త్వరపడాలి.. బ్రో..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు స్థానాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు ఎవరో తేలిపోయింది. ఈ మేరకు వ్యూహ ప్రతివ్యూహాల రూపకల్పనలో ఉన్నారు.
ఇక మిగిలింది... జనసేన అభ్యర్థుల ఖరారే
బందరు లోక్సభ, అవనిగడ్డ అసెంబ్లీపై ఉత్కంఠ
ఈనాడు, అమరావతి: ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు స్థానాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు ఎవరో తేలిపోయింది. ఈ మేరకు వ్యూహ ప్రతివ్యూహాల రూపకల్పనలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో జనసేనకు కేటాయించిన రెండు స్థానాల్లో అభ్యర్థుల ఖరారులో జాప్యం జరుగుతోంది. మచిలీపట్నం లోక్సభ స్థానం, అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లకు, రెండు లోక్సభ స్థానాలకు వైకాపా అభ్యర్థులను వెల్లడించింది. వీరంతా ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఒక లోక్సభ, 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు తెదేపా అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా.. విజయవాడ పశ్చిమ నుంచి భాజపా పోటీచేయనుంది. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరిని ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించి సంచలనం సృష్టించింది. త్వరలో భాజపా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. ఇక జిల్లాలో మిగిలింది కూటమిలో జనసేనకు కేటాయించిన సీట్లు మచిలీపట్నం లోక్సభ, అవనిగడ్డ అసెంబ్లీ స్థానాలు మాత్రమే.
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడిగా రంగంలోకి దిగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో తెదేపాకు గట్టి పట్టు ఉంది. తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు సొంత జిల్లా కావడం విశేషం. ఆయన గుడివాడ నుంచి ప్రాతినిధ్యం వహించేవారు. ఆ నేపథ్యంలోనే కూటమిలో జనసేనకు ఒక లోక్సభ, ఒక అసెంబ్లీ సీటు కేటాయించారు. భాజపాకు ఒక స్థానం కేటాయించారు. పూర్వ ఉమ్మడి జిల్లా పరిధిలో కైకలూరు స్థానాన్ని భాజపాకు కేటాయించారు. జిల్లాలో ప్రధాన పోటీ కూటమి అభ్యర్థులకు, అధికార పక్షం వైకాపా అభ్యర్థులకు మధ్య ఉంటుంది. కూటమిలో జనసేన మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. వామపక్షాలు కొన్ని స్థానాల్లో పోటీకి దిగే అవకాశం ఉంది. ప్రధానంగా విజయవాడ మధ్య నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు పోటీ చేయనున్నారు.
బందరు ప్రధాన రహదారి
కూటమిలో తర్జనభర్జన
మచిలీపట్నం లోక్సభ స్థానానికి సిటింగ్ ఎంపీ బాలశౌరి కూటమి అభ్యర్థిగా బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. ఆయన 2019లో వైకాపా నుంచి విజయం సాధించి ఇటీవల జనసేనలో చేరారు. అయితే ఆయనకు దాదాపు సీటు ఖరారనే ప్రచారం జరిగింది. కానీ ప్రకటనలో జాప్యం జరుగుతోంది. ఆయనకు ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థి పేరు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఒక వేళ ప్రత్యామ్నాయం పరిశీలిస్తే.. బాలశౌరిని అసెంబ్లీకి పంపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పార్లమెంటుకు ఎవరు పోటీ చేస్తారనే దానిపై అటు జనసైనికులు, మిత్రపక్షాల కార్యకర్తలు, అభ్యర్థుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఆప్రభావం అసెంబ్లీ నియోజకవర్గాలపైనా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అవనిగడ్డకు మొదటి నుంచి బండ్రెడ్డి రామకృష్ణ పేరు పరిశీలనకు వచ్చింది. తర్వాత పలువురు ఆశించారు. నాగాయలంకకు చెందిన ఒక ఎన్నారై పేరు ప్రముఖంగా ప్రచారం జరిగింది. ఈ స్థానం తెదేపా సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ ఇలాకా కావడం విశేషం. పొత్తులో భాగంగా జనసేనకు ప్రకటించినా.. ఆయన తేలిగ్గా తీసుకున్నారు. పొత్తు ధర్మం పాటిస్తామని ప్రకటించారు. కానీ అభ్యర్థిపైనే ఉత్కంఠ నెలకొంది.
ప్రత్యర్థులు సిద్ధం..
కూటమి తరఫున పోటీ చేసే జనసేన అభ్యర్థులకు ముందుగానే ప్రత్యర్థులు ఎవరో స్పష్టమైంది. ముందు బందరు పార్లమెంటు స్థానానికి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పేరు ప్రకటించారు. అవనిగడ్డ నియోజకవర్గానికి వైకాపా అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ను ఎంపిక చేశారు. ఆయన అంతగా ఇష్టపడలేదు. తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరారు. తర్జన భర్జనల తర్వాత తిరిగి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ను బందరు పార్లమెంటుకు, ఎమ్మెల్యేను తిరిగి అవనిగడ్డకు మార్చారు. ఇటీవల ర్యాలీతో చంద్రశేఖర్ మొదటిసారిగా బందరు వచ్చారు. మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ(తెదేపా) తనయుడిగా ప్రముఖ డాక్టర్గా గుర్తింపు ఉన్నా... ప్రజలకు మాత్రం పరిచయం లేదు. రాజకీయాలపట్ల అంతగా ఆసక్తి లేదు. ఆయనకు పోటీగా జనసేన కూటమి అభ్యర్థిగా ఎవరిని రంగంలోకి దించుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జనసేనకు పట్టు ఉన్న అవనిగడ్డలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులు డొక్కు.. డబ్బులు నొక్కు..!
[ 28-04-2024]
పేదలకు మేలు చేస్తున్నట్లు గొప్పలు చెబుతూ వచ్చిన సీఎం జగన్.. చేతల్లో వారిపై దెబ్బమీద దెబ్బ కొడుతూ వచ్చారు. సామాన్యులపై ఆర్టీసీ ఛార్జీల రూపంలో మోయలేని భారాన్ని మోపారు. ఇష్టారీతిన పెంచేసి షాక్ మీద షాక్లిచ్చారు. -
వైకాపా కార్యాలయానికి రెండు ఎకరాలు అవసరమా?
[ 28-04-2024]
దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయం ఎకరం స్థలంలో ఉంది.. బందరులో మాత్రం రెండు ఎకరాల విస్తీర్ణంలో వైకాపా కార్యాలయాన్ని కోటలా కట్టేస్తున్నారు అంత అవసరమా అని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. -
ఉన్నోళ్లు వద్దని.. ఆళ్లోళ్లు ముద్దని!
[ 28-04-2024]
‘‘ఉమ్మడి జిల్లాలో కొత్త వ్యక్తులు దిగారు. ఓటర్లకు, నాయకులకు పంపకాలకు యువతను దించారు. వైకాపా కార్యకర్తలో, ఐప్యాక్ టీం సభ్యులో కానీ.. నగరం, పట్టణాల్లోని కల్యాణ మండపాలు, ఇతర ఖాళీ గృహాలను వసతి కింద తీసుకుని బస చేస్తున్నారు. -
కూటమి విజయదుందుభి ఖాయం
[ 28-04-2024]
రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయ దుందుభి మోగించడం ఖాయమని.. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గెలుపును ఎవరూ ఆపలేరని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చెప్పారు. -
ఓటర్లు పెరిగారు
[ 28-04-2024]
జిల్లాలో ఓటర్ల సంఖ్య 15.39 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 15.18 లక్షలుగా ఉంది. -
కరోనాలోనూ కనికరించలె..
[ 28-04-2024]
కొవిడ్ సమయంలో మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను పోలీసులు, హోమ్గార్డులకు సహాయకులుగా పెట్టి విధులు నిర్వహించాలని వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. -
ఎత్తిపోతలూ ఎండగట్టారు
[ 28-04-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఎత్తిపోతల పథకాలు మూలకు చేరాయి. వాటి అభివృద్ధికి ఎటువంటి నిధులు విదల్చకపోవడంతో మూడేళ్లుగా పథకాలన్నీ మూతపడి లంక భూముల రైతులు గొల్లుమంటున్నారు. -
వైకాపా ఖాళీ అయిపోయింది: మండలి
[ 28-04-2024]
వైకాపా మొత్తం ఖాళీ అయిందని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలో జనసేన పార్టీకీ రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు. -
భారం మోపనన్నారు.. బాదేశారు
[ 28-04-2024]
అసలే అంతంత మాత్రపు బస్సులతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు పెరిగిన ఛార్జీలతో హడలిపోతున్నారు. కనీస ఛార్జి ఇంతకు ముందు రూ.5లు ఉంటే ప్రస్తుతం దానిని రూ.10లకు పెంచారు. -
రాక్షస పాలన నుంచి విముక్తి పొందుదాం
[ 28-04-2024]
ఐదేళ్ల రాక్షస పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన, భాజపా కూటమికి అఖండ విజయం చేకూర్చాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం
[ 28-04-2024]
చంద్రబాబుతోనే సంక్షేమం సాధ్యమని తెదేపా పెడన ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాదు సతీమణి శిరీష అన్నారు. శనివారం ఆమె కూటి శ్రేణులతో కలిసి మండల పరిధిలోని తరకటూరు, జక్కంచర్ల గ్రామాల్లో పర్యటించారు. -
మాటల గారడీ.. చేతల్లో బురిడీ
[ 28-04-2024]
బందరు నగరంలో ముస్లింల జనాభా ఎక్కువ. వారు ఏదైనా వేడుక చేసుకోవాలంటే సరైన షాదీఖానాలు లేక అవస్థలు పడుతున్నారు. 2000 సంవత్సరంలో తెదేపా హయాంలోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో ఇంగ్లీషుపాలెంలో షాదీఖానా నిర్మించారు. -
ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయండి
[ 28-04-2024]
మే 1న ఇంటి వద్దనే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగుల జీవితాలతో ఆటలాడొద్దని హితవుపలికారు. -
నిధులు తేలేక.. పొలంపల్లి పడక
[ 28-04-2024]
‘పోలంపల్లి డ్యాంకు 2004లో అప్పటి సీఎం వైఎస్ శంకుస్థాపన చేశారు కనుకే అధికారం చేపట్టిన తెదేపా పట్టించుకోలేదు. తండ్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ను తనయుడు పూర్తి చేసేలా మేమంతా కృషి చేస్తాం. -
జగన్ అన్ని రంగాలను దోచేశారు : వర్ల
[ 28-04-2024]
శాండ్, ల్యాండ్, మైన్, వైన్ ఇలా అన్ని రంగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దోచేశారని తెదేపా కూటమి నియోజకవర్గ అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
జగన్ బాదుడు
[ 28-04-2024]
అయిదేళ్లలో మూడు సార్లు ఆర్టీసీ ఛార్టీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. గుడివాడ నుంచి విజయవాడకు రైలు టికెట్ రూ.10 ఉండగా ఆర్టీసీ ఛార్జీ అయిదు రెట్లకుపైగా ఉంది. -
కూటమిని గెలిపించండి
[ 28-04-2024]
పెదకళ్లేపల్లిలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీగా బాలశౌరి, ఎమ్మెల్యేగా మండలి బుద్ధప్రసాద్లను గెలిపించాలని కోరారు. -
రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడి తనిఖీ
[ 28-04-2024]
రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు నరహరసింగ్ బంగర్ శనివారం కూచిపూడి ఓరియంటల్ జడ్పీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. -
వి.వి.లక్ష్మీనారాయణకు రక్షణ కల్పించండి
[ 28-04-2024]
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ పూర్వ అధికారి వి.వి.లక్ష్మీనారాయణకు మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, తగు రక్షణ కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
విద్యుదాఘాతంతో ఒకరు మృతి
[ 28-04-2024]
మండలంలోని మడక గ్రామంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శొంఠి హరికృష్ణ(36) శుక్రవారం రాత్రి విద్యుత్తు పరికరంతో ట్రాక్టర్ మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. -
ఉచిత వైద్యశిబిరం నేడు
[ 28-04-2024]
బొమ్మారెడ్డి సీతారెడ్డి కల్యాణ మంటపంలో ఆదివారం ఆస్టర్ రమేష్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు శనివారం తెలిపారు. -
‘పింఛన్లు ఇంటివద్దే ఇవ్వాలి’
[ 28-04-2024]
వేసవిని దృష్టిలో పెట్టుకొని మే 1న వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్లను వారి ఇంటివద్దకే వెళ్లి ఇచ్చే ఏర్పాటు చేయాలని...
తాజా వార్తలు (Latest News)
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
-
సామాన్యుడిని వదిలేసి.. సారొస్తే కోట్లు తగలేసి