అప్పుల బాధతో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేంద్రనగర్ పోలీసులు, యువకుడి బంధువుల వివరాల మేరకు... కర్ణాటకకు చెందిన అవినాష్ ఖర్గే(26) కుటుంబ సభ్యులు కొన్నేళ్ల క్రితం శివరాంపల్లికి వచ్చి స్థిరపడ్డారు.
26న పెళ్లి అంతలోనే అనంతలోకాలకు..
రాజేంద్రనగర్, న్యూస్టుడే: అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేంద్రనగర్ పోలీసులు, యువకుడి బంధువుల వివరాల మేరకు... కర్ణాటకకు చెందిన అవినాష్ ఖర్గే(26) కుటుంబ సభ్యులు కొన్నేళ్ల క్రితం శివరాంపల్లికి వచ్చి స్థిరపడ్డారు. ముగ్గురు సోదరులతో పాటు తల్లిదండ్రులు ఇక్కడే నివసిస్తున్నారు. అవినాష్ ఖర్గే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 26వ తేదీన అవినాష్కి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అతడు వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ.15 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు తీసుకున్నాడు. నాలుగు నెలలుగా వాటిని సక్రమంగా చెల్లించట్లేదు. బ్యాంకుల నుంచి రుణం చెల్లించాలని ఒత్తిడి వస్తోంది. ఈ విషయంపై తన సోదరుడి దగ్గర వాపోయాడు. పెళ్లి తరువాత బ్యాంకు రుణాల గురించి చర్చిద్దామనుకున్నారు. ఈలోపే ఒత్తిడి తట్టుకోలేక అవినాష్ ఆదివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చాక గమనించిన కుటుంబ సభ్యులు.. రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అన్న సంతోష్కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఊళ్లోనే బతుకుదామన్న భార్య.. భర్త కాదనడంతో బలవన్మరణం
కంటోన్మెంట్, న్యూస్టుడే: ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఓ గృహిణి కన్నుమూసింది. మారేడుపల్లి ఠాణా ఎస్సై రవికుమార్ వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన నాగేశ్వర్రావు, దేవి(26) దంపతులు కుమార్తె శ్రావ్య(4) కుమారుడు సాత్విక్(15నెలలు)తో కలిసి ఏడాదిగా వెస్ట్ మారేడుపల్లిలో ఉంటున్నారు. వీరి పెద్దకుమార్తె వైష్ణవి స్వగ్రామంలోని తాతయ్య వద్ద ఉంటోంది. వీరి పక్కింట్లోనే దేవి అక్క నందిని, బావ శ్రీను ఉంటున్నారు. నాగేశ్వర్రావు స్థానికంగా ఓ కంటి ఆసుపత్రిలో ఆఫీస్బాయ్గా పనిచేస్తున్నాడు. దేవి గృహిణి. కొద్దిరోజులుగా ఆమె స్వగ్రామానికి వెళ్లి అక్కడే ఏదో పనిచేసుకొని బతుకుదామని పట్టుపడుతోంది. భర్త నిరాకరించడంతో గొడవలు జరుగుతున్నాయి. కొద్దిరోజులుగా ఆమె మనస్తాపానికి గురవుతోంది. శనివారం ఉదయం భర్త 9:30 గంటల ప్రాంతంలో విధులకు వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దేవి ఇంట్లోకి వెళ్లి గడియవేసుకుంది. పక్కింట్లో ఉన్న నందిని చూసి నిద్రపోవడానికి వెళ్లిందేమో అనుకుంది. కొంతసేపటికి సాత్విక్ ఏడుపు వినిపించడంతో కిటికీలోంచి చూసేసరికి దేవి ఫ్యాన్కు చీరతో ఉరేసుకుంటూ కనిపించింది. నందిని అరుపులు విన్న శ్రీను తలుపులు బద్ధలుగొట్టి దేవిని కిందకు దింపారు. హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం ఆమె మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
భవనంపై నుంచి పడి కార్మికుడి మృతి
ఘట్కేసర్, న్యూస్టుడే: భవనంపై ప్రకటనల బోర్డు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పిర్జాదిగూడకు చెందిన వీరస్వామి(35) ఆదివారం ఘట్కేసర్ మండలం అవుషాపూర్లోని ఓ భవనం మొదటి అంతస్తుపై ప్రకటన బోర్డు బిగిస్తుండగా కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఇతడిని స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ తెలిపారు. యజమాన్యం నిర్లక్ష్యమే ఘటనకు కారణమని, పని చేస్తున్న చోట రక్షణ చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోయారు. వీరస్వామి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెట్టింగ్ భూతం.. దా‘రుణాలు’ అనంతం
[ 29-04-2024]
బెట్టింగ్ వ్యసనం ప్రాణాలు తీస్తోంది. అప్పులపాలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంకొందరు బరితెగించి చోరీలు, హత్యలు చేస్తున్నారు. -
కారు రూపురేఖలు మార్చి.. భయభ్రాంతులకు గురిచేస్తూ..
[ 29-04-2024]
రూపురేఖలు మార్చిన ఓ కారుతో రహదారులపై శబ్దాలు చేస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రాజాసింగ్.. రాస్తా అలగ్
[ 29-04-2024]
ఆయన ఎవరి మాట వినరు.. ఆయన మాట పార్టీ వినదు. అందుకేనేమో ఆయన కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. -
అరచేతిలో ఏఐ..ప్రచారానికి సై
[ 29-04-2024]
మేము గెలిస్తే కూడళ్లను అభివృద్ధి చేస్తాం.. రహదారులను విస్తరిస్తాం.. గ్రామాలు, పట్టణాలను సుందరీకరిస్తాం.. ఎన్నికల ప్రచారంలో నేతలు ఇలా హామీలు ఇస్తుంటారు. -
ఎందుకీ నిర్లిప్తత.. ఓటేద్దాం పదపద
[ 29-04-2024]
ప్రతి ఎన్నికల్లో రాజధానిలో పోలింగ్ శాతం తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రకరకాల కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నా ఓటర్ల నిర్లిప్తత సైతం దీనికి తోడవుతోంది. -
ఎండలు సలసల.. మీటర్లు గిరగిరా
[ 29-04-2024]
నగరంలో విద్యుత్తు డిమాండ్ 4వేల మెగావాట్లను దాటింది. ఇందులో పావువంతు ఒక్క మేడ్చల్ జోన్ పరిధిలోనే ఉంటోంది. వెయ్యి మెగావాట్లకు ఈ జోన్ డిమాండ్ చేరువైంది. -
నీటి ట్యాంకర్లకు ట్రాకింగ్
[ 29-04-2024]
ఫుడ్ డెలివరీ యాప్స్లో ఏదైనా ఆర్డర్ చేసిన తర్వాత డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడు.. ఎన్ని నిమిషాల్లో మన ఇంటికి చేరుకుంటాడో ఇట్టే తెలుకోవచ్చు. -
అభ్యర్థుల తరపున అన్నీ తామై..
[ 29-04-2024]
చోటామోటా నాయకులు అని కొట్టి పారేయకండి.. ఎన్నికల వేళ వాళ్లే నేతలకు అండాదండా అవుతున్నారు. బూత్ స్థాయిలో ఎవరు ఎవరికి ఓటేస్తారో కచ్చితంగా చెప్పేయగలరు. -
ఓటు మన ప్రాథమిక హక్కు
[ 29-04-2024]
ఓటుని వినియోగించుకోవడం మన ప్రాథమిక హక్కని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి అన్నారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ ఉద్యానవనం వద్ద ఆదివారం ఉదయం -
ఓట్ల పండగకు దూరంగా ఉంటే ఎలా?
[ 29-04-2024]
చట్టసభలకు ప్రాతినిథ్యం వహించే ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న Ëపోలింగ్ ప్రక్రియలో మేధావులు, విద్యావేత్తలు, యువకులు, విద్యార్థులు సరిగా పాల్గోవడం లేదు. -
ఓటు సమ్మేళనాలు
[ 29-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నంచేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేస్తారు. అదే లోక్సభ ఎన్నికల్లో.. -
ఫలితాల్లో.. పత్తాలేని కొత్త పార్టీలు
[ 29-04-2024]
ప్రధాన పార్టీలు మినహాయిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేర్వేరు పార్టీల అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వడం లేదు. 1శాతం ఓట్లను పొందలేక చతికిలపడుతున్నారు. -
అంకురాల ప్రోత్సాహానికి స్టార్టప్ మిక్సర్
[ 29-04-2024]
అంకుర సంస్థలు ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నా మనసును తొలిచే మొదటి ప్రశ్న పెట్టుబడి ఎలా? ఆ తర్వాత మార్కెటింగ్, బ్రాండింగ్ పెంచుకోవడం, -
పుడమికి బలం.. జగతికి జీవాధారం
[ 29-04-2024]
తాగునీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపుదలకు ‘ఇంకుడు గుంతలకు’ మించిన చక్కటి మార్గం మరొకటి లేదు. -
రసవత్తరం..చేవెళ్ల పోరు
[ 29-04-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికలు ప్రతిసారీ రసవత్తరంగా సాగుతాయి. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంటుంది. -
ఓటు.. ఐదు రూపాలు
[ 29-04-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి ఓటును నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి వేస్తారు. అయితే ఓటును ఐదు విధాలుగా వినియోగించుకునే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పించింది. -
పోలీసుల అదుపులో ద్విచక్ర వాహనాల దొంగ
[ 29-04-2024]
తాండూరు పట్టణంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం.. కాపాడిన కానిస్టేబుల్
[ 29-04-2024]
వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. హుస్సేన్సాగర్లో దూకేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్, మరికొందరు -
వేసవిలో నగరానికి అదనపు జలాలు
[ 29-04-2024]
గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సరఫరాకు డిమాండ్ పెరిగిందని.. -
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట మోసం
[ 29-04-2024]
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట నలుగురి నుంచి రూ.65,36,590 మేర కొల్లగొట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఎస్సార్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపారు.