AP News: సచివాలయ వాట్సాప్ గ్రూపుల్లో విష ప్రచారం
సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారంలో ఆరితేరిన అధికార వైకాపా.. ఎన్నికల వేళా ఇదే ఎత్తుగడ అనుసరిస్తోంది. ఇందుకు ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసే వాట్సాప్ గ్రూప్లను వేదికగా చేసుకుంది.
నిత్యం సీఎం జగన్ వీడియోలు, ఫొటోల వెల్లువ
కోడ్ ఉల్లంఘించి విచ్చలవిడిగా వైకాపా పోస్టులు
సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారంలో ఆరితేరిన అధికార వైకాపా.. ఎన్నికల వేళా ఇదే ఎత్తుగడ అనుసరిస్తోంది. ఇందుకు ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసే వాట్సాప్ గ్రూప్లను వేదికగా చేసుకుంది. కోడ్ అమలులోకి వచ్చినా ఇప్పటికీ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో సచివాలయ గ్రూప్ల్లో నిత్యం విషప్రచారం సాగుతోంది. సీఎం జగన్ను ఆకాశానికి ఎత్తుతూ వీడియోలు, ఫొటోలు పెడుతున్నారు. ఎన్నికల నియమావళి తుంగలో తొక్కి.. విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వైకాపా సోషల్ మీడియా విభాగం బరి తెగించి నిర్లజ్జగా ఎన్నికల ప్రచారం చేస్తున్నా అడ్డుకునే వారే లేకపోయారు.
ప్రభుత్వ కొత్త పథకాలు, విధానాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రతి వార్డు సచివాలయం స్థాయిలో ‘మన సచివాలయం’ పేరుతో గత రెండేళ్ల నుంచి వాట్సాప్ల్లో గ్రూప్లు నడుస్తున్నాయి. వీటిలో ఆ సచివాలయం పరిధిలోకి వచ్చే వాలంటీర్లు, వార్డు సచివాలయ కార్యదర్శులు, ప్రజలు, లబ్ధిదారులు సభ్యులుగా ఉన్నారు. వీరితోపాటు ఐప్యాక్కు చెందిన ఒకరు, వైకాపా సోషల్ మీడియాకు చెందిన ప్రతినిధి ఇందులో సభ్యులుగా చేరారు. ఈనెల 16న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించగానే కోడ్ అమల్లోకి వచ్చింది. నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ మాధ్యమాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రచారం చేయడం చట్టవిరుద్ధమే. కోడ్ వచ్చినప్పటి నుంచి దీనిని పట్టించుకోకుండా ప్రజల్లో విషబీజాలు నాటుతోంది వైకాపా మూక. సామాజిక మాధ్యమాల ద్వారా వీలైనంత ఎక్కువ మందిని చేరేందుకు నిబంధనలను తుంగలోకి తొక్కి ఎన్నికల ప్రచారాన్ని వైకాపా కలుషితం చేస్తోంది. రెండు జిల్లాల్లో చాలా సచివాలయాల పరిధిలో ఆయా వాట్సాప్ గ్రూపుల్లో ఇదే రీతిలో వైకాపా అనుకూల పోస్టింగులను పెడుతున్నారు.
జగన్ భజనలో..
వైకాపా సోషల్ మీడియా విభాగం రూపొందించిన లఘు చిత్రాలు, జగన్ ప్రచార సభలు, ఫొటోలు, వీడియోలను వాట్సాప్ గ్రూప్ల్లో ఉంచుతున్నారు. తెదేపా, జనసేన, భాజపాలకు వ్యతిరేకంగా తయారు చేసిన పోస్టర్లు, నినాదాలను పోస్టు చేస్తున్నారు. మచ్చుకు.. మంత్రి జోగి పోటీ చేస్తున్న పెనమలూరు పరిధిలో ‘మన తాడిగడప-1 సచివాలయం’ వాట్సాప్ గ్రూప్ పరిశీలిస్తే.. ఈ వ్యవహారం బయటపడుతుంది. ఈనెల 20న.. ‘వాలంటీర్లపై తెదేపా దాష్టీకం’ పేరుతో ఓ పోస్టు పెట్టారు. ఇందులో సాక్షి టీవీలో ప్రసారమైన క్లిప్పింగ్ ఉంచారు. వాలంటీర్లు గౌరవ వేతనం తీసుకుని, సేవాభావంతో పనిచేస్తున్నారనీ.. ప్రజల సానుభూతి పొందే రీతిలో పోస్టు పెట్టారు. వాలంటీర్లు ప్రచారాల్లో పాల్గొనవద్దని స్పష్టంగా ఎన్నికల సంఘం చెప్పింది. దీంతోపాటు నిబంధనలు అతిక్రమించి ప్రచారంలో పాల్గొంటున్న వారిపై వేటు వేస్తోంది. దీనిని గాలికొదిలేసి.. వాలంటీర్లు కనిపిస్తే చావబాదాలని తెదేపా పిలుపు ఇచ్చిందనీ, కక్ష రాజకీయాలకు తెగిస్తున్నారని విషప్రచారం చేస్తున్నారు. ఇలా కుప్పలుతెప్పలుగా విష పోస్టులు పెడుతున్నారు.
పట్టించుకోని అధికారులు..
ప్రజలు, లబ్ధిదారులు సభ్యులుగా ఉన్న వాట్సాప్ గ్రూప్ల్లో వైకాపా అనుకూల ప్రచారం నిషేధం. మాది అధికార పార్టీ.. నిబంధనలు మాకు పట్టవనే రీతిలో విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తోంది. ఇలాంటి వాటిపై నిఘా పెట్టి, నిలువరించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ గ్రూపుల్లో సచివాలయ కార్యదర్శులు కూడా సభ్యులుగా ఉన్నారు. కోడ్ అమల్లోకి వచ్చాక అధికార, ప్రతిపక్ష పార్టీలు తేడా లేకుండా అందరినీ సమానంగా చూడాలి. దీనికి అధికారులు తిలోదకాలు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
బరితెగించారు..
ఈ నెల 27.. నుంచి సీఎం జగన్.. ఇడుపులపాయ నుంచి ‘మేమంతా సిద్ధం’ పేరుతో తొలి విడత బస్సు యాత్ర ప్రారంభించారు. దీనిపై టీజర్ విడుదల చేశారు. ‘మేమంతా సిద్ధం యాత్రతో బెంబేలెత్తిపోతున్న పచ్చమంద’ అని సచివాలయ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేసింది వైకాపా సోషల్ మీడియా బృందం.
28న.. బస్సు యాత్ర రెండో రోజు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సాగింది. అక్కడి యాత్ర వీడియోలు, వైకాపా స్టార్ క్యాంపెయినర్ పేరుతో లబ్ధిదారుల అభిప్రాయాలు ఉంచారు.
29న.. బస్సు యాత్ర మూడో రోజు ఎమ్మిగనూరు, కోడుమూరుల్లో సాగిన తీరుపై పెద్దఎత్తున వీడియోలు, చిత్రాలను సోషల్ మీడియా బృందం ఉంచింది.
- ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారం నీడలో.. అరాచక లాఠీ!
[ 29-04-2024]
ప్రజాస్వామ్యమంటే గౌరవం లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచే జీతభత్యాలు పొందుతున్నామన్న ధ్యాస లేదు. చట్టాన్ని త్రికరణశుద్ధిగా అమలు చేస్తామని, బాధితులకు బాసటగా నిలుస్తామని చేసిన ప్రమాణాలనే తూచ్ అనేశామన్న బాధే లేదు. -
పట్టాల పేరుతో కోట్లు కొట్టేశారు!
[ 29-04-2024]
జగన్ జమానాలో అవినీతి, అక్రమాల ఆక్టోపస్లు దశదిశలా వేళ్లూనుకుపోయాయి. నేతలు.. కొంతమంది అధికారులు కుమ్మక్కై ప్రజాధనాన్ని నిలువునా దోచేశారు. సెంటు పట్టా పేరుతో భారీ కుంభకోణానికి తెర తీసి రూ. కోట్లు వెనకేసుకున్నారు. -
బ్యాంకు ఖాతాలకే పింఛను సొమ్ము జమ
[ 29-04-2024]
ఏప్రిల్ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే జమ చేయనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
6న అవనిగడ్డకు పవన్ కల్యాణ్
[ 29-04-2024]
ఎంపీ వల్లభనేని బాలశౌరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్తో కలిసి ఆదివారం వేకనూరు వంతెన కూడలిలోని అభయాంజనేయస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. -
భారీగా బంగారం.. వెండి పట్టివేత
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా బంగారం, వెండి దొరికిన సంఘటన కంచికచర్ల మండలం పేరకలపాడు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. -
బుద్ధవిహార్కు వైకాపా గ్రహణం
[ 29-04-2024]
ప్రాచీన చరిత్ర కలిగిన ఘంటసాలలో ఏపీ పర్యాటక శాఖ ద్వారా 2017లో బుద్ధ విహార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి విడతగా రూ.1.5 కోట్లు మంజూరు చేయగా రెండంగస్తుల భవన నిర్మాణం చేపట్టారు. -
కూడూరులో కాగితకు మద్దతు
[ 29-04-2024]
వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) సొంత పంచాయతీ కూడూరులో తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. -
అభివృద్ధే ఆకాంక్ష..ఆశీర్వదించండి: కొల్లు
[ 29-04-2024]
బందరు అభివృద్ధే తమ ఆకాంక్ష అని..నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని 4, 5 డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. -
ఏకోపాధ్యాయులతో ఎదిగేదెట్టా?
[ 29-04-2024]
ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తానని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులుండేలా చర్యలు తీసుకుంటానని జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. -
కదిలితే కేసు.. మెదిలితే నోటీసు
[ 29-04-2024]
ఇలా పదే పదే గొప్పలు చెప్పిన వారి మాటలు సత్యదూరాలే అన్న విషయం కళ్లెదుటే కన్పిస్తోంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో అణిచివేసే విష సంస్కృతికి తెరతీశారన్న ఆరోపణలకు ఎన్నో ఉదాహరణలున్నాయి. -
వీరి గోడు పట్టించుకునేదెవరు..?
[ 29-04-2024]
నగరంలోని ఏ డివిజన్కు వెళ్లినా సమస్యలే కనిపిస్తున్నాయి. బందరుకోట ప్రధాన డ్రెయిన్ గుర్రపుడెక్కతో మేట వేసుకుపోవడంతో స్థానికులతో పాటు వివిధ డివిజన్లకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
‘జగన్ వస్తే అవస్థలు తప్పవు..’
[ 29-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవస్థలు తప్పవని, ప్రజలంతా కూటమిని గెలిపించాలని నిర్ణయం తీసేసుకున్నారని పెడన తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 29-04-2024]
పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని తెదేపా మండల అధ్యక్షుడు పోతన లక్ష్మీనరసింహస్వామి అన్నారు. మండల పరిధిలోని పోసినవారిపాలెం గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పలువురు ఆదివారం తెదేపాలో చేరారు. -
అమ్మకు కష్టం.. అందని వైద్యం
[ 29-04-2024]
వైద్యరంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పర్చామని, గ్రామీణులకు కార్పొరేట్ వైద్యం అందేలా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని వైకాపా ప్రభుత్వం చేస్తోన్న ప్రచారానికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కన్పించడం లేదు. -
అడుగేస్తే నిర్భంధం.. ప్రశ్నిస్తే కేసులు
[ 29-04-2024]
గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అయిదేళ్లుగా అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా పోయింది. కళ్లముందే జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలన్నా, ప్రశ్నించాలన్నా తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. -
కార్మికుల కడుపుకొట్టి.. గుత్తేదార్లకు దోచిపెట్టి
[ 29-04-2024]
కార్మికులకు అండగా ఉంటానంటూ ఆశలు రేకెత్తించి గద్దె నెక్కిన జగన్ నదుల్లోని ఇసుకను యంత్రాలతో ఎగుమతికి ప్రోత్సహించి మూడున్నరేళ్లుగా వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి గుత్తేదారులకు రూ.కోట్లు దోచిపెట్టారని లంకపల్లి, శ్రీకాకుళం, తోట్లవల్లూరు, శ్రీకాకుళం తదితర ఇసుక రేవుల్లో పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వైకాపా మాటలు నమ్మి మోసపోవద్దు : వర్ల
[ 29-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆయన మాటలు నమ్మి మరోసారి ఎవరూ మోసపోవద్దని తెదేపా కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
అభివృద్ధికి బాటలు వేద్దాం రండి
[ 29-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని కాలనీలను అభివృద్ధి పరిచేందుకు బాటలు వేద్దామని, అందరూ కలిసి రావాలని కూటమి విజయవాడ ఎంపీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని శివనాథ్, సుజనా చౌదరిలు ప్రజలకు పిలుపునిచ్చారు. -
నాణ్యమైన విద్యకు భరోసా ఏది జగన్?
[ 29-04-2024]
సంస్కరణల్లో భాగంగా ఏకోపాధ్యాయ పాఠశాలలంటూ చిన్నారుల జీవితాలతో జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది.