరుకుపోయింది. దాదాపు 50వేల టన్నుల నుంచి లక్ష టన్నుల చెత్త ఉంటుంది. దీన్ని తరలిస్తామని ఈ ఏడాది మే నెలలో ఎమ్మెల్యే పరిశీలించి హామీ ఇచ్చారు. ఇప్పటికీ అదే తరహాలో కొండలా పేరుకుపోయింది. పట్టణంలో ఎక్కడ చూసినా చెత్త చెదారంతో నిండిపోయింది. సుందరీకరణ గాలికి వదిలేశారు. చెత్త సేకరణ నామమాత్రంగానే జరుగుతోంది. అన్నింటికీ ప్రజల నుంచి వసూలు చేసిన సాధారణ నిధులే కావాల్సి వస్తోంది. వీధిలైట్లు దారుణంగా ఉన్నాయి. ప్రధాన రహదారి మినహా వీధుల్లో లైట్లు లేవు. వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దోమల నియంత్రణ లేదు. పందులు విచ్చల విడిగా తిరుగుతున్నా కట్టడి లేదు. జ్వరాల బారిన పడుతున్నామని జనం వాపోతున్నారు. వర్షాకాలం వస్తే అంతా అస్తవ్యస్తంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు అనుకూలంగా మీడియా సర్టిఫికేషన్ కమిటీ: ఈసీకి విపక్షాల ఫిర్యాదు
[ 28-04-2024]
ఏపీలో వైకాపాకు అనుకూలంగా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటర్ కమిటీ (ఎంసీఎంసీ) వ్యవహరిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
గులకరాయి ఘటనలో జగన్కు భాస్కర్ అవార్డు ఇవ్వాలి: నారా లోకేశ్ ఎద్దేవా
[ 28-04-2024]
గులకరాయి ఘటనలో సీఎం జగన్కు ఆస్కార్కు బదులు భాస్కర్ అవార్డు ఇవ్వాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
బస్సులు డొక్కు.. డబ్బులు నొక్కు..!
[ 28-04-2024]
పేదలకు మేలు చేస్తున్నట్లు గొప్పలు చెబుతూ వచ్చిన సీఎం జగన్.. చేతల్లో వారిపై దెబ్బమీద దెబ్బ కొడుతూ వచ్చారు. సామాన్యులపై ఆర్టీసీ ఛార్జీల రూపంలో మోయలేని భారాన్ని మోపారు. ఇష్టారీతిన పెంచేసి షాక్ మీద షాక్లిచ్చారు. -
వైకాపా కార్యాలయానికి రెండు ఎకరాలు అవసరమా?
[ 28-04-2024]
దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయం ఎకరం స్థలంలో ఉంది.. బందరులో మాత్రం రెండు ఎకరాల విస్తీర్ణంలో వైకాపా కార్యాలయాన్ని కోటలా కట్టేస్తున్నారు అంత అవసరమా అని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. -
ఉన్నోళ్లు వద్దని.. ఆళ్లోళ్లు ముద్దని!
[ 28-04-2024]
‘‘ఉమ్మడి జిల్లాలో కొత్త వ్యక్తులు దిగారు. ఓటర్లకు, నాయకులకు పంపకాలకు యువతను దించారు. వైకాపా కార్యకర్తలో, ఐప్యాక్ టీం సభ్యులో కానీ.. నగరం, పట్టణాల్లోని కల్యాణ మండపాలు, ఇతర ఖాళీ గృహాలను వసతి కింద తీసుకుని బస చేస్తున్నారు. -
కూటమి విజయదుందుభి ఖాయం
[ 28-04-2024]
రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయ దుందుభి మోగించడం ఖాయమని.. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గెలుపును ఎవరూ ఆపలేరని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చెప్పారు. -
ఓటర్లు పెరిగారు
[ 28-04-2024]
జిల్లాలో ఓటర్ల సంఖ్య 15.39 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 15.18 లక్షలుగా ఉంది. -
కరోనాలోనూ కనికరించలె..
[ 28-04-2024]
కొవిడ్ సమయంలో మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను పోలీసులు, హోమ్గార్డులకు సహాయకులుగా పెట్టి విధులు నిర్వహించాలని వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. -
ఎత్తిపోతలూ ఎండగట్టారు
[ 28-04-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఎత్తిపోతల పథకాలు మూలకు చేరాయి. వాటి అభివృద్ధికి ఎటువంటి నిధులు విదల్చకపోవడంతో మూడేళ్లుగా పథకాలన్నీ మూతపడి లంక భూముల రైతులు గొల్లుమంటున్నారు. -
వైకాపా ఖాళీ అయిపోయింది: మండలి
[ 28-04-2024]
వైకాపా మొత్తం ఖాళీ అయిందని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలో జనసేన పార్టీకీ రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు. -
భారం మోపనన్నారు.. బాదేశారు
[ 28-04-2024]
అసలే అంతంత మాత్రపు బస్సులతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు పెరిగిన ఛార్జీలతో హడలిపోతున్నారు. కనీస ఛార్జి ఇంతకు ముందు రూ.5లు ఉంటే ప్రస్తుతం దానిని రూ.10లకు పెంచారు. -
రాక్షస పాలన నుంచి విముక్తి పొందుదాం
[ 28-04-2024]
ఐదేళ్ల రాక్షస పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన, భాజపా కూటమికి అఖండ విజయం చేకూర్చాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం
[ 28-04-2024]
చంద్రబాబుతోనే సంక్షేమం సాధ్యమని తెదేపా పెడన ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాదు సతీమణి శిరీష అన్నారు. శనివారం ఆమె కూటి శ్రేణులతో కలిసి మండల పరిధిలోని తరకటూరు, జక్కంచర్ల గ్రామాల్లో పర్యటించారు. -
మాటల గారడీ.. చేతల్లో బురిడీ
[ 28-04-2024]
బందరు నగరంలో ముస్లింల జనాభా ఎక్కువ. వారు ఏదైనా వేడుక చేసుకోవాలంటే సరైన షాదీఖానాలు లేక అవస్థలు పడుతున్నారు. 2000 సంవత్సరంలో తెదేపా హయాంలోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో ఇంగ్లీషుపాలెంలో షాదీఖానా నిర్మించారు. -
ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయండి
[ 28-04-2024]
మే 1న ఇంటి వద్దనే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగుల జీవితాలతో ఆటలాడొద్దని హితవుపలికారు. -
నిధులు తేలేక.. పొలంపల్లి పడక
[ 28-04-2024]
‘పోలంపల్లి డ్యాంకు 2004లో అప్పటి సీఎం వైఎస్ శంకుస్థాపన చేశారు కనుకే అధికారం చేపట్టిన తెదేపా పట్టించుకోలేదు. తండ్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ను తనయుడు పూర్తి చేసేలా మేమంతా కృషి చేస్తాం. -
జగన్ అన్ని రంగాలను దోచేశారు : వర్ల
[ 28-04-2024]
శాండ్, ల్యాండ్, మైన్, వైన్ ఇలా అన్ని రంగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దోచేశారని తెదేపా కూటమి నియోజకవర్గ అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
జగన్ బాదుడు
[ 28-04-2024]
అయిదేళ్లలో మూడు సార్లు ఆర్టీసీ ఛార్టీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. గుడివాడ నుంచి విజయవాడకు రైలు టికెట్ రూ.10 ఉండగా ఆర్టీసీ ఛార్జీ అయిదు రెట్లకుపైగా ఉంది. -
కూటమిని గెలిపించండి
[ 28-04-2024]
పెదకళ్లేపల్లిలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీగా బాలశౌరి, ఎమ్మెల్యేగా మండలి బుద్ధప్రసాద్లను గెలిపించాలని కోరారు. -
రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడి తనిఖీ
[ 28-04-2024]
రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు నరహరసింగ్ బంగర్ శనివారం కూచిపూడి ఓరియంటల్ జడ్పీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. -
వి.వి.లక్ష్మీనారాయణకు రక్షణ కల్పించండి
[ 28-04-2024]
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ పూర్వ అధికారి వి.వి.లక్ష్మీనారాయణకు మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, తగు రక్షణ కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
విద్యుదాఘాతంతో ఒకరు మృతి
[ 28-04-2024]
మండలంలోని మడక గ్రామంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శొంఠి హరికృష్ణ(36) శుక్రవారం రాత్రి విద్యుత్తు పరికరంతో ట్రాక్టర్ మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. -
ఉచిత వైద్యశిబిరం నేడు
[ 28-04-2024]
బొమ్మారెడ్డి సీతారెడ్డి కల్యాణ మంటపంలో ఆదివారం ఆస్టర్ రమేష్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు శనివారం తెలిపారు. -
‘పింఛన్లు ఇంటివద్దే ఇవ్వాలి’
[ 28-04-2024]
వేసవిని దృష్టిలో పెట్టుకొని మే 1న వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్లను వారి ఇంటివద్దకే వెళ్లి ఇచ్చే ఏర్పాటు చేయాలని...
తాజా వార్తలు (Latest News)
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!