5 ఏళ్లు ఏం చేశావు జగన్
చంద్రబాబు పరిపాలనలో అక్షరాల 23 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని లెక్కలు తేల్చారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలి.
ఊరించి ఉసూరుమనిపించిన వైకాపా ప్రభుత్వంపై యువత ఆగ్రహం
ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వని ముఖ్యమంత్రిగా చరిత్ర
చంద్రబాబు పరిపాలనలో అక్షరాల 23 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని లెక్కలు తేల్చారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలి. కోచింగ్ల కోసం మన పిల్లలు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ, చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు. పరీక్షల షెడ్యూల్ మార్చేస్తారు. సిలబస్ మార్చేస్తారు. నాలుగున్నరేళ్లలో గాడిదెలు కాశావా చంద్రబాబు.. మేము అధికారంలోకొస్తే మెగా డీఎస్సీ విడుదల చేస్తాం.
2019 ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్రెడ్డి అన్న మాటలివి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. మరి ఈ ఐదేళ్లు మీరేం కాశారు.. జగన్మోహన్రెడ్డి అని డీఎస్సీ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
అనంతపురం విద్య, న్యూస్టుడే: ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ప్రభుత్వం మోగా డీఎస్సీ విడుదల చేస్తామని దగా చేసింది. బీఈడీ, టీటీసీ, పండిత శిక్షణ, వ్యాయామ ఉపాధ్యాయ శిక్షణ పొందిన అభ్యర్థులకు జగన్మోహన్రెడ్డి కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకొచ్చారు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబునాయుడు ఏం చేశారని, మేము అధికారంలో కొచ్చిన వెంటనే మెగా డీఎస్సీ విడుదల చేస్తామని ప్రగల్భాలు పలికారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఉపాధ్యాయ ఉద్యోగాలు గుర్తొచ్చాయి. 23 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేవలం 6,100 పోస్టులో అసంబద్ధంగా డీఎస్సీ-2024 విడుదల చేశారు. ఇచ్చిన ఉద్యోగ ప్రకటన కూడా సాఫీగా జరగలేదు. దేశచరిత్రలోనే ఎక్కడా లేని విధంగా టెట్, డీఎస్సీ ఒకేనెలలో విడుదల చేయడం విడ్డూరం. ప్రభుత్వం తీసుకొన్న అనాలోచిత నిర్ణయంపట్ల అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి. చివరకు ఎన్నికల కోడ్తో మొతం ప్రక్రియ వాయిదా పడింది. అధికారం చేపట్టిన 5 సంవత్సరాల్లో ఒక్క డీఎస్సీ కూడా పూర్తి చేయని సీఎంగా జగన్ చరిత్రకెక్కారు.
అనంత అభ్యర్థుల ఆవేదన
డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల సంఖ్య రాష్ట్రంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఎక్కువ. కరవు ప్రాంతమైన అనంత జిల్లాలోని గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఊరి వదిలి పట్టణాలకు చేరుకున్నారు. పట్టణాల్లో అద్దె గదులు, ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటూ కోచింగ్లకు లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. కొందరు అవనిగడ్డ, కర్నూలులో శిక్షణ తీసుకున్నారు. తల్లిదండ్రులు కూలీనాలీ చేసి తమ పిల్లలను డీఎస్సీకి చదివిస్తున్నారు. మరికొందరు అప్పులు చేసి కోచింగ్ ఇప్పిస్తున్నారు. పరీక్షలు నిర్వహించకుండా వాయిదా వేసి ప్రభుత్వం అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది.
కల్యాణమండపంలో పనికి కుదిరి..
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకమ్మవారిపల్లికి చెందిన కేశప్ప బీఎస్సీ బీఈడీ చేశారు. 2018 డీఎస్సీలో ఆశించిన స్థాయిలో మార్కులు సాధించలేకపోయారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేసేవారు. గత ఎన్నికల వేళ వైకాపా అధికారంలోకి వస్తే మెగా డీస్సీ విడుదల చేస్తామని జగన్మోహన్రెడ్డి హామీ ఇవ్వడంతో టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పరీక్షలకు సిద్ధమయ్యారు. ఐదేళ్లలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఎన్నికల వేళ డీస్సీ విడుదల చేయడం, వాయిదా పడటంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. కుటుంబపోషణకు ప్రైవేట్ కల్యాణమండపంలో మేనేజర్గా పనిచేస్తున్నారు.
ప్రభుత్వ తీరుతో అర్హత కోల్పోయాం
- ముత్యాలప్ప, అనంతపురం
ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడ్డాను. గతంలో ఏటా నియామక ప్రకటన వచ్చేది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 5 సంత్సరాల్లో ఒక్కటీ రాలేదు. నా వయసు 48 సంవత్సరాలు. ఐదేళ్లపాటు ఉద్యోగ ప్రకటన రాకపోవడంతో అర్హత కోల్పోయాను. వయో పరిమితి పెంచాలి. వైకాపా ప్రభుత్వ వైఖరితో ఎంతోమంది వయసు పైబడి అర్హత కోల్పోయారు. వారందరికీ అవకాశం కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది.
బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లికి చెందిన రోశయ్య, అంజినమ్మ దంపతుల తనయుడు రమేష్ 5 ఏళ్లుగా అనంతపురం నగరంలో అద్దె గదిలో ఉంటూ డీఎస్సీకి సన్నద్ధమవుతున్నాడు. 2018-డీఎస్సీలో ఉద్యోగం చేజారింది. జగన్మోహన్రెడ్డి అధికారంలోకొస్తే మెగా డీఎస్సీ విడుదల చేస్తారనే ఆశతో ఐదేళ్లుగా డీఎస్సీ కోసం ఎదురు చూశాడు. గత సంవత్సరం శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇప్పటికి సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేశాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. జగన్ను నమ్మి ఐదేళ్లు సమయం వృథా చేసుకొన్నానని, లేదంటే కియా పరిశ్రమలో ఉద్యోగంలో చేరేవాడినని రమేష్ వాపోతున్నాడు.
టీచర్ నుంచి బేల్దారిగా..
పుట్టపర్తి పట్టణం: నల్లమాడ మండలం తిప్పయ్యగారిపల్లికి చెందిన రమణప్ప ఉపాధ్యాయుడు కావాలనే లక్ష్యంతో బీఏ, టీపీటీ చేశారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఆరేళ్లుగా పనిచేశారు. ఏటా డీఎస్సీ విడుదల చేస్తానని, 26 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇవ్వడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరు వచ్చారు. ఐదేళ్లు గడిచిపోయినా ఉద్యోగాల భర్తీ ఊసేలేదు. చివరకు ఎన్నికల వేళ డీఎస్సీ విడుదల చేయడం, కోడ్ కారణంగా వాయిదా పడటం జరిగిపోయాయి. దీంతో రమణప్ప బెంగళూరుకు వెళ్లి తన పూర్వ సంస్థను సంప్రదించగా ఆయన స్థానంలో మరొకరిని తీసుకున్నట్లు చెప్పారు. నిరాశతో స్వగ్రామానికి వచ్చిన ఆయన కుటుంబపోషణకు బేల్దారి పనులకు వెళుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మైనింగ్ మాయగాళ్లు..
[ 29-04-2024]
గనులను వైకాపా నాయకులు కొల్లగొడుతున్నారు. దోపిడీకి చిరునామాగా మార్చేశారు. ప్రభుత్వ వ్యవస్థను సర్వనాశనం చేసి ప్రయివేటు వ్యక్తులకు ప్రకృతి సంపదను దాసోహం చేశారు. -
సీఎం రాగానే.. జనం జారుకున్నారు
[ 29-04-2024]
తాడిపత్రిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగం తేలిపోయింది. ఐదేళ్లుగా బటన్లు నొక్కే కార్యక్రమాల్లో ఏం చెప్పారో.. ఇప్పుడూ అదే ప్రసంగాన్ని ఊదరగొట్టారు. -
జీబీసీపై కన్నెత్తి చూడని జగన్
[ 29-04-2024]
గుంతకల్లు బ్రాంచ్ కెనాల్(జీబీసీ)ను జగన్ సర్కారు ఈ ఐదేళ్లలో కన్నెత్తి చూడలేదు. ఉరవకొండ, విడపనకల్లు, గుంతకల్లు, కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంత రైతులకు జీబీసీ వరం లాంటిది. -
ఐదేళ్లు.. రూ.600 కోట్లు
[ 29-04-2024]
ప్రత్యేక సవరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను భారీగా వడ్డించింది. -
తెదేపా ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
[ 29-04-2024]
కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకలు రాళ్ల దాడికి తెగబడ్డాయి. -
ఐదేళ్లలో వక్కసారీ ఇటు చూడలేదే..
[ 29-04-2024]
వక్క సాగులో మడకశిర నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రసిద్ధి. కర్ణాటక సరిహద్దున ఉన్న ఈ ప్రాంతం సాగుకు అనుకూలంగా ఉండటంతో 150 ఏళ్లుగా పంట పండిస్తున్నారు. -
కర్ణాటకలో కళకళ.. జగన్ పాలనలో ఇలా..
[ 29-04-2024]
ఒక పరిశ్రమ ఏర్పాటైతే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రగతి సాక్షాత్కారమవుతుంది. జగన్ పాలనలో అలాంటిదేం ఉండదు. -
ఎమ్మెల్యే సోదరుడిని జిల్లా బహిష్కరణ చేయాలి
[ 29-04-2024]
ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి దౌర్జన్యకాండకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని, అతడిని జిల్లా బహిష్కరణ చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు. -
తెదేపా సూపర్ సిక్స్ ముందు.. వైకాపా గ్రాఫ్ పడిపోయింది: కేశవ్
[ 29-04-2024]
వైకాపా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోతో ఆ పార్టీ శ్రేణులే తీవ్ర నిరాశ నిస్పృహల్లో కనిపిస్తున్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
చిట్టడివి కాదు.. జగనన్న కాలనీనే
[ 29-04-2024]
జగనన్న కాలనీల్లో తమ ప్రభుత్వం పేదలకు స్థలాలు ఇవ్వడమే కాదు.. ఊళ్లనే నిర్మిస్తోందని సీఎం జగన్, వైకాపా నాయకులు సభలు, సమావేశాల్లో ఊదరగొట్టారు. -
శిథిల భవనంలోనే వైద్య సేవలు
[ 29-04-2024]
విడపనకల్లులో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల భవనం శిథిలమైంది. -
రథోత్సవానికి ఆహ్వానించలేదని వాగ్వాదం
[ 29-04-2024]
వజ్రకరూరులో రథోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచి, ఆలయ పాలక మండలి సభ్యులను అధికారిక లాంచనాలతో ఆహ్వానించలేదని ఉపతహసీల్దార్ చంద్రశేఖర్, ఈవో కృష్ణయ్యతో స్థానిక వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగారు. -
మట్టి దారిలో అవస్థల ప్రయాణం
[ 29-04-2024]
మండలంలోని ఎనుములదొడ్డి నుంచి శెట్టూరు మండలం యరబోరేపల్లికి ఏడు కిలోమీటర్ల మేర మట్టి దారి గుంతలు తేలి ప్రయాణానికి ఏమాత్రం అనుకూలంగా లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. -
బోరు తవ్వకం అడ్డగింత
[ 29-04-2024]
పట్టణంలోని కోటవీధిలో ప్రజలు చందాలు వేసుకుని బోరు తవ్వకం చేపట్టగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. -
టెండరులోనే తిరకాసు.. అద్దె ఎగ్గొట్టినందుకు తాఖీదు
[ 29-04-2024]
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి చెందిన వాణిజ్య సముదాయంలోని అద్దె గదులు, క్యాంటీన్ లీజుదారులు వర్సిటీకి అద్దె చెల్లించకుండా బకాయిలు పడ్డారు. -
పెళ్లి లారీ బోల్తా
[ 29-04-2024]
వివాహ వేడుకలు ముగించుకుని సొంతూళ్లకు పయనమవుతున్న వారికి దారి మధ్యలో సంభవించిన అనుకోని ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
[ 29-04-2024]
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు