ఇంటింటా వైద్యం అబద్ధం
‘గ్రామీణ ప్రజల ఇంటి వద్దకు వైద్యులు వెళ్లి నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చాం.. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్యవిధానాన్ని పేద, మధ్య తరగతి ప్రజల ముంగిటకు తెచ్చిన ప్రభుత్వం మాదే’
ఆర్భాటానికే పరిమితమైన ఫ్యామిలీ డాక్టర్ విధానం
‘గ్రామీణ ప్రజల ఇంటి వద్దకు వైద్యులు వెళ్లి నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చాం.. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్యవిధానాన్ని పేద, మధ్య తరగతి ప్రజల ముంగిటకు తెచ్చిన ప్రభుత్వం మాదే’
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రగల్భాలు ఇవి..
- వాస్తవంలో చూస్తే కార్యక్రమం మొక్కుబడిగా మారింది. వైద్యులు చుట్టపుచూపుగానూ రావడం లేదు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు.. అన్నిరకాల వ్యాధులకు మందు బిల్లలు ఇవ్వాల్సి ఉన్నా అందడం లేదు. గతంలో ఉన్న సంచార వైద్యవాహన పథకానికే పేరు మార్చి మమ అనిపించారు.
తిరుపతి(వైద్యం), న్యూస్టుడే: పల్లెల్లో వైద్యసేవలు మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇంటి వద్దకే వైద్యుల పేరిట గతేడాది ఏప్రిల్ 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేసింది. రెండు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలుపరిచిన తర్వాత ప్రవేశపెట్టింది. ఆ మేరకు 104 వాహనాల ద్వారా ఇద్దరు వైద్యులు ప్రతి గ్రామానికి నెలలో రెండుసార్లు వెళ్లాలి. వైఎస్ఆర్ క్లినిక్లో విధులు నిర్వహించే ఏఎన్ఎం, ఎంఎల్పీహెచ్లు, ఇద్దరు ఆశా వర్కర్లు ఆ గ్రామంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల దృష్టికి తీసుకురావాలి. సంచార వైద్య వాహనంలో వెళ్లే ఇద్దరు వైద్యులు ఒకరు వైఎస్ఆర్ క్లినిక్లో ఓపీని నిర్వహించాలి. మరో వైద్యుడు ఇంటింటికి వెళ్లి రోగులను పరిశీలించి వైద్యసేవలు అందించాలి. అవసరమైన పరీక్షలు అక్కడే చేయాలి. నాణ్యమైన మందులు నెలకు సరిపడా అందజేయాలి. గ్రామంలోని పాఠశాలకు వెళ్లి పిల్లల ఆరోగ్య పరిస్థితులు, టీకాల గురించి అవగాహన కల్పించాలి.
వైద్యులు రాక.. మందులు ఇవ్వక
నిర్దేశించిన రోజుల్లో గ్రామాల్లోకి 104 సంచార వాహనాలు వెళ్తున్నా అందులో వైద్యులు ఉండటం లేదు. ఓపీలో సైతం సిబ్బందే మందు బిల్లలు ఇచ్చి పంపుతున్నట్లు ఆరోపణలున్నాయి. వైద్యులను పూర్తిస్థాయిలో ప్రభుత్వం నియమించినప్పటికీ.. పర్యవేక్షణలేమి, సెలవుల కారణంగా వైద్యులు సక్రమంగా వెళ్లడం లేదు. ప్రతి వాహనంలో 64 రకాల మందులు.. 12 రకాల పరీక్షలు చేసేందుకు వీలుగా పరికరాలు ఉండాలి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చివరకు 20 రకాల మందులు చేర్చగా చివరకు ఇచ్చేది మధుమేహం, రక్తపోటు, జనరల్ సిరప్లు మాత్రమే. గర్భిణులకు అవసరమైన ఐరన్ మాత్రలు సైతం లేని పరిస్థితి. వైద్య పరీక్షలకు అవసరమైన సామగ్రిలేక మూడురకాల పరీక్షలు మాత్రమే చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేమి
నెలవారీ గ్రామాల్లోకి వచ్చే 104 వాహన సేవలపై పర్యవేక్షణ కొరవడింది. క్షేత్రస్థాయిలోని ప్రజలకు లబ్ధి చేరడం లేదు. వైద్యులు పరీక్షలు చేయడం లేదు. పడకల్లో ఉన్నవారి ఆరోగ్యస్థితిని వైఎస్ఆర్ క్లినిక్ వద్దకు వెళ్లి చెబితే.. సిబ్బందే దిక్కవుతున్నారు. వాహనంలో రక్తపోటు, మధుమేహం మాత్రలు మాత్రమే ఇస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ప్రైవేటును ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడేమో జ్వరానికే రూ.2-3 వేలు ఖర్చవుతోంది.
జి.మాధురి, నాయుడుపేట
ఒక్కరికీ పరీక్షలు చేయలేదు.
ఈ కార్యక్రమం ఉన్నట్లు మాకు తెలియదు. నేను కిడ్నీ వ్యాధిగ్రస్తుడిని. ఎవరూ మా ఇంటికి వచ్చి రోగం గురించి అడగలేదు. ఎలాంటి పరీక్షలు చేయలేదు. డాక్టర్ వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వలేదు. నేనే నెలనెలా తిరుపతి ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాను.
వై.వీరాస్వామి, సూళ్లూరుపేట
డెంగీతో ప్రాణాలు పోయినా స్పందన లేదు
మా గ్రామంలో విషజ్వరాలు ప్రబలాయి. డెంగీ విషజ్వరాలతో ఓ బాలిక మృతి చెందినా అధికారులలో చలనం లేదు. కనీసం గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
చంద్ర, వడ్డిపాళెం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛను పంచన.. నయా వంచన
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి జగన్, ఆయన ప్రభుత్వంలోని అధికారులు పండుటాకులను ఇబ్బంది పెట్టేందుకు మరో వికృత క్రీడకు తెరలేపారు. -
జన, ధన, మాన చోరుడు జగన్..
[ 30-04-2024]
‘ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర ప్రగతిని గోతిలో పాతిపెట్టాడు. రూ.లక్షల కోట్లు హాంఫట్ చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపాడు. -
వారాంతపు సెలవులు హుష్ఖాకీ
[ 30-04-2024]
జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండటంతో వీఐపీల తాకిడి అధికంగా ఉంటుంది.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు తరచూ తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అరగొండ ఆలయాలను సందర్శిస్తుంటారు.. -
సదుంలో రణరంగం
[ 30-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్.. మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో చేపట్టిన ప్రచారం ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీశాయి. -
రూ. 5 కోట్ల పనులు.. ఐదేళ్లూ విస్మరించారు
[ 30-04-2024]
త్రిరాష్ట్ర కూడలిలో శుభకార్యాలు, సమావేశాలు, సదస్సులు నిర్వహణకు సరైన వేదిక లేక ఇబ్బందులుండేవి. -
పోరు.. ఖరారు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. బరిలో నిలిచింది ఎందరో తేలిపోయింది. మరోవైపు తుది, అనుబంధ ఓటర్ల జాబితాలు ఖరారయ్యాయి. -
వనితే నిర్ణేత..!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయాన్ని మహిళలు నిర్ణయించనున్నారు. జిల్లా పరిధిలో 25వ తేదీ నాటికి మొత్తం 18,12,980 ఓటర్లు ఉన్నారు. -
ఓటుకొస్తే అమ్మ.. జీతాలకొస్తే ఆ..యమ్మ
[ 30-04-2024]
కాలే కడుపులు.. అర్ధాకలితో ఉన్నా తమకు అప్పజెప్పిన పనులు పూర్తిచేయడంలో ఆయాలు ముందుంటారనడంలో సందేహం లేదు. -
తిరుమల పవిత్రతను మంటగలిపారు
[ 30-04-2024]
శ్రీవారి దర్శనం టికెట్ల ధరను విపరీతంగా పెంచేసి తిరుమలకు వచ్చే భక్తులను గత ఐదేళ్లలో దోచుకున్నారని ఎన్డీయే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. -
వైకాపా ప్రచారానికి అనుమతులేవీ?
[ 30-04-2024]
వడ్డించేవాడు మనవాడైతే.. చాలన్న చందాన తిరుపతిలో వైకాపా, పోలీసుల తీరు కొనసాగుతోంది. -
ఆలయంలో అధికార పార్టీ ప్రచారం
[ 30-04-2024]
పట్టణంలోని బజారువీధి రామమందిరంలో సోమవారం రాత్రి అధికార పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ప్రచారం చేపట్టారు. -
బ్యాంకు ఖాతాల్లేకుంటే ఇంటి వద్దే పింఛన్ పంపిణీ: కలెక్టర్
[ 30-04-2024]
సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని మే ఒకటిన రెండు పద్ధతుల్లో చేపట్టనున్నామని కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
బ్యాండేజ్ వేసుకుని వినూత్నంగా ఎన్నికల ప్రచారం
[ 30-04-2024]
ఎన్నికల్లో సానుభూతి పొందాలని సీఎం జగన్ ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెదేపా, జనసేన నాయకులు ఎద్దేవా చేశారు. -
కోర్టులో కేసున్నా.. రోడ్డు నిర్మాణం
[ 30-04-2024]
మండలంలోని ముడిపల్లి పంచాయితీలోని వెంగన్న కండ్రిగ ఎస్టీకాలనీ వద్ద వైకాపా నాయకులు దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారని గ్రామస్థులు సోమవారం ఆరోపించారు. -
ఇద్దరు వాలంటీర్లపై వేటుకు సిఫార్సు
[ 30-04-2024]
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు వాలంటీర్లపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామని ఎంపీడీవో వరప్రసాద్ తెలిపారు. -
చీటీల మోసం కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు
[ 30-04-2024]
చీటీల పేరుతో మోసానికి పాల్పడిన కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం స్థానిక జిల్లా ప్రధాన సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి భీమారావు సోమవారం తీర్పు చెప్పారు. -
కమ్యూనిటీ హాలులో వైకాపా నాయకుల సమావేశం?
[ 30-04-2024]
తిరుమలలో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అదే సమయంలో వైకాపా తిరుమల విభాగం అధ్యక్షుడు చిన్నముని ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక కమ్యూనిటీ భవనంలో సమావేశమయ్యారు.