Rajamahendravaram: మా ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి కనపడటం లేదు!
ఎంపీ, ఎమ్మెల్యే కనపడటం లేదంటూ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో వెలిసిన పోస్టర్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
రాజానగరం మండలంలో వెలసిన గోడప్రతులు
రాజానగరం, న్యూస్టుడే: ఎంపీ, ఎమ్మెల్యే కనపడటం లేదంటూ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో వెలిసిన పోస్టర్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ అయిదేళ్ల నుంచి, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మూడేళ్ల నుంచి కనిపించట్లేదంటూ మండలంలోని నందరాడలో పలుచోట్ల పోస్టర్లు అతికించారు. అభివృద్ధి కోసం ఎంపీ నిధులు విడుదల చేయట్లేదని, పార్టీ విజయానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా దుర్వినియోగం అవ్వడంతో అభివృద్ధి అగమ్యగోచరంగా ఉందని, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారని మరో పోస్టరులో ఉంది. ఈ పోస్టర్లు తానే అతికించినట్లు మాజీ ఎంపీటీసీ సభ్యుడు అడుసుమిల్లి హరికృష్ణ శుక్రవారం తెలిపారు. తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేదని, ఎంపీ, ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోవట్లేదని అన్నారు. ఆ ఆవేదనతోనే వీటిని అతికించినట్లు చెప్పారు. గ్రామంలోని రామకోవెల సెంటర్, దేవిడి సెంటర్, ఒనువులమ్మ గుడి వద్ద అతికించానని, మిగిలిన మండలాల్లో కూడా వీటిని అతికిస్తానని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో హరికృష్ణ వైకాపా తరఫున ఎమ్మెల్యే రాజా విజయానికి పని చేశారు. అనంతరం తనను దూరం పెట్టడంతో పార్టీకి రాజీనామా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాను ప్రభుత్వాన్ని గద్దెదింపాలి
[ 06-05-2024]
మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆలోచించి ఓటు వేయాలని తెదేపా సీనియర్ నాయకుడు పెండ్యాల అచ్చిబాబు అన్నారు. -
వైకాపా పాలనలో అభివృద్ధి సున్నా.. అవినీతి వందశాతం: మోదీ
[ 06-05-2024]
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. -
ధాన్యపు రాశులకు నిప్పు పెట్టిన దుండగులు
[ 06-05-2024]
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవలలో అర్ధరాత్రి ఏడు ఎకరాల్లో ఆరబెట్టిన ధాన్యపు రాశులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
రానున్న ఎన్నికల్లో కూటమిదే విజయం
[ 06-05-2024]
రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి కూటమిగా ఏర్పాడ్డాయని, -
భవిష్యత్తు మనదే
[ 06-05-2024]
‘ఎన్నికలకు సరిగ్గా వారం ఉంది. మా ప్రసంగాలు వినండి. కూటమి మ్యానిఫెస్టో చదవండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అని పవన్కల్యాణ్ కోరారు. కాకినాడ జిల్లా తునిలోని గొల్ల అప్పారావు కూడలిలో వారాహి విజయభేరి బహిరంగ సభలో ఆదివారం సాయంత్రం ఆయన ప్రసంగించారు. -
అధర్మకర్తల మండలి
[ 06-05-2024]
జగనన్న పాలనలో పాలకవర్గాల(ధర్మకర్తల మండలి) సభ్యులు దేవస్థానం శ్రేయస్సు, భక్తుల సౌకర్యాలు కల్పించేలా పనిచేసింది అంతంతమాత్రమే. ఆలయ పాలకవర్గాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. -
ప్రజాగళం.. సర్వం సన్నద్ధం
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరుతోంది. సోమవారం అగ్రనేతల సభతో రాజమహేంద్రవరం కళకళలాడనుంది. కడియం మండలం వేమగిరిలో జరిగే ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ, -
ఇక్కడైనా గందరగోళం లేకుండా చూస్తారా?
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది, అత్యవసర సేవలు అందించే ఉద్యోగులకు సోమవారం నుంచి మూడు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ నిర్వహించనున్నారు. -
నూతన భూహక్కు చట్టంపై జగన్ సర్కారునే ప్రశ్నించాలి
[ 06-05-2024]
ఏపీ నూతన భూహక్కు చట్టం అమలుపై జగన్మోహన్రెడ్డి సర్కారును ప్రశ్నించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి ఫురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ నీతిఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కేవలం సూచించిందన్నారు. -
పవన్ కల్యాణ్ను అసెంబ్లీకి పంపిద్దాం
[ 06-05-2024]
జనసేన అధినేత పవన్కల్యాణ్పై తన తండ్రి ముద్రగడ పద్మనాభం విమర్శలు చేయడాన్ని ఖండించిన ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి తాజాగా మరో వీడియో సందేశం విడుదల చేశారు. -
పోస్టల్ బ్యాలెట్లపై కాకినాడలో గందరగోళం
[ 06-05-2024]
కాకినాడలోని పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ వినియోగ కేంద్రం వద్ద ఆదివారం గందరగోళం నెలకొంది. పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసినా జాబితాలో పేర్లు లేకపోవడంతో ఎన్నికల విధుల్లో ఉన్న చాలామంది ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
ఓటేశాక.. వృద్ధులను వదిలేశారు..
[ 06-05-2024]
ఎన్నికల ముందు ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేసిన జగన్ ఎన్నో హామీలు గుప్పించారు. అన్ని వర్గాలను మాటలతో మెప్పించి.. అనంతరం నిండా ముంచారు. -
మొదటి రోజు ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికలు-2024 ప్రక్రియలో భాగంగా ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులకు నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మొదటి రోజు ఆదివారం చిన్నపాటి సంఘటన మినహా ప్రశాంతంగా జరిగింది. -
అగ్నిసాక్షిగా.. పరిహారానికి ఎగనామం..!
[ 06-05-2024]
అనుకోకుండా అగ్ని ప్రమాదాలతో రోడ్డునపడుతున్న కుటుంబాలకు వైకాపా ప్రభుత్వం మొండిచేయే చూపుతోంది. బహిరంగ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు పేదలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. -
జీవితాలు మార్చేవారికీ జీతాల్లేవ్..!
[ 06-05-2024]
వైకాపా పాలనలో ప్రభుత్వ ఉద్యోగులేకాదు.. ఒప్పంద, పొరుగు సేవల్లో విధులు నిర్వహిస్తున్న చిరుద్యోగులు కూడా వేతనాలు సకాలంలో అందక, కుటుంబ పోషణ జరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
జగన్ జమానాలో.. అంపశయ్యపై ఆరోగ్యశ్రీ
[ 06-05-2024]
క్షేత్రస్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం పరిస్థితి దయనీయంగా ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం లేదు. రూ.కోట్లల్లో బకాయిలు నెలల తరబడి ఇవ్వకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. -
విపత్కర పాలనను సాగనంపడానికే కూటమి: పురందేశ్వరి
[ 06-05-2024]
రాష్ట్రంలోని విపత్కర పాలనను విచ్ఛిన్నం చేయడానికి కూటమి ఆవిర్భవించిందని కూటమి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
జగన్ తెచ్చిన నల్లచట్టంపై తిరుగుబాటు చేయాలి: ముప్పాళ్ల
[ 06-05-2024]
రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలు తిరుగుబాటు చేయాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు పిలుపునిచ్చారు. -
మీడియా ప్రతినిధులకూ పోస్టల్ బ్యాలట్ అవకాశం
[ 06-05-2024]
జిల్లాలో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలట్ ద్వారా వినియోగించుకునే వెసులుబాటును రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత ఆదివారం
తాజా వార్తలు (Latest News)
-
సూర్యకుమార్ యాదవ్ శతకం.. హైదరాబాద్పై ముంబయి విజయం
-
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
-
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం