logo

వైకాపా కార్యకర్తల కవ్వింపు చర్యలతో ఉద్రిక్తత

కొత్తచెరువు బీసీ కాలనీలో తెదేపా అభ్యర్థి ప్రచారం సందర్భంగా వైకాపా కార్యకర్తల కవ్వింపు చర్యలు కొంత ఉద్రిక్తతకు దారి తీశాయి.

Published : 16 Apr 2024 05:55 IST

వైకాపా కార్యకర్తలను నియంత్రిస్తున్న పోలీసులు

కొత్తచెరువు, న్యూస్‌టుడే : కొత్తచెరువు బీసీ కాలనీలో తెదేపా అభ్యర్థి ప్రచారం సందర్భంగా వైకాపా కార్యకర్తల కవ్వింపు చర్యలు కొంత ఉద్రిక్తతకు దారి తీశాయి. తెదేపా అభ్యర్థి పల్లె సింధూర స్థానిక నాయకులు, కార్యకర్తలతో బీసీ కాలనీలో ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇంతలో ఉన్నఫళంగా కొందరు వైకాపా కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని రండి చూద్దామంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ తెదేపా శ్రేణులకు ఎదురొచ్చారు. ఊహించని పరిణామంతో తెదేపా వర్గీయులు కొంత సంయమనం పాటించినా వైకాపా కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు వైకాపా వర్గీయులను మందలించి పంపివేయడంతో సమస్య సద్దు మణిగింది. దీనిపై సీఐ రాజా రమేశ్‌ను వివరణ కోరగా సమస్య చిన్నదే సర్దిచెప్పి పంపామన్నారు. అయినా ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా దురుద్దేశంతో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని