అనుమతి కొంత అక్రమం కొండంత
పల్నాడులో మట్టి కొల్లగొడుతూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. అటవీ ప్రాంతంలో అడ్డగోలు తవ్వకాలు చేస్తున్నారు. కొంత ప్రాంతానికి అనుమతులు తీసుకుని ఇష్టానుసారం ఇతర ప్రాంతాలకు విస్తరించారు. ఇతరులెవరూ మట్టి తవ్వకాలు చేయకుండా అధికార
అడ్డగోలు తవ్వకాలతో రూ.కోట్లు స్వాహా
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే - గురజాల, గురజాల గ్రామీణ
పల్నాడులో మట్టి కొల్లగొడుతూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. అటవీ ప్రాంతంలో అడ్డగోలు తవ్వకాలు చేస్తున్నారు. కొంత ప్రాంతానికి అనుమతులు తీసుకుని ఇష్టానుసారం ఇతర ప్రాంతాలకు విస్తరించారు. ఇతరులెవరూ మట్టి తవ్వకాలు చేయకుండా అధికార యంత్రాంగంతో అడ్డుకట్ట వేస్తున్నారు. మట్టి కావాల్సిన వారు వారి వద్ద కొనుగోలు చేసేలా చక్కబెట్టుకున్నారు. అనుమతులు పేరు చెప్పి అక్రమాలు కొనసాగిస్తున్నారు. అక్రమ తవ్వకాలకు భారీ గోతులు సాక్ష్యాలుగా మిగిలాయి.
* గురజాల మండలం దైద గ్రామం సమీపంలో 5.93 ఎకరాల భూమిలో మట్టి తవ్వకాలకు అనుమతి తీసుకుని క్వారీ తెరిచారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు చేస్తూ ఎప్పటికప్పుడు భూగర్భ గనుల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. ఇందుకు విరుద్ధంగా నామమాత్రంగా పర్మిట్లు తీసుకుని అనుమతి లేని ప్రాంతాల్లో యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. భారీ యంత్రాలతో లోతుగా తవ్వకాలు చేస్తూ ప్రభుత్వ భూములను గుల్ల చేస్తున్నారు. అక్రమ తవ్వకాలతో భారీ గోతులు ఏర్పడ్డాయి. అటవీ ప్రాంతం కావడంతో అటువైపు ఎవరూ వెళ్లకపోవడం లీజుదారులకు కలిసొచ్చింది. రెండు భారీ పొక్లెయిన్లతో రాత్రీ పగలు ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు చేస్తూ మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గురజాల, రెంటచింతల, దాచేపల్లి మండలాలతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ మట్టి అవసరమైనా ఇక్కడి నుంచి తరలిపోతోంది. కొత్తగా యూనిట్లు పెట్టేవారికి, ఇళ్లు నిర్మించుకునేవారికి, వెంచర్లు వేస్తున్న వారు, భూములు చదును చేసుకునేవారు ఇలా ఎవరైనా ఇక్కడి మట్టి కొనుగోలు చేయాల్సిందే. స్థానిక అవసరాలకు ఎవరైనా ఒక్క ట్రాక్టరు మట్టి ఎక్కడి నుంచైనా తెచ్చుకున్నా వెంటనే యంత్రాంగాన్ని పంపి వారిని అడ్డుకుంటున్నారు.
దైద గ్రామం సమీపంలో తరలుతున్న మట్టి టిప్పర్
నిబంధనలకు నీళ్లు
భూగర్భ గనుల శాఖ నుంచి అనుమతి తీసుకున్న పరిమాణం కంటే లీజు ప్రాంతంలో అధికంగా తవ్వకాలు జరుగుతున్నాయి. అనుమతి ఇచ్చిన ప్రాంతంలోనే కాకుండా సుమారు 15 ఎకరాల్లో ఇష్టానుసారం తవ్వకాలు చేశారు. నిబంధనలకు నీళ్లొదిలి అత్యంత లోతుగా తవ్వి తరలిస్తున్నారు. వర్షాలకు భారీ గోతుల్లో నీరు నిలిచి అటుగా వెళ్లే పశువులు, గొర్రెలు మృత్యువాత పడే అవకాశం ఉంది. గోతులు ఎగుడుదిగుడుగా మట్టి లభించే వరకు వెళ్తున్నారు. లోతు సూచించేలా మధ్యలో దిమ్మెలు వదలాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇటీవల మాచవరం మండలంలో అక్రమ తవ్వకాలు చేసిన నీటికుంటలో పడి ఇద్దరు వ్యక్తులు, ఎద్దులు చనిపోయిన విషయం విదితమే. దైద గ్రామం సమీపంలో అటవీప్రాంతంలో అక్రమతవ్వకాలు జరుగుతుండటంతో భవిష్యత్తులో గోతుల్లో నీరు నిలిచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
వేల ట్రక్కుల తరలింపు
దైద గ్రామం సమీపంలో మట్టి తవ్వకాలు చేస్తూ రోజుకు సగటున 100 టిప్పర్లకు పైగా మట్టి వెళ్తోంది. ఈ లెక్కన నెలకు మూడు వేల ట్రక్కుల మట్టి తరలిపోతోంది. 16 నెలలుగా తవ్వకాలు జరుగుతుండటంతో వేల ట్రక్కులు తరలించారు. గురజాలకు టిప్పర్ మట్టి రూ.5,500, ఇతర ప్రాంతాలకు దూరం మేరకు రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. నాణ్యమైన ఎర్రమట్టి కావడం, చదును చేయడానికి, మొక్కల పెంపకానికి అనువుగా ఉండటంతో ఇక్కడి మట్టికి భారీ డిమాండ్ ఉంది. ఇదే అదునుగా అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. తవ్వకాల వైపు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటువైపు ఎవరైనా వెళ్తే ఎందుకు వచ్చారంటూ ప్రశ్నిస్తూ అడ్డుకుంటున్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరం లోపే ఇదంతా జరుగుతున్నా యంత్రాంగం దృష్టి సారించకపోవడం గమనార్హం. ఇదంతా గురజాల మండలానికి చెందిన నేత ఒకరు చక్కబెడుతున్నారు. ఆయన అనుచరులను పెట్టుకుని వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. నిత్యం వందల లారీల మట్టి తరలిపోతున్నా ఎవరూ అడ్డుచెప్పకుండా చూసుకుంటున్నారు. అనుమతి కొంత ప్రాంతానికి తీసుకుని ఎక్కడపడితే అక్కడ తవ్వుతూ సొమ్ము చేసుకుంటున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం..
- కిశోర్బాబు, ఇన్ఛార్జి సహాయ సంచాలకుడు, భూగర్భ గనుల శాఖ, దాచేపల్లి
దైద గ్రామంలో అనుమతులు తీసుకుని మట్టి తవ్వకాలు చేస్తున్నారు. అనుమతి తీసుకున్న పరిమాణానికి అక్కడ తవ్వకాలు జరిగిన గోతులు పరిశీలిస్తాం. అనుమతి లేని ప్రాంతాల్లో తవ్వకాలు జరిపితే జరిమానా విధిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూపర్6 తో సమగ్ర ప్రగతి
[ 08-05-2024]
‘రైతులకు ఆదాయం, గౌరవం పెంచేలా సాగును లాభసాటిగా తీర్చిదిద్దుతాం. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులతో వారి జీవన ప్రమాణాలు పెంచుతాం. రాజధాని అమరావతి నిర్మాణంతో ఈ ప్రాంత ప్రగతికి అవకాశాలు విస్తృతమవుతాయి. -
నైపుణ్యం చిదిమేశావు.. నైరాశ్యం నింపేశావు!
[ 08-05-2024]
ప్రపంచం మెచ్చే ప్రతిభా, పాటవాలు కలిగిన యువతను వైకాపా ఆధ్వర్యంలోని జగన్ ప్రభుత్వం గుర్తించలేదు. వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేదు. వారికి సరైన ఉద్యోగావకాశాలు కల్పించకుండా ఐదేళ్ల పాలనలో యువశక్తిని నిర్వీర్యం చేసిందనే అపవాదును జగన్ సర్కారు మూటగట్టుకుంది. -
జనం భూములపై జగన్ కుతంత్రం
[ 08-05-2024]
ఏపీ భూ హక్కు చట్టంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సామాన్యుల ఆస్తులు దర్జాగా లాక్కునేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారని, అందుకు మార్గంగా భూ హక్కు చట్టాన్ని ఎంచుకున్నారని గగ్గోలు పెడుతున్నారు. అధికారికంగానే ప్రజల భూములను ఆక్రమించేందుకు జగన్ ఈ చట్టాన్ని తీసుకొచ్చారంటున్నారు. -
మా పోస్టల్ బ్యాలట్ ఎక్కడ..?
[ 08-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్్ బ్యాలట్ నిర్వహణ తీరు గందరగోళంగా మారింది. పీవో, ఏపీవోలు బ్యాలట్ వినియోగంలోనూ స్పష్టత లేదు. -
ఖద్దరు అరాచకం.. ఖాకీల సలాం..
[ 08-05-2024]
చట్టం చేసే వారు.. దాన్ని అమలు చేయాల్సిన వారు ఒక్కటై.. వికృత క్రీడ ఆడితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో గత అయిదేళ్లలో రాష్ట్రంలో పరిస్థితులు అద్దం పట్టాయి. అధికార పక్షానికి కొమ్ముకాస్తూ ప్రతిపక్షాలను అణిచివేయడమే ధ్యేయంగా కొందరు పోలీసులు పనిచేసి అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. -
ఇసుకాసురులు
[ 08-05-2024]
వైకాపా నేతలు బరితెగించి కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీసీకేసీ కంపెనీకి కొన్ని రీచ్లలో ఇసుక తవ్వకాలకు అనుమతులను సాకుగా చూసి అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు. -
కొలువుల కల్పన.. వట్టి మాటలేనా.. గట్టిమేలు ఏదీ జగన్?
[ 08-05-2024]
జగన్ ఐదేళ్ల పాలన తలుచుకుని జిల్లాలోని యువత కోపంతో రగిలిపోతోంది. ఐదేళ్లలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఉద్యోగాలు, స్వయం ఉపాధిపై కోటి ఆశలతో చదువులు పూర్తిచేసి విద్యాలయాల నుంచి బయటకు రావటమే తప్ప కొలువులు దక్కించుకున్నవారు బహు అరుదనే చెప్పాలి. -
తెదేపా నేత కారుకు నిప్పు
[ 08-05-2024]
ఈపూరు మండలం ముప్పాళ్ల మాజీ సర్పంచి, తెదేపా నేత మోదుగుల నరసింహారావు కారును గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం వేకువన తగులబెట్టారు. గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం నరసరావుపేట వెళ్లి వచ్చి ఖాళీ ప్రదేశంలో కారు నిలిపి ఇంట్లో నిద్రపోయారు. -
ఎన్నికల సామగ్రికి పంచాయతీ నిధులు
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించడం ఎప్పటి నుంచో వస్తుంది. ఈసారి జగన్ సర్కారు గతంలో ఎన్నడూలేని విధంగా స్థానిక సంస్థలపై ఎన్నికల నిర్వహణ భారం వేస్తోంది. -
సజావుగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
[ 08-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ మూడో రోజు సజావుగా సాగింది. ఏడు నియోజకవర్గాల పరిధిలో మంగళవారం పోలింగ్ కేంద్రాల్లో 2516 ఓట్లు పోలయ్యాయి. -
మంగళగిరి అభివృద్ధికి లోకేశ్కు ఓటేయండి
[ 08-05-2024]
పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గ సాధన కోసం నారా లోకేశ్కు ఓటు వేయాలని ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి గాలి గోపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. -
‘దళితులంతా లోకేశ్ విజయానికి కృషి చేయాలి’
[ 08-05-2024]
మంగళగిరి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ విజయానికి దళితులంతా కలసి పనిచేయాలని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు పిలుపునిచ్చారు. -
పరిశీలకులకు ఎన్నికల వ్యయం అభ్యర్థనలు, ఫిర్యాదులు
[ 08-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు వ్యయ పరిశీలకులను జిల్లాకు కేటాయించిందని కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
‘మేం ఓట్లు అమ్ముకోం.. మా ఇంటికి రావొద్దు’
[ 08-05-2024]
మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి. -
‘రాక్షస పాలనకు ఓటుతో అంతం పలుకుదాం’
[ 08-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా సాగుతున్న రాక్షస పాలనకు ప్రజలు ఓటుతో అంతం పలకాలని సినీ నటుడు నారా రోహిత్ పిలుపునిచ్చారు. చెరుకుపల్లి మండలం బలుసులపాలెం, ఆరుంబాక గ్రామాల్లో తెదేపా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మంగళవారం మాట్లాడారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు
[ 08-05-2024]
ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఎన్నికల్లో ఓటేయాలని కలెక్టర్ రంజిత్బాషా సూచించారు. రేపల్లె మండలం పేటేరు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. -
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం
[ 08-05-2024]
ఈనెల 13న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని స్వీప్(పీడబ్యూడీ) జిల్లా నోడల్ అధికారి గుణశీల అన్నారు. -
దివ్యాంగులు.. వృద్ధులకు వాహన సౌకర్యం
[ 08-05-2024]
దివ్యాంగులు, వృద్ధ ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేకంగా సక్షం యాప్ను ప్రవేశపెట్టిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రంజిత్బాషా తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ దివ్యాంగులు, వృద్ధులు ఓట్లు వేయటానికి తమ ఫోన్లలో సక్షం యాప్ను డౌన్లోడ్ చేసుకుని పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడపిల్ల పుడితే రూ.2వేల డిపాజిట్.. ఎండ్రియల్లో యువ జంట వినూత్న నిర్ణయం
-
హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
-
‘జే బ్రాండ్’ మద్యం తాగి వృద్ధుడి మృతి
-
పెద్దపల్లి పోరు.. తండ్రీకొడుకులపై పోటీ
-
మాట తప్పిన జోగి.. మా సొమ్ములేవి?