మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైను ఐదేళ్లలో పూర్తి
దివిసీమ వాసులు దశాబ్దాలుగా కోరుతున్న.. మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైన్ను తాము గెలిచిన తర్వాత ఐదేళ్లలోనే పూర్తిచేస్తామని జనసేన, తెదేపా, భాజపా కూటమి మచిలీపట్నం లోక్సభ అభ్యర్థి, ఎంపీ వల్లభనేని బాలశౌరి వెల్లడించారు.
తెదేపా, జనసేన, భాజపా బందరు ఎంపీ అభ్యర్థి బాలశౌరి
మాట్లాడుతున్న ఎంపీ బాలశౌరి. పక్కన బుద్ధప్రసాద్ తదితరులు
అవనిగడ్డ, న్యూస్టుడే: దివిసీమ వాసులు దశాబ్దాలుగా కోరుతున్న.. మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైన్ను తాము గెలిచిన తర్వాత ఐదేళ్లలోనే పూర్తిచేస్తామని జనసేన, తెదేపా, భాజపా కూటమి మచిలీపట్నం లోక్సభ అభ్యర్థి, ఎంపీ వల్లభనేని బాలశౌరి వెల్లడించారు. కేంద్రాన్ని ఒప్పించి అనేక ప్రాజెక్టులకు తాను గత ఐదేళ్లలో నిధులను తీసుకొచ్చినా, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం తన కనీస వాటా విడుదల చేయకపోవడంతో వాటిని వాడుకునే వీలు లేకపోయిందన్నారు. జలజీవన్ మిషన్ కింద రూ.360 కోట్లను తాను తీసుకొస్తే.. రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయకపోవడంతో ఆ నిధులు వాడుకోలేకపోయాం. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. అనేక సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తామని బాలశౌరి తెలిపారు. అవనిగడ్డలో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్తో కలిసి బాలశౌరి విలేకరుల సమావేశం నిర్వహించారు.
పర్యాటక ప్రగతికి కృషి: హంసలదీవి, మంగినపూడి బీచ్లను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు పెట్టినట్టు బాలశౌరి తెలిపారు. గెలిచిన వెంటనే రూ.100 కోట్ల నిధులను తీసుకొచ్చి.. ఈ పర్యాటక ప్రాజెక్టు చేపడతామన్నారు. ఎదురుమొండి వంతెన నిర్మాణం కోసం నాబార్డు ఛైర్మన్తో మాట్లాడి రూ.109 కోట్లను తాను మంజూరు చేయిస్తే, దానిలో రూ.20 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించిందని బాలశౌరి తెలిపారు. దీంతో వంతెన నిర్మాణానికి టెండర్లు పిలిచినా.. గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎదురుమొండి వంతెనకు రూ.150 కోట్లతో మళ్లీ అంచనాలు రూపొందించి.. పూర్తిచేస్తామన్నారు. మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలకు విస్తరించే ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా చేపడతామన్నారు. కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేసే పోలవరం ప్రాజక్టుపై ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడించారు.
తాగు, సాగునీటికి ప్రాధాన్యం: మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. ఎంపీ బాలశౌరి సహకారంతో అవనిగడ్డను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. గతంలోనూ ఎదురుమొండి వంతెన కోసం బాలశౌరి నిధులు మంజూరు చేయిస్తే.. తాను హర్షం వ్యక్తం చేశానన్నారు. కానీ.. ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్బాబు గొడవ సృష్టించిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే.. తాగు, సాగు నీటికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
జనసేనలోకి భారీగా చేరికలు..
వైకాపాకు చెందిన అవనిగడ్డ మాజీ ఎంపీపీ దిడ్ల ప్రసాద్, సోర్లగొంది గ్రామ అగ్నికుల క్షత్రియ కుటుంబాలు, కోడూరు మండలం బడేవారిపాలెం నాయకులు.. జనసేన పార్టీలో చేరారు. తెదేపా నాయకులు వేమూరి గోవర్ధన్రావు, కొల్లూరి వెంకటేశ్వరరావు, బండే శ్రీనివాసరావు, జనసేన నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, మండలి వెంకట్రామ్, గుడివాక శేషుబాబు, భాజపా నేత తుంగల వెంకటగిరి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారం నీడలో.. అరాచక లాఠీ!
[ 29-04-2024]
ప్రజాస్వామ్యమంటే గౌరవం లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచే జీతభత్యాలు పొందుతున్నామన్న ధ్యాస లేదు. చట్టాన్ని త్రికరణశుద్ధిగా అమలు చేస్తామని, బాధితులకు బాసటగా నిలుస్తామని చేసిన ప్రమాణాలనే తూచ్ అనేశామన్న బాధే లేదు. -
పట్టాల పేరుతో కోట్లు కొట్టేశారు!
[ 29-04-2024]
జగన్ జమానాలో అవినీతి, అక్రమాల ఆక్టోపస్లు దశదిశలా వేళ్లూనుకుపోయాయి. నేతలు.. కొంతమంది అధికారులు కుమ్మక్కై ప్రజాధనాన్ని నిలువునా దోచేశారు. సెంటు పట్టా పేరుతో భారీ కుంభకోణానికి తెర తీసి రూ. కోట్లు వెనకేసుకున్నారు. -
బ్యాంకు ఖాతాలకే పింఛను సొమ్ము జమ
[ 29-04-2024]
ఏప్రిల్ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే జమ చేయనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
6న అవనిగడ్డకు పవన్ కల్యాణ్
[ 29-04-2024]
ఎంపీ వల్లభనేని బాలశౌరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్తో కలిసి ఆదివారం వేకనూరు వంతెన కూడలిలోని అభయాంజనేయస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. -
భారీగా బంగారం.. వెండి పట్టివేత
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా బంగారం, వెండి దొరికిన సంఘటన కంచికచర్ల మండలం పేరకలపాడు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. -
బుద్ధవిహార్కు వైకాపా గ్రహణం
[ 29-04-2024]
ప్రాచీన చరిత్ర కలిగిన ఘంటసాలలో ఏపీ పర్యాటక శాఖ ద్వారా 2017లో బుద్ధ విహార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి విడతగా రూ.1.5 కోట్లు మంజూరు చేయగా రెండంగస్తుల భవన నిర్మాణం చేపట్టారు. -
కూడూరులో కాగితకు మద్దతు
[ 29-04-2024]
వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) సొంత పంచాయతీ కూడూరులో తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. -
అభివృద్ధే ఆకాంక్ష..ఆశీర్వదించండి: కొల్లు
[ 29-04-2024]
బందరు అభివృద్ధే తమ ఆకాంక్ష అని..నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని 4, 5 డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. -
ఏకోపాధ్యాయులతో ఎదిగేదెట్టా?
[ 29-04-2024]
ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తానని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులుండేలా చర్యలు తీసుకుంటానని జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. -
కదిలితే కేసు.. మెదిలితే నోటీసు
[ 29-04-2024]
ఇలా పదే పదే గొప్పలు చెప్పిన వారి మాటలు సత్యదూరాలే అన్న విషయం కళ్లెదుటే కన్పిస్తోంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో అణిచివేసే విష సంస్కృతికి తెరతీశారన్న ఆరోపణలకు ఎన్నో ఉదాహరణలున్నాయి. -
వీరి గోడు పట్టించుకునేదెవరు..?
[ 29-04-2024]
నగరంలోని ఏ డివిజన్కు వెళ్లినా సమస్యలే కనిపిస్తున్నాయి. బందరుకోట ప్రధాన డ్రెయిన్ గుర్రపుడెక్కతో మేట వేసుకుపోవడంతో స్థానికులతో పాటు వివిధ డివిజన్లకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
‘జగన్ వస్తే అవస్థలు తప్పవు..’
[ 29-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవస్థలు తప్పవని, ప్రజలంతా కూటమిని గెలిపించాలని నిర్ణయం తీసేసుకున్నారని పెడన తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 29-04-2024]
పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని తెదేపా మండల అధ్యక్షుడు పోతన లక్ష్మీనరసింహస్వామి అన్నారు. మండల పరిధిలోని పోసినవారిపాలెం గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పలువురు ఆదివారం తెదేపాలో చేరారు. -
అమ్మకు కష్టం.. అందని వైద్యం
[ 29-04-2024]
వైద్యరంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పర్చామని, గ్రామీణులకు కార్పొరేట్ వైద్యం అందేలా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని వైకాపా ప్రభుత్వం చేస్తోన్న ప్రచారానికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కన్పించడం లేదు. -
అడుగేస్తే నిర్భంధం.. ప్రశ్నిస్తే కేసులు
[ 29-04-2024]
గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అయిదేళ్లుగా అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా పోయింది. కళ్లముందే జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలన్నా, ప్రశ్నించాలన్నా తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. -
కార్మికుల కడుపుకొట్టి.. గుత్తేదార్లకు దోచిపెట్టి
[ 29-04-2024]
కార్మికులకు అండగా ఉంటానంటూ ఆశలు రేకెత్తించి గద్దె నెక్కిన జగన్ నదుల్లోని ఇసుకను యంత్రాలతో ఎగుమతికి ప్రోత్సహించి మూడున్నరేళ్లుగా వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి గుత్తేదారులకు రూ.కోట్లు దోచిపెట్టారని లంకపల్లి, శ్రీకాకుళం, తోట్లవల్లూరు, శ్రీకాకుళం తదితర ఇసుక రేవుల్లో పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వైకాపా మాటలు నమ్మి మోసపోవద్దు : వర్ల
[ 29-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆయన మాటలు నమ్మి మరోసారి ఎవరూ మోసపోవద్దని తెదేపా కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
అభివృద్ధికి బాటలు వేద్దాం రండి
[ 29-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని కాలనీలను అభివృద్ధి పరిచేందుకు బాటలు వేద్దామని, అందరూ కలిసి రావాలని కూటమి విజయవాడ ఎంపీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని శివనాథ్, సుజనా చౌదరిలు ప్రజలకు పిలుపునిచ్చారు. -
నాణ్యమైన విద్యకు భరోసా ఏది జగన్?
[ 29-04-2024]
సంస్కరణల్లో భాగంగా ఏకోపాధ్యాయ పాఠశాలలంటూ చిన్నారుల జీవితాలతో జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు