HYD News: బాబోయ్ దొంగలు.. తూచ్ అంతా ఒట్టిదే!
ఇటీవల బహదూర్పల్లికి చెందిన కార్తీక్ అనే యువకుడు డయల్ 100కు ఫోన్చేసి రైళ్లలో బాంబులు అమర్చారంటూ సమాచారం చేరవేశాడు. ఆగమేఘాల మీద రైల్వే పోలీసులు, బాంబు స్క్వాడ్, జాగిలాలతో
కుటుంబ కలహాలతో ఇళ్లలో చోరీ డ్రామాలు
డయల్ 100కు 10శాతం పైగా నకిలీ ఫోన్కాల్స్
మహానగరంలో పోలీసులకు వింత అనుభవాలు
ఇటీవల బహదూర్పల్లికి చెందిన కార్తీక్ అనే యువకుడు డయల్ 100కు ఫోన్చేసి రైళ్లలో బాంబులు అమర్చారంటూ సమాచారం చేరవేశాడు. ఆగమేఘాల మీద రైల్వే పోలీసులు, బాంబు స్క్వాడ్, జాగిలాలతో తనిఖీ చేసి అవన్నీ వదంతులని తేల్చారు. ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు.
ఈనాడు, హైదరాబాద్ రాజేంద్రనగర్, న్యూస్టుడే: సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో డయల్ 100కు రోజూ 800-900 ఫోన్కాల్స్ వస్తుంటాయి. ఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు 6-7 నిమిషాల వ్యవధిలో చేరుతున్నారు. కొందరు ఆకతాయిలు. మరికొందరు కుటుంబ తగాదాలతో విలువైన పోలీసుల సమయాన్ని వృథా చేస్తున్నారు.సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచనతో కొందరు ప్రబుద్ధులు చేస్తున్న చేష్టలపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఏటా డయల్ 100కు వచ్చే ఫోన్కాల్స్లో 10శాతం వరకూ కుటుంబ గొడవలు, ఆటపట్టించాలనే ఉద్దేశంతో చేస్తున్నవి ఉంటున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. గతంలో తప్పుడు ఫోన్కాల్స్ చేసిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వటం, మందలించి పంపటమో చేసేవారు. తాజా సంఘటనలో రాచకొండ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం.
ఎవరి లెక్క వారిదే
స్మార్ట్ఫోన్లు చేతికొచ్చాక.. సామాజిక మాధ్యమాల్లో ఆకతాయిల హల్చల్ పెరిగింది. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే పోస్టులను యథాతథంగా ఫార్వార్డ్ చేస్తున్నారు. ఇవి కొన్ని ఇబ్బందులకు దారితీస్తున్నాయి.
* కుషాయిగూడ పరిధిలో రాజకీయపార్టీ నాయకులు గొడవ పడుతున్నారంటూ వాట్సాప్లో రాగానే ఓ యువకుడు పోలీసులకు సమాచారమిచ్చాడు. అక్కడకెళ్లి పరిశీలించిన పోలీసులు తప్పుడు ప్రచారంగా నిర్ధారించారు.
* శివారు ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు కుమారుడి సంరక్షణలో ఉంటోంది. నడుచుకుంటూ వెళ్తున్న తనపై దాడిచేసి మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించకపోవటంతో ఆమెను గట్టిగా మందలించటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గొలుసును తానే కుమార్తెకు ఇచ్చినట్టు అంగీకరించింది. విషయం కొడుక్కి తెలిస్తే కోప్పడతాడనే భయంతో అలా చేసినట్టు కన్నీరు పెట్టుకుంది.
* బండ్లగూడ సమీపంలోని ఇంట్లోకి చొరబడిన దొంగలు 40తులాల బంగారం ఎత్తుకెళ్లినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ లభించిన వేలిముద్రలు పాత నేరస్తులతో సరిపోలకపోవడంతో ఇంటిదొంగల పని కావచ్చనే కోణంలో కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. వయోధికులైన తల్లిదండ్రుల నుంచి సొమ్ము కాజేసేందుకు కుమారుడే భార్యతో కలసి డ్రామా ఆడినట్టు నిర్ధారించారు.
అక్రమ సంబంధాల్లోనే అధికం
ఉత్తుత్తి దొంగతనాలు, తప్పుడు ఫిర్యాదులు అక్రమ సంబంధాలు/సహజీవనం వల్లనే వస్తుంటాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మల్కాజిగిరి డివిజన్ పరిధిలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ప్రవేశించిన అగంతకుడు బంగారం ఎత్తుకెళ్లినట్టు బాధితురాలు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో అక్కడ చోరీ జరిగినట్టు ఆధారాలు లభించలేదు. బాధితురాలు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో ఇదంతా ఇంటిదొంగ పని కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. గతంలో కేపీహెచ్బీ కాలనీలోని ఇంట్లో రూ.10 లక్షల విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. కుటుంబ యజమాని ఫిర్యాదుతో పోలీసులు సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ను సేకరించారు. ఆ ఇంట్లోని మహిళే తన ప్రియుడికి బంగారు ఆభరణాలు, నగదు ఇచ్చి పంపినట్టు దర్యాప్తులో తేల్చారు. సున్నితమైన అంశాలు కావటంతో తప్పుడు ఫిర్యాదులుగా గుర్తించినా మందలించి వదిలేస్తున్నట్టు సైబరాబాద్కు చెందిన ఒక ఇన్స్పెక్టర్ తెలిపారు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకే చేసినట్టు గుర్తిస్తే కేసులు నమోదు చేస్తున్నట్టు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓయో హోటల్లో అగ్నిప్రమాదం
[ 03-05-2024]
-
ఎండలిలా.. ప్రచారమెలా..!
[ 03-05-2024]
జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. గతేడాది తాండూరులో ఏప్రిల్ మొత్తంగా ఆరు రోజులు మాత్రమే 40 నుంచి 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
పగలు భగభగలు.. రాత్రిపూట సెగలు
[ 03-05-2024]
మే నెల రాకతో ఎండలు మరింత ముదిరాయి. పగటిపూట భానుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. -
ఫేస్బుక్లో పరిచయం చేసుకొని.. పిస్తోల్ తెప్పించుకొని!
[ 03-05-2024]
ఫేస్బుక్ పరిచయం అతన్ని పిస్తోల్ తీసుకొచ్చేలా చేసింది. అక్రమంగా ఆయుధాలను విక్రయించి రూ.లక్షలు సంపాదించాలనుకున్న అతడు బాలానగర్ ఎస్వోటీ, జీడిమెట్ల పోలీసులకు చిక్కాడు. -
ప్రతి గడప ఎక్కాలి.. గెలుపు మాటే వినిపించాలి
[ 03-05-2024]
ప్రధాన పార్టీల నేతలు, అధినేతల ఆదేశాలతో నియోజకవర్గ స్థాయి నాయకులు ఒత్తిడిలో ఉన్నారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
[ 03-05-2024]
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
కమల దళం.. అధినేతల కదనోత్సాహం
[ 03-05-2024]
నగరంలో భాజపాకు మంచి పట్టుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లు కైవసం చేసుకుని సత్తాచాటిన భాజపా.. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి.. పలుచోట్ల రెండో స్థానంలో నిలిచింది. -
నేటి నుంచి తపాలా ఓటింగ్
[ 03-05-2024]
ఈనెల 13న జరగనున్న పోలింగ్ నేపథ్యంలో సరిగ్గా 10 రోజుల ముందు తపాలా ఓటు, ఇంటివద్ద ఓటు ప్రక్రియలు మొదలు కాబోతున్నాయి. -
యువత ఓటెత్తాలి
[ 03-05-2024]
నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. -
స్వతంత్రులు నామమాత్రమేనా..?
[ 03-05-2024]
ప్రతి ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు కనీస ప్రభావం చూపలేక పోతున్నారు. అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నా కొందరికి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రావడం లేదు. -
అత్యధిక ఓటింగ్ నమోదైంది అప్పుడే!
[ 03-05-2024]
రాజధాని పరిధిలో ఇప్పటివరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది 1991లోనే. -
‘కాంగ్రెస్ వైపే బలహీన వర్గాలు’
[ 03-05-2024]
దళితుల అభ్యున్నతి, సాధికారతకు కృషి చేస్తున్న కాంగ్రెస్కు తమ మద్దతు ఉంటుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, మాల ప్రజా సంఘాల ఐకాస ఛైర్మన్ జి.చెన్నయ్య పేర్కొన్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న బడేభాయ్, చోటాభాయ్: కేటీఆర్
[ 03-05-2024]
అమలు కాని హామీలతో బడే భాయ్ మోదీ, చోటాభాయ్ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీ రామారావు విమర్శించారు. -
చేవెళ్ల.. అభిమానం నిలువెల్లా
[ 03-05-2024]
చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి లింగంపల్లి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఓటర్లు భిన్నం.. ఓటింగ్ విభిన్నం
[ 03-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు విలువైనది. కొన్ని సందర్భాల్లో ఒక్క ఓటు కూడా కీలకంగా మారుతుంది. -
ఉత్కంఠ పోరులో ఆధిక్యాలు స్వల్పమే
[ 03-05-2024]
రాజధాని పరిధిలో ఇప్పటి వరకు జరిగిన ఎంపీ ఎన్నికల్లో అత్యల్ప మెజార్టీ నమోదైంది హైదరాబాద్లోనే. -
పేద విద్యార్థులకు సహకారం ప్రశంసనీయం
[ 03-05-2024]
చారిత్రక నేపథ్యం కలిగిన రాజ్బహదూర్ వెంకట్రామ్రెడ్డి వసతి గృహ నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు అభినందనలు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి అన్నారు. -
అంధులు.. చదరంగంలో ఎత్తులు
[ 03-05-2024]
దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ ఆధ్వర్యంలో బేగంపేట లోని దేవనార్ పాఠశాలలో ఫిడే రేటింగ్ జాతీయ ఓపెన్ చదరంగం పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. -
‘బీసీ రిజర్వేషన్లు ఎత్తేసేందుకు భాజపా కుట్ర’
[ 03-05-2024]
బీసీ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కుట్రజేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. -
కాంగ్రెస్లో చేరిన గ్రేటర్ హైదర్బాద్ మాజీ అధ్యక్షుడు కట్టెల
[ 03-05-2024]
గ్రేటర్ హైదరాబాద్ భారాస మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్యాదవ్ గురువారం సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. -
ఇంటినుంచే ఓటు..ఇక్కట్లకు లేదు చోటు
[ 03-05-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలనేది ఎన్నికల సంఘం ఉద్దేశం. గతంలో పోలింగ్ కేంద్రానికి రాలేని స్థితిలో ఉన్న వారు ఓటు వేసేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చేది. -
కాంగ్రెస్తోనే ముదిరాజ్లకు గుర్తింపు: రంజిత్రెడ్డి
[ 03-05-2024]
కాంగ్రెస్ పార్టీతోనే ముదిరాజ్లకు సరైన గుర్తింపు లభిస్తుందని చేవెళ్ల లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి తెలిపారు. -
ఎంఎన్జేలో రొమ్ము పునర్ నిర్మాణ శస్త్రచికిత్సలు విజయవంతం
[ 03-05-2024]
మారిన జీవన విధానం, అహారపు అలవాట్ల కారణంగా చాలా మంది క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. -
హెచ్ఎండీఏలో మరో అవినీతి తిమింగలం!
[ 03-05-2024]
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)లో మరో కీలకాధికారి చుట్టూ అవినీతి నిరోధక శాఖ ఉచ్చు బిగుస్తోంది. -
వైద్య పరీక్షలకు గర్భవిచ్ఛిత్తి చేసుకున్న బాలిక
[ 03-05-2024]
పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీ కొని గుర్తు తెలియని 28 ఏళ్ల వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ రైల్వేస్టేషన్లో బుధవారం అర్ధరాత్రి తరువాత జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
-
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
-
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
-
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
-
జగనాసురుడి రాజ్యం.. ఐసీయూలో ఆరోగ్యశ్రీ