అదనపు పని భారంతో సిబ్బంది సతమతం
ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తాం. భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తామని.. సీఎం జగన్మోహన్రెడ్డి ఊదరగొట్టారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా వేయలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
అదనపు పని భారంతో సిబ్బంది సతమతం
జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం
ఎన్టీఆర్ కలెక్టరేట్, మాచవరం, న్యూస్టుడే
ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తాం. భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తామని.. సీఎం జగన్మోహన్రెడ్డి ఊదరగొట్టారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా వేయలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. మరోవైపు ఖాళీలు భర్తీకాక.. విధుల్లో ఉన్న ఉద్యోగులపై అదనపు భారం పడుతోంది. ఒక్కొక్కరు ఇద్దరేసి పని చేస్తున్నారు. కిందామీద పడుతూ.. అప్పగించిన అదనపు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి, ఆందోళనలకు గురవుతున్నారు. తమ పట్ల వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమైన శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడం లేదని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ గాలికి వదిలేశారని దుయ్యబడుతున్నారు.
ఇంజినీర్ల కొరత
రహదారులు.. భవనాల, పంచాయతీరాజ్, జలవనరుల వంటి శాఖల్లో వేలాదిగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా దిగువ స్థాయిలో సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ (ఏఈఈ)/ సహాయ ఇంజినీర్ (ఏఈ) వంటి పోస్టుల భర్తీ చేయడం లేదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఒక్క పంచాయతీరాజ్ శాఖలోనే 600లకు పైగా ఏఈఈ/ఏఈ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వర్క్ఛార్జ్డ్ కింద పని చేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లు పదవీ విరమణ చేయగానే, సదరు పోస్టులను తిరిగి భర్తీ చేయడం లేదు. వీరి స్థానే సైట్ ఇంజినీర్లను పొరుగు సేవల కింద తీసుకుంటున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక పనుల బాధ్యతలను సైట్ ఇంజినీర్లు చూస్తున్నా.. వీరికి ఏడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. డీఎస్సీ వాయిదా వేయడం.. పోలీసు శాఖలోనూ ఖాళీల భర్తీ లేకపోవడం వెరసి.. రాష్ట్రంలో 2 లక్షల వరకు ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉన్నట్టు చెబుతున్నారు.
అనారోగ్యం పాలవుతున్నాం..
ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అటకెక్కడంతో.. ఉన్న ఉద్యోగులపై అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు చేయాల్సిన పని ఒకరిపైనే పడడంతో చితికిపోతున్నామని.. ఫలితంగా అనారోగ్యం పాలవుతున్నామని వాపోతున్నారు. ఇక మండల, డివిజన్ స్థాయి అధికారులు, సిబ్బంది వీడియో కాన్ఫరెన్స్లు, టెలీకాన్ఫరెన్స్లు, సమీక్షలు, సమావేశాలతో విసిగి పోతున్నారు. వారంలో అయిదు రోజుల పాటు వీసీలు, సమీక్షలు తదితరాలు తప్పడం లేదని, క్షేత్ర స్థాయిలో పనులకు ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల ప్రగతి చూపాల్సి వస్తోందని, చేసిన పనులకు బిల్లులు చెల్లించక పోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని పలువురు అధికారులు తమ గోడు వెళ్ల బోసుకుంటున్నారు. చేసిన పనులకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం, ఉద్యోగాలు భర్తీ కాకపోవడం వంటి కారణాలతో ఉద్యోగులు, అధికారులు సతమతమవుతున్నారు.
అదనపు భారంతో విసిగి పోతున్నా
-ఓ ఉద్యోగి
అదనపు భారంతో విసిగిపోతున్నాను. కేటాయించిన పనులే ఎక్కువ. దీనికి తోడు అదనపు పనులు. దీంతో పనులు పెండింగ్ ఉంటున్నాయి. విద్యుత్తు శాఖలో ఉద్యోగులను నియమించాలి.
ఇద్దరు చేసే పని ఒక్కరికే
-ఓ ఉద్యోగిని
ఇద్దరు ఉద్యోగులు చేసే పనిని ఒక్కదాన్నే చేస్తున్నాను. జీతం మాత్రం ఒకటే. విద్యాశాఖలో దస్త్రాలు పేరుకుపోతున్నాయి. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
పనికి తగిన వేతనం ఏదీ
-ఓ ఉద్యోగి
సమాన పనికి సమాన వేతనమని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నతాధికారులు చేసే పనిని కూడా మేమే చేయాల్సి వస్తోంది. సర్వశిక్ష అభియాన్లో ఒత్తిడి పెరిగిపోతోంది. అనారోగ్యానికి గురవుతున్నాను.
పోస్టులు భర్తీ చేయరేం?
-ఓ ఉద్యోగిని
వైకాపా ప్రభుత్వంలో క్రీడాశాఖలో ఉద్యోగాల భర్తీ చేపట్టలేదు. పొరుగు సేవల ఉద్యోగులతో కాలం నెట్టుకొట్టుస్తోంది. పనిలో నైపుణ్యం లేదు. ఒకే పనిని రెండు, మూడు సార్లు చేయాల్సి వస్తోంది. ఒక పనికే ఎక్కువ సమయం పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగుల ఓట్లకూ వైకాపా గాలం..!
[ 06-05-2024]
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. వందల సంఖ్యలో ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యారు. వారికి బ్యాలట్ విడుదల కాలేదు. -
ప్రవాసాంధ్రులూ.. పారాహుషార్!
[ 06-05-2024]
ఒక్క వ్యవసాయ భూములు, పొలాలే కాదు... ఇళ్లు, ఇళ్ల స్థలాలు, భవనాలు సహా.. అన్నిరకాల స్థిరాస్తులకు ఎసరు పెట్టేసింది జగన్ సర్కారు. కొత్తగా తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రకారం దొడ్డిదారిన ఆస్తులను కాజేసే అక్రమార్కులకు ఇది వరంగా మారనుంది. -
ప్రశాంతంగా నీట్
[ 06-05-2024]
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. విజయవాడతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు కళాశాలల వద్దకు విద్యార్థులు, తల్లిదండ్రులు నిర్దేశిత సమయం కంటే ముందే చేరుకున్నారు. -
పట్టా లేదు... వంశీ.. పత్తా లేరు..
[ 06-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు అర్హులకు అందని ద్రాక్షగానే మారాయి. రాజకీయ అండదండలు ఉన్నవారికే అధిక శాతం పట్టాలు దక్కాయి. -
ఉట్టిపడిన సంప్రదాయం
[ 06-05-2024]
రుగ్వేదం పద్మశ్రీకి ప్రపంచ రికార్డు ప్రదానం చేయడం సంతోషంగా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో స్వరలయ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వరలయ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. -
తెదేపా కార్యకర్తలపై రెచ్చిపోయిన వైకాపా మూకలు
[ 06-05-2024]
ప్రశాతంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్న తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడికి పాల్పడిన సంఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. -
పేర్ని నాని అరాచకానికి చెక్ పెడదాం
[ 06-05-2024]
మచిలీపట్నం నియోజకవర్గాన్ని సొంత సామాజ్యంగా భావిస్తూ రాచరికపు పోకడలతో అన్ని వర్గాలను అణిచివేస్తున్న పేర్ని వెంకట్రామయ్య(నాని) కబంధ హస్తాల నుంచి నియోజకవర్గాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సైనిక్ సమతాదళ్(ఎస్ఎస్డీ) నాయకులు స్పష్టం చేశారు. -
రేపు పవన్ రాక!
[ 06-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 7న గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా ఆయన రానున్నట్లు సమాచారం. -
వైకాపాకు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది
[ 06-05-2024]
పెత్తందారులు.. పేదలు అంటూ నాలుగు సంవత్సరాల పాటు నయవంచక పాలనకు పాల్పడిన వైకాపాకు తగురీతిన బుద్ధి చెప్పేందుకు సమయం వచ్చిందని సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం అన్నారు. -
నిబంధనలు బేఖాతర్
[ 06-05-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వైకాపా నాయకులు వాటిని పట్టించుకోవడం లేదు. ఎటువంటి అనుమతులతో పనిలేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. -
సూపర్-6 పథకాలతో సంక్షేమం పరుగులు
[ 06-05-2024]
అవనిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించడమే లక్ష్యం. సూపర్-6 పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం. నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తాం. యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. -
మీ భూములు కొల్లగొట్టేస్తారు..!
[ 06-05-2024]
ప్రజల ఆస్తులు, భూములు కొల్లగొట్టేందుకే వైకాపా ప్రభుత్వం కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే భూసర్వే, భూరక్ష పేర్లతో రైతుల భూములను సర్వే చేసింది. ఇందులో చాలా వ్యత్యాసాలు బయటపడ్డాయి. -
‘జగన్.. అధికార దుర్వినియోగం చేశారు’
[ 06-05-2024]
గత ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇస్తే.. ముఖ్యమంత్రి జగన్ దుర్వినియోగం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దుయ్యబట్టారు. -
తెదేపాకు అవరోధం.. వైకాపాకు సహకారం
[ 06-05-2024]
నందిగామలో తెదేపా కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్యను పోస్టల్ బ్యాలట్ ఓటు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా ఆర్వో ఎ.రవీంద్రరావు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేదని ఆమెను బయటికి పంపించారు. -
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
[ 06-05-2024]
ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 8న భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా డీకే బాలాజీ తెలిపారు. -
పోస్టల్ బ్యాలట్ సమాచారానికి హెల్ప్లైన్లు
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ పట్ల సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్లైన్లను ఏర్పాటు చేసినట్లు నోడల్ అధికారి షాహిద్బాబు తెలిపారు. -
సీఎం పర్యటనకా? పోస్టల్ బ్యాలట్కా?
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ విషయంలో పోలీసులకు కొత్త సమస్య ఎదురైంది. ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బందికి ఈ ఓటింగ్కు 6వ తేదీ కేటాయించారు. -
ఈవీఎం-వీవీ ప్యాడ్ల ఓటింగ్ సజావుగా సాగాలి
[ 06-05-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం-వీవీ ప్యాడ్ల) ద్వారా జరిగే ఓటింగ్ ప్రక్రియ సక్రమంగా, సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల పరిశీలకురాలు మంజురాజ్వాల్ సూచించారు. -
జిల్లాలో తేలికపాటి వర్షాలు
[ 06-05-2024]
జిల్లాలోని రెండు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. మొత్తం 5.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా, సగటు వర్షపాతం 0.26 మి.మీ.గా ఉంది. -
ఫెసిలిటేషన్ కేంద్రాల సంఖ్య పెంపు
[ 06-05-2024]
ద్యోగుల పోస్టల్ బ్యాలట్ వినియోగ నిమిత్తం జిల్లాలో అదనపు ఫెసిలిటేషను కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల ఆర్వోల కార్యాలయాల్లో ఆదివారం నూతనంగా పోస్టల్ బ్యాలట్ వినియోగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
ఫారం-12 అందజేతకు మరో అవకాశం
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులు ముందుగా ఫారం-12 కచ్చితంగా అందజేయాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల వీటిని ఇప్పటి వరకు సమర్పంచని వారికి ఈసీఐ మరో అవకాశం కల్పించినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.