అంతా అన్నారు.. కొంతే కొన్నారు!
దివిసీమలో ఖరీఫ్ ఆలస్యంగా సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోతలు కోస్తున్నారు. నూర్పిళ్లు చేస్తున్నారు.
ధాన్యం సేకరణ ఆపేసిన ప్రభుత్వం
ఇక... ప్రైవేటు వ్యాపారులే దిక్కు
ఈనాడు - అమరావతి
పామర్రు: కొండిపర్రు వద్ద నూర్పిడి చేయని వరి కుప్పలు
దివిసీమలో ఖరీఫ్ ఆలస్యంగా సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోతలు కోస్తున్నారు. నూర్పిళ్లు చేస్తున్నారు. దివిసీమ పరిధిలో దాదాపు 50 వేల ఎకరాలు ఉంది. కోతలు పూర్తి కావాలంటే కనీసం నెల పడుతుందనేది రైతుల మాట. ధాన్యం ఎవరికి అమ్మాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణ అధికారికంగా ఆపేశారు. ఇప్పటికే చాలా వరకు సేకరణ కేంద్రాలను మూసేశారు. ఎన్టీఆర్ జిల్లాలో మార్చి 1 నుంచే కొనుగోళ్లు ఆపేయగా.. కృష్ణా జిల్లా ఏప్రిల్ 1 నుంచి ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా నూర్పిళ్లు కాని ప్రాంతాలు చాలా ఉన్నాయి. వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు దిగుబడిపై కాకి లెక్కలు వేసి ధాన్యం సేకరణ లక్ష్యాలను కుదించారు. మిగులు ధాన్యం మాటేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ధర తక్కువకు..!
ఈ ఏడాది బయట వ్యాపారులకు ధాన్యం తక్కువ ధరకు రైతులు విక్రయించారు. తెలంగాణ వ్యాపారులు చాలా వరకు కొన్నారు. ధాన్యం మిల్లు ఆడిస్తే.. కేవలం 60 శాతమే బియ్యం వస్తున్నాయి. కిలో బియ్యం రూ.38 వరకు ఖర్చు అవుతుంది. అంటే కనీసం రూ.40కు అమ్మాలి. అంత ధర పలకడం లేదు. కృష్ణా జిల్లా నుంచి దాదాపు 1.50 లక్షల టన్నులు బయటి వ్యాపారులు కొన్నారు. ప్రభుత్వానికి విక్రయిస్తే.. ధాన్యం డబ్బులు రావడం లేదని కొందరు రైతులు బయట వ్యాపారులకు అమ్మారు. దాదాపు రెండు మూడు నెలలు తర్వాత సొమ్ములు ఖాతాలో పడుతున్నాయి. ఈ రెండు నెలల వడ్డీ భారం రూ.లక్షల్లోమాటే.
రబీ పరిస్థితేంటి?..
రెండు జిల్లాల్లోనూ రబీ పంట సాగు లేదనేది వ్యవసాయ శాఖ మాట. డెల్టా కింద సాగునీరు ఇవ్వకుండా క్రాప్ హాలిడే ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్ఎస్పీ కాలువ కింద నీరు రాలేదు. కానీ పలు మండలాల్లో బోర్ల కింద వరి వేశారు. రెండు జిల్లాల్లో 1.50 లక్షల ఎకరాలు వరి సాగులో ఉంది. బావులు, బోర్ల కింద సాగు చేసిన వరి మాత్రమే. దీనికి కొనుగోలు కేంద్రాలు పెట్టకపోగా.. ఉన్నవీ మూసేయడంతో.. ఇక మిల్లర్లే దిక్కు.
కృష్ణా జిల్లాలో...
కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ లెక్క మేరకు 4.50 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు చేశారు. ఎకరానికి 40-45 బస్తాల చొప్పున.. 10 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. కానీ ఇప్పటికి 5 లక్షల టన్నులు కూడా కొనలేదు. ఆర్బీకేల్లో సాంకేతిక ఇబ్బందులు.. ఈ-క్రాప్, తేమ, రవాణా సమస్యలతో రైతులు చాలా వరకు బయట వ్యాపారులకు అమ్ముకున్నారు. ఇంకా 3 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. నాగాయలంక, అవనిగడ్డ, కోడూరు మండలాల్లో ఇప్పుడు వరి నూర్పిళ్లు జరుగుతున్నాయి. జిల్లాలో 150 మిల్లులకు కేటాయించారు. వీటిలో సీఎంఆర్ అయిపోయిందని ఆపేయగా.. కొన్ని మిల్లులకు ఈ వారంలో ఆపనున్నారు. ఈ ఏడాది సీఎంఆర్ బియ్యంతో నష్టపోయామని మిల్లుల యజమానులు వాపోతున్నారు. పూర్తి స్థాయిలో ఇవ్వలేదని అంటున్నారు. గన్నవరం, గుడివాడ, అవనిగడ్డ, పెనమలూరు పరిధిలో మినుము వేయడంతో ఇంకా కుప్పలు నూర్పలేదు. మినుము చేతికి వచ్చాక నూర్పుతారు.
ఎన్టీఆర్లో..
ఎన్టీఆర్ పరిధిలో వ్యవసాయ శాఖ లెక్క మేరకు.. వరి సాగు విస్తీర్ణం 1.25 లక్షల ఎకరాలుగా చూపినా.. ఇంతకంటే ఎక్కువే సాగైంది. ఇక్కడా 45 బస్తాల దిగుబడి చొప్పున 2.50 లక్షల టన్నుల ధాన్యం కావాలి. లక్ష్యం మాత్రం 1.03 లక్షల టన్నులే. ఇది పూర్తయింది. అధికారులు 30-35 బస్తాల దిగుబడి అంచనా వేసినా.. ఈ దఫా పెరిగింది.
‘రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజా కొంటాం. తడిసిన, రంగు మారిన ధాన్యమూ కొంటాం. అన్నదాతలు ఆందోళన చెందాల్సిన పని లేదు..!’
అధికారులు, ప్రజాప్రతినిధుల స్పష్టీకరణ
‘ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసేస్తున్నాం. కుప్పలు నూర్పకుండా మిగిలిన రైతులుంటే ఈ రెండు రోజుల్లో ధాన్యం కేంద్రాలకు తేవాలి. మార్చి 31 వరకే ఉంటాయి..!’
కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ
పామర్రు నియోజకవర్గం కొమరోలు రైతు వల్లభనేని ప్రసాద్ 20 ఎకరాలు కౌలుకు చేశారు. రెండో పంటగా మినుము వేయడంతో వరి కోసి కుప్పలు వేశారు. ఇంకా నూర్పలేదు. ప్రస్తుతం నూర్పిడి చేసి ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తేవాలంటే వారం, పది రోజులు పడుతుంది. కానీ మూడు రోజులు దాటితే ధాన్యం కొనమని చెబుతుండటంతో ఇక ప్రైవేటు వ్యాపారులే దిక్కని ఆయన వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులు డొక్కు.. డబ్బులు నొక్కు..!
[ 28-04-2024]
పేదలకు మేలు చేస్తున్నట్లు గొప్పలు చెబుతూ వచ్చిన సీఎం జగన్.. చేతల్లో వారిపై దెబ్బమీద దెబ్బ కొడుతూ వచ్చారు. సామాన్యులపై ఆర్టీసీ ఛార్జీల రూపంలో మోయలేని భారాన్ని మోపారు. ఇష్టారీతిన పెంచేసి షాక్ మీద షాక్లిచ్చారు. -
వైకాపా కార్యాలయానికి రెండు ఎకరాలు అవసరమా?
[ 28-04-2024]
దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయం ఎకరం స్థలంలో ఉంది.. బందరులో మాత్రం రెండు ఎకరాల విస్తీర్ణంలో వైకాపా కార్యాలయాన్ని కోటలా కట్టేస్తున్నారు అంత అవసరమా అని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. -
ఉన్నోళ్లు వద్దని.. ఆళ్లోళ్లు ముద్దని!
[ 28-04-2024]
‘‘ఉమ్మడి జిల్లాలో కొత్త వ్యక్తులు దిగారు. ఓటర్లకు, నాయకులకు పంపకాలకు యువతను దించారు. వైకాపా కార్యకర్తలో, ఐప్యాక్ టీం సభ్యులో కానీ.. నగరం, పట్టణాల్లోని కల్యాణ మండపాలు, ఇతర ఖాళీ గృహాలను వసతి కింద తీసుకుని బస చేస్తున్నారు. -
కూటమి విజయదుందుభి ఖాయం
[ 28-04-2024]
రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయ దుందుభి మోగించడం ఖాయమని.. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గెలుపును ఎవరూ ఆపలేరని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చెప్పారు. -
ఓటర్లు పెరిగారు
[ 28-04-2024]
జిల్లాలో ఓటర్ల సంఖ్య 15.39 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 15.18 లక్షలుగా ఉంది. -
కరోనాలోనూ కనికరించలె..
[ 28-04-2024]
కొవిడ్ సమయంలో మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను పోలీసులు, హోమ్గార్డులకు సహాయకులుగా పెట్టి విధులు నిర్వహించాలని వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. -
ఎత్తిపోతలూ ఎండగట్టారు
[ 28-04-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఎత్తిపోతల పథకాలు మూలకు చేరాయి. వాటి అభివృద్ధికి ఎటువంటి నిధులు విదల్చకపోవడంతో మూడేళ్లుగా పథకాలన్నీ మూతపడి లంక భూముల రైతులు గొల్లుమంటున్నారు. -
వైకాపా ఖాళీ అయిపోయింది: మండలి
[ 28-04-2024]
వైకాపా మొత్తం ఖాళీ అయిందని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలో జనసేన పార్టీకీ రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు. -
భారం మోపనన్నారు.. బాదేశారు
[ 28-04-2024]
అసలే అంతంత మాత్రపు బస్సులతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు పెరిగిన ఛార్జీలతో హడలిపోతున్నారు. కనీస ఛార్జి ఇంతకు ముందు రూ.5లు ఉంటే ప్రస్తుతం దానిని రూ.10లకు పెంచారు. -
రాక్షస పాలన నుంచి విముక్తి పొందుదాం
[ 28-04-2024]
ఐదేళ్ల రాక్షస పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన, భాజపా కూటమికి అఖండ విజయం చేకూర్చాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం
[ 28-04-2024]
చంద్రబాబుతోనే సంక్షేమం సాధ్యమని తెదేపా పెడన ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాదు సతీమణి శిరీష అన్నారు. శనివారం ఆమె కూటి శ్రేణులతో కలిసి మండల పరిధిలోని తరకటూరు, జక్కంచర్ల గ్రామాల్లో పర్యటించారు. -
మాటల గారడీ.. చేతల్లో బురిడీ
[ 28-04-2024]
బందరు నగరంలో ముస్లింల జనాభా ఎక్కువ. వారు ఏదైనా వేడుక చేసుకోవాలంటే సరైన షాదీఖానాలు లేక అవస్థలు పడుతున్నారు. 2000 సంవత్సరంలో తెదేపా హయాంలోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో ఇంగ్లీషుపాలెంలో షాదీఖానా నిర్మించారు. -
ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయండి
[ 28-04-2024]
మే 1న ఇంటి వద్దనే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగుల జీవితాలతో ఆటలాడొద్దని హితవుపలికారు. -
నిధులు తేలేక.. పొలంపల్లి పడక
[ 28-04-2024]
‘పోలంపల్లి డ్యాంకు 2004లో అప్పటి సీఎం వైఎస్ శంకుస్థాపన చేశారు కనుకే అధికారం చేపట్టిన తెదేపా పట్టించుకోలేదు. తండ్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ను తనయుడు పూర్తి చేసేలా మేమంతా కృషి చేస్తాం. -
జగన్ అన్ని రంగాలను దోచేశారు : వర్ల
[ 28-04-2024]
శాండ్, ల్యాండ్, మైన్, వైన్ ఇలా అన్ని రంగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దోచేశారని తెదేపా కూటమి నియోజకవర్గ అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
జగన్ బాదుడు
[ 28-04-2024]
అయిదేళ్లలో మూడు సార్లు ఆర్టీసీ ఛార్టీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. గుడివాడ నుంచి విజయవాడకు రైలు టికెట్ రూ.10 ఉండగా ఆర్టీసీ ఛార్జీ అయిదు రెట్లకుపైగా ఉంది. -
కూటమిని గెలిపించండి
[ 28-04-2024]
పెదకళ్లేపల్లిలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీగా బాలశౌరి, ఎమ్మెల్యేగా మండలి బుద్ధప్రసాద్లను గెలిపించాలని కోరారు. -
రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడి తనిఖీ
[ 28-04-2024]
రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు నరహరసింగ్ బంగర్ శనివారం కూచిపూడి ఓరియంటల్ జడ్పీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. -
వి.వి.లక్ష్మీనారాయణకు రక్షణ కల్పించండి
[ 28-04-2024]
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ పూర్వ అధికారి వి.వి.లక్ష్మీనారాయణకు మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, తగు రక్షణ కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
విద్యుదాఘాతంతో ఒకరు మృతి
[ 28-04-2024]
మండలంలోని మడక గ్రామంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శొంఠి హరికృష్ణ(36) శుక్రవారం రాత్రి విద్యుత్తు పరికరంతో ట్రాక్టర్ మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. -
ఉచిత వైద్యశిబిరం నేడు
[ 28-04-2024]
బొమ్మారెడ్డి సీతారెడ్డి కల్యాణ మంటపంలో ఆదివారం ఆస్టర్ రమేష్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు శనివారం తెలిపారు. -
‘పింఛన్లు ఇంటివద్దే ఇవ్వాలి’
[ 28-04-2024]
వేసవిని దృష్టిలో పెట్టుకొని మే 1న వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్లను వారి ఇంటివద్దకే వెళ్లి ఇచ్చే ఏర్పాటు చేయాలని...
తాజా వార్తలు (Latest News)
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు