రోగుల సహాయకులతో అసభ్య ప్రవర్తన.. కీచక వైద్యుడిపై కేసు
శస్త్రచికిత్స చేయించుకున్న మహిళా రోగికి తోడుగా వచ్చిన సోదరిని లైంగికంగా వేధింపులకు గురిచేసిన కీచక వైద్యుడిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.
డాక్టర్ తలారి సీతారాం
విస్సన్నపేట, న్యూస్టుడే: శస్త్రచికిత్స చేయించుకున్న మహిళా రోగికి తోడుగా వచ్చిన సోదరిని లైంగికంగా వేధింపులకు గురిచేసిన కీచక వైద్యుడిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు డివిజన్ ఆరోగ్య శాఖ డిప్యూటీ డీఎంఅండ్హెచ్వోగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ తలారి సీతారాం, స్థానిక వెంకటేశ్వర థియేటర్ సమీపంలో కీర్తన ప్రసూతి, జనరల్ ఆస్పత్రి నడుపుతున్నారు. కడుపులో ఉన్న గడ్డ తొలగించడానికి అవసరమైన శస్త్రచికిత్స నిమిత్తం ఓ గ్రామానికి చెందిన మహిళ 2న ఆస్పత్రిలో చేరారు. శస్త్రచికిత్స తర్వాత తన అక్కకు సపర్యలు చేసేందుకు వచ్చిన చెల్లెలుపై డాక్టర్ సీతారాం కన్నేశారు. రోగి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడాలంటూ సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఆమెను డాక్టర్ తన ఛాంబర్కు పిలిచారు. లోపలికి వెళ్లిన ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా లైంగికంగా వేధించారు. అతడి బారి నుంచి అతి కష్టంపై బయటపడిన ఆమె జరిగిన విషయాన్ని తన భర్తకు ఫోన్ చేసి చెప్పగా వెంటనే ఇంటికి రమ్మన్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా డాక్టర్ ఆమె చరవాణి నంబరుకు ఫోన్ చేయడం, వాట్సాప్నకు మెసేజ్ పంపారు. వైద్యుడి తీరు నచ్చక రోగిని మంగళవారం ఉదయం వేరే ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. గతంలోనూ డాక్టర్ పలువురు మహిళలతో ఇదే విధంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు డాక్టర్ సర్టిఫికెట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. కొందరు రాజకీయ నాయకులు రంగప్రవేశం చేసి రాజీ దిశగా ఒత్తిడి చేయడంతో, బాధిత మహిళ పోలీసు టోల్ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి, కీచక వైద్యుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
కీర్తన ఆస్పత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులు డొక్కు.. డబ్బులు నొక్కు..!
[ 28-04-2024]
పేదలకు మేలు చేస్తున్నట్లు గొప్పలు చెబుతూ వచ్చిన సీఎం జగన్.. చేతల్లో వారిపై దెబ్బమీద దెబ్బ కొడుతూ వచ్చారు. సామాన్యులపై ఆర్టీసీ ఛార్జీల రూపంలో మోయలేని భారాన్ని మోపారు. ఇష్టారీతిన పెంచేసి షాక్ మీద షాక్లిచ్చారు. -
వైకాపా కార్యాలయానికి రెండు ఎకరాలు అవసరమా?
[ 28-04-2024]
దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయం ఎకరం స్థలంలో ఉంది.. బందరులో మాత్రం రెండు ఎకరాల విస్తీర్ణంలో వైకాపా కార్యాలయాన్ని కోటలా కట్టేస్తున్నారు అంత అవసరమా అని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. -
ఉన్నోళ్లు వద్దని.. ఆళ్లోళ్లు ముద్దని!
[ 28-04-2024]
‘‘ఉమ్మడి జిల్లాలో కొత్త వ్యక్తులు దిగారు. ఓటర్లకు, నాయకులకు పంపకాలకు యువతను దించారు. వైకాపా కార్యకర్తలో, ఐప్యాక్ టీం సభ్యులో కానీ.. నగరం, పట్టణాల్లోని కల్యాణ మండపాలు, ఇతర ఖాళీ గృహాలను వసతి కింద తీసుకుని బస చేస్తున్నారు. -
కూటమి విజయదుందుభి ఖాయం
[ 28-04-2024]
రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయ దుందుభి మోగించడం ఖాయమని.. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గెలుపును ఎవరూ ఆపలేరని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చెప్పారు. -
ఓటర్లు పెరిగారు
[ 28-04-2024]
జిల్లాలో ఓటర్ల సంఖ్య 15.39 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 15.18 లక్షలుగా ఉంది. -
కరోనాలోనూ కనికరించలె..
[ 28-04-2024]
కొవిడ్ సమయంలో మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను పోలీసులు, హోమ్గార్డులకు సహాయకులుగా పెట్టి విధులు నిర్వహించాలని వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. -
ఎత్తిపోతలూ ఎండగట్టారు
[ 28-04-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఎత్తిపోతల పథకాలు మూలకు చేరాయి. వాటి అభివృద్ధికి ఎటువంటి నిధులు విదల్చకపోవడంతో మూడేళ్లుగా పథకాలన్నీ మూతపడి లంక భూముల రైతులు గొల్లుమంటున్నారు. -
వైకాపా ఖాళీ అయిపోయింది: మండలి
[ 28-04-2024]
వైకాపా మొత్తం ఖాళీ అయిందని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలో జనసేన పార్టీకీ రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు. -
భారం మోపనన్నారు.. బాదేశారు
[ 28-04-2024]
అసలే అంతంత మాత్రపు బస్సులతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు పెరిగిన ఛార్జీలతో హడలిపోతున్నారు. కనీస ఛార్జి ఇంతకు ముందు రూ.5లు ఉంటే ప్రస్తుతం దానిని రూ.10లకు పెంచారు. -
రాక్షస పాలన నుంచి విముక్తి పొందుదాం
[ 28-04-2024]
ఐదేళ్ల రాక్షస పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన, భాజపా కూటమికి అఖండ విజయం చేకూర్చాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం
[ 28-04-2024]
చంద్రబాబుతోనే సంక్షేమం సాధ్యమని తెదేపా పెడన ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాదు సతీమణి శిరీష అన్నారు. శనివారం ఆమె కూటి శ్రేణులతో కలిసి మండల పరిధిలోని తరకటూరు, జక్కంచర్ల గ్రామాల్లో పర్యటించారు. -
మాటల గారడీ.. చేతల్లో బురిడీ
[ 28-04-2024]
బందరు నగరంలో ముస్లింల జనాభా ఎక్కువ. వారు ఏదైనా వేడుక చేసుకోవాలంటే సరైన షాదీఖానాలు లేక అవస్థలు పడుతున్నారు. 2000 సంవత్సరంలో తెదేపా హయాంలోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో ఇంగ్లీషుపాలెంలో షాదీఖానా నిర్మించారు. -
ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయండి
[ 28-04-2024]
మే 1న ఇంటి వద్దనే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగుల జీవితాలతో ఆటలాడొద్దని హితవుపలికారు. -
నిధులు తేలేక.. పొలంపల్లి పడక
[ 28-04-2024]
‘పోలంపల్లి డ్యాంకు 2004లో అప్పటి సీఎం వైఎస్ శంకుస్థాపన చేశారు కనుకే అధికారం చేపట్టిన తెదేపా పట్టించుకోలేదు. తండ్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ను తనయుడు పూర్తి చేసేలా మేమంతా కృషి చేస్తాం. -
జగన్ అన్ని రంగాలను దోచేశారు : వర్ల
[ 28-04-2024]
శాండ్, ల్యాండ్, మైన్, వైన్ ఇలా అన్ని రంగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దోచేశారని తెదేపా కూటమి నియోజకవర్గ అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
జగన్ బాదుడు
[ 28-04-2024]
అయిదేళ్లలో మూడు సార్లు ఆర్టీసీ ఛార్టీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. గుడివాడ నుంచి విజయవాడకు రైలు టికెట్ రూ.10 ఉండగా ఆర్టీసీ ఛార్జీ అయిదు రెట్లకుపైగా ఉంది. -
కూటమిని గెలిపించండి
[ 28-04-2024]
పెదకళ్లేపల్లిలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీగా బాలశౌరి, ఎమ్మెల్యేగా మండలి బుద్ధప్రసాద్లను గెలిపించాలని కోరారు. -
రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడి తనిఖీ
[ 28-04-2024]
రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు నరహరసింగ్ బంగర్ శనివారం కూచిపూడి ఓరియంటల్ జడ్పీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. -
వి.వి.లక్ష్మీనారాయణకు రక్షణ కల్పించండి
[ 28-04-2024]
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ పూర్వ అధికారి వి.వి.లక్ష్మీనారాయణకు మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, తగు రక్షణ కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
విద్యుదాఘాతంతో ఒకరు మృతి
[ 28-04-2024]
మండలంలోని మడక గ్రామంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శొంఠి హరికృష్ణ(36) శుక్రవారం రాత్రి విద్యుత్తు పరికరంతో ట్రాక్టర్ మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. -
ఉచిత వైద్యశిబిరం నేడు
[ 28-04-2024]
బొమ్మారెడ్డి సీతారెడ్డి కల్యాణ మంటపంలో ఆదివారం ఆస్టర్ రమేష్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు శనివారం తెలిపారు. -
‘పింఛన్లు ఇంటివద్దే ఇవ్వాలి’
[ 28-04-2024]
వేసవిని దృష్టిలో పెట్టుకొని మే 1న వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్లను వారి ఇంటివద్దకే వెళ్లి ఇచ్చే ఏర్పాటు చేయాలని...
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు