తెదేపాతో జత.. వైకాపాలో కలవరింత
జిల్లాలో తెదేపాలో చేరికలు వెల్లువెత్తడంతో ఆ పార్టీ నాయకుల్లో జోష్ నింపుతోంది.
కూటమి గెలుస్తుందన్న కారణంతోనే..
అన్ని నియోజకవర్గాల్లోనూ పెరుగుతున్న చేరికలు
పర్చూరు నుంచి అత్యధికం
ఈనాడు-బాపట్ల
జిల్లాలో తెదేపాలో చేరికలు వెల్లువెత్తడంతో ఆ పార్టీ నాయకుల్లో జోష్ నింపుతోంది. నామినేషన్ల ఘట్టానికి ముందే ముఖ్య నేతలు వైకాపాను వీడి సైకిల్ ఎక్కుతుండటంతో జిల్లా వ్యాప్తంగా వైకాపా అభ్యర్థులను కలవరపెడుతోంది. కొద్ది రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా చేరికల పరంపర కొనసాగుతోంది. ప్రత్యేకించి పర్చూరు నియోజకవర్గంలో ఈ చేరికలు అధికంగా ఉండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీని వీడి వస్తున్న వారిలో ముఖ్య నాయకులు ఉండటం వైకాపాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నామినేషన్లకు ముందే ఫ్యాన్కు గుడ్బై చెప్పి తెదేపాలో చేరడానికి కారణం కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకం నాయకులకు కలగడమే ఈ చేరికలకు కారణంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పర్చూరు వైకాపాలో ముఖ్య నేతలు పార్టీని వీడి వెళ్లిపోవడంతో ఇక్కడ తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గెలుపు నల్లేరు మీద నడకేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నామినేషన్ల పర్వానికి ముందే పర్చూరులో వైకాపా ఖాళీ కానుండటంపై ఆ పార్టీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు పార్టీని వీడి వెళుతున్నా నిలువరించలేకపోతున్నారు. చేరికలతో నియోజకవర్గంలో తెదేపా బాగా బలపడుతోంది. ముందు నుంచి తెదేపాకు బలమైన నియోజకవర్గంగా ముద్రపడిన పర్చూరులో ప్రస్తుతం వైకాపా నుంచి వచ్చి చేరుతున్న వారితో కొన్ని గ్రామాల్లో అయితే వైకాపా ఉనికే లేకుండా పోతోంది. మార్టూరు మండలం రాజుపాలెంకు చెందిన ఏఎంసీ మాజీ ఛైర్మన్ జాస్తి వెంకటనారాయణ(బాబు), ఆయన సతీమణి, ఎంపీటీసీ సభ్యురాలు హేమలత, గ్రామ సర్పంచి, ఉప సర్పంచితో పాటు 500 కుటుంబాలు వైకాపాను వీడటంతో ఆ గ్రామంలో వైకాపా ఖాళీ అయిందనే చెప్పాలి. అదొక్కటే కాదు ఇలా అనేక గ్రామాల్లో పార్టీకి ఏజెంట్లను పెట్టుకోవటం కూడా కష్టమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అదేవిధంగా యద్ధనపూడి, పూనూరు సొసైటీ ఛైర్మన్లతో పాటు గన్నవరం ఎంపీటీసీ సభ్యుడు, చినగంజాం మాజీ జడ్పీటీసీ, ఇద్దరు సర్పంచులు ఇటీవలే తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా గ్రామ రాజకీయాల్నే కాదు మండలాన్ని శాసించే వారు కావడంతో నామినేషన్లకు ముందే ఇక్కడ తెదేపా విజయం సునాయాసంగా మారింది. గతంలో మార్టూరు, యద్ధనపూడి, కారంచేడు మండలాల నుంచి చేరికలు ఉండగా ప్రస్తుతం చినగంజాం, పర్చూరు మండలాల నుంచి చేరికల పరంపర కొనసాగుతోంది. సోమవారం మార్టూరు మండలం కోలలపూడి, ఇంకొల్లు మండలం పోశపాడు నుంచి పలువురు యడం బాలాజీ వర్గానికి చెందిన వైకాపా నాయకులు తెదేపాలో చేరటం ప్రాధాన్యం సంతరించుకుంది. గడిచిన మూడు రోజుల నుంచి 20 మంది వార్డు సభ్యులు, నలుగురు ఎంపీటీసీ సభ్యులు, ఇద్దరు సర్పంచులు పార్టీలో చేరడం చేరికల తీవ్రతను తెలియజేస్తోంది. చినగంజాం మండలంలో అక్కడి ఎంపీపీ అంకమ్మరెడ్డి అనుచరగణం మొన్నీమధ్య వెయ్యి మంది వరకు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో తెదేపా కండువాలు కప్పుకొన్నారు.
ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో తెదేపాలో చేరిన కోలలపూడి గౌడ సామాజిక వర్గ నేతలు
ఇన్ఛార్జిల్ని తరచూ మార్చటంతో..
అధికారంలో ఉండి కూడా గడిచిన ఐదేళ్లలో పర్చూరులో పార్టీని ముందుండి నడిపించే సమర్థుడిని ఇన్ఛార్జిగా పెట్టకుండా నిర్లక్ష్యం వహించడం వంటి వాటితో ఆ పార్టీలో గ్రూపులు పెరిగిపోయాయి. ఆపై తరచూ ఇన్ఛార్జిలను మార్చడం వారు తమకు నచ్చినవారిని చేరదీయటం, నచ్చని వారిని దూరం పెట్టడం వంటివి పార్టీని వీడటానికి కారణాలుగా భావిస్తున్నారు. మరోవైపు తెదేపా-జనసేన-భాజపా పార్టీలు మూడు కూటమిగా ఏర్పడటంతో జనాలకు బాగా వారిపై నమ్మకం ఏర్పడిందని, వచ్చేది కూటమి ప్రభుత్వమేనని భావించి కూడా కొందరు ముందస్తుగానే పార్టీని వీడుతున్నారు. వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలులో ఆదివారం ఒక్క రోజే 160 బలమైన వైకాపా కుటుంబాలు వచ్చి తెదేపా అభ్యర్థి ఆనందబాబు సమక్షంలో చేరారు. అదేవిధంగా కొల్లూరు మండలంలో 50 కుటుంబాలు చేరాయి. చీరాల, వేటపాలెం మండలాల నుంచి పలువురు వైకాపా కార్యకర్తలు అక్కడి అభ్యర్థి ఎం.ఎం.కొండయ్య సమక్షంలో చేరారు. రేపల్లె పట్టణంతో పాటు చెరుకుపల్లి, నగరం మండలాల్లో పలువురు అక్కడి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో పలువురు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేసే ముందు ఆలోచించండి: నారా బ్రాహ్మణి
[ 29-04-2024]
స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. -
ఒకే కారణంతో రెండుసార్లు సస్పెండ్ చేశారు.. క్యాట్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ
[ 29-04-2024]
కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసుపై విచారణ జరిగింది. -
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
[ 29-04-2024]
ఏపీ, తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
[ 29-04-2024]
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
[ 29-04-2024]
కుటుంబంలో చోటుచేసుకున్న చిన్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాడికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన చుండ్రు జయశ్రీ, ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు గ్రామానికి చెందిన శివరామకృష్ణకు 10 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ప్రశ్నిస్తే పగ.. స్వేచ్ఛకు సెగ
[ 29-04-2024]
ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడడానికీ వీల్లేదు. వారి అభిప్రాయాలను బహిరంగంగా పంచుకోవడాన్ని సహించరు. అయిదేళ్ల జగన్ పాలన అక్షరాలా ఇలాగే సాగింది. -
జగన్మోసకారి!
[ 29-04-2024]
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ -
సమరానికి సైకిల్ యాత్రతో సంసిద్ధం
[ 29-04-2024]
ఎన్నికల సమరానికి సైకిల్ యాత్రతో సంసిద్ధమని గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి తెలిపారు. ‘ -
పదవిని అడ్డు పెట్టుకుని అక్రమ సంపాదన
[ 29-04-2024]
‘ఎమ్మెల్యే పదవి అడ్డుపెట్టుకుని ప్రకృతి సంపదను నాశనం చేసి ఏకంగా 700 ఎకరాల్లో గ్రావెల్ తవ్వి కిలారి రోశయ్య అక్రమ సంపాదన వెనకేసుకున్నారు. -
నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగియనుంది. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు రిజిస్టర్ పార్టీలు, -
అర్ధరాత్రి దళిత మహిళల దుకాణాల కూల్చివేత
[ 29-04-2024]
పేద దళిత మహిళల దుకాణాలను శనివారం అర్ధరాత్రి కూలగొట్టించిన వైకాపా కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డిని అరెస్టు చేయాలని దళిత, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. -
‘అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేస్తాం’
[ 29-04-2024]
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేస్తామని యువనేత, మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. -
రూపు మారిన ఆస్తి దస్త్రం
[ 29-04-2024]
ఆస్తుల రిజిస్ట్రేషన్కు జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్నినెలల క్రితం ‘కార్డు 2.0 ప్రైమ్ విధానం తీసుకొచ్చి ఆందోళనకు గురిచేసింది. -
జగనన్నా.. ఉపాధి ఏదన్నా..?
[ 29-04-2024]
యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన అంశాల్లో సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చెప్పిన మాటలకు, క్షేత్ర స్థాయిలో పని తీరుకు ఏ మాత్రం పొంతన లేదన్న విషయం పారిశ్రామిక శిక్షణ సంస (ఐటీఐ)ల పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. -
డీఎస్సీ వేయలే.. ఒక్క టీచర్ ఉద్యోగమూ ఇవ్వలే!
[ 29-04-2024]
రాష్ట్రంలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేం అధికారంలోకి రాగానే వాటన్నింటిని భర్తీ చేస్తాం. -
నా ఎస్సీలంటూనే.. నిలువునా మోసం
[ 29-04-2024]
ఎక్కడ మాట్లాడినా.. నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. అంటూ ఎక్కడ లేని ప్రేమను మాటల్లో ఒలకబోసే జగన్.. వాస్తవంలోకి వచ్చేసరికి వారికి రిక్తహస్తాలే చూపారు. -
వారానికోసారే నీరు.. ఇదీ పాలన తీరు..
[ 29-04-2024]
గుంటూరు నగరపాలికలో విలీన గ్రామాలైన గోరంట్ల, రెడ్డిపాలెం, ప్రగతినగర్, మదర్థెరెసా నగర్లలో గుక్కెడు నీటి కోసం జనాలు నానా తంటాలు పడుతున్నారు. -
రూపు మారిన ఆస్తి దస్త్రం
[ 29-04-2024]
ఆస్తుల రిజిస్ట్రేషన్కు జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్నినెలల క్రితం ‘కార్డు 2.0 ప్రైమ్ విధానం తీసుకొచ్చి ఆందోళనకు గురిచేసింది. -
గుంటూరు మీదుగా రైళ్లు
[ 29-04-2024]
విజయవాడ- ఖాజీపేట మార్గంలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లు గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!