Crime News: దిల్సుఖ్నగర్ హత్య కేసులో కీలక మలుపు.. దత్తపుత్రుడు సాయితేజ దారుణ హత్య!
దిల్సుఖ్నగర్లో ఈనెల 7న జరిగిన మహిళ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. పెంపుడు తల్లి భూదేవి (58) హత్య ఘటనలో నిందితుడైన దత్తపుత్రుడు సాయితేజ
అమ్రాబాద్లో స్నేహితుడి చేతిలో హతం
పరారీలో మరో ముగ్గురు నిందితులు
సరూర్నగర్ క్రైం, అమ్రాబాద్, న్యూస్టుడే: దిల్సుఖ్నగర్లో ఈనెల 7న జరిగిన మహిళ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. పెంపుడు తల్లి భూదేవి (58) హత్య ఘటనలో నిందితుడైన దత్తపుత్రుడు సాయితేజ (27)ను అతడి స్నేహితుడు శివ దారుణంగా హత్య చేశాడు. అమ్రాబాద్ అడవుల్లో రెండురోజుల క్రితం చంపేయగా.. పోలీసులకు భయపడిన శివ గురువారం సరూర్నగర్ పోలీస్ఠాణాలో లొంగిపోయాడు. అనంతరం సరూర్నగర్ పోలీసులు అక్కడి అటవీశాఖ, పోలీసుల సహాయంతో మృతదేహాన్ని గుర్తించారు. ఐదురోజుల క్రితం భూదేవిని హత్యచేసిన అనంతరం సాయితేజ, శివలు శ్రీశైలానికి పారిపోయారు. అక్కడికి వెళ్లాక పోలీసులు గుర్తించకుండా సాయితేజ గుండు కొట్టించుకున్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు. సాయితేజ వెంట ఉన్న బ్యాగులో 35తులాల బంగారం, రూ.10లక్షల నగదు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అమ్రాబాద్ ఎస్సై సద్దాం హుసేన్ వివరాల ప్రకారం.. శివ, సాయితేజ ఈనెల 10న శ్రీశైలం వెళ్లారని, తిరుగు ప్రయాణంలో అమ్రాబాద్ మండలం మల్లెతీర్థం జలపాతంకు వెళ్లారని, దూరంగా ఉన్న ఓ మడుగు వద్దకు వెళ్లాక సాయితేజను శివ బండరాయితో తలపై కొట్టి చంపేశాడు. అనంతరం బ్యాగులో రాళ్లు నింపి నడుముకు కట్టి మడుగులో పారేశారని వివరించారు. మృతదేహాన్ని వెలికితీసి అచ్చంపేట ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.
అజ్ఞాతంలో ఇతర నిందితులు..
దిల్సుఖ్నగర్ న్యూ గడ్డిఅన్నారం కాలనీకి చెందిన జంగయ్య యాదవ్, భూదేవి(58) దంపతులకు నిందితుడైన సాయితేజ దత్తపుత్రుడు. అయితే అతని మానసిక ప్రవర్తన సరిగా లేకపోవడంతో స్నేహితులకు వీరి ఆస్తిపై కన్నుపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురు స్నేహితులు నర్సింహ, సాయిగౌడ్, చింటూ, శివలు సాయితేజను పావుగా వాడుకొని ఇంట్లో ఉన్న పెంపుడు తల్లిని చంపి ఆమె ఒంటిపై ఉన్న బంగారం, నగదు తీసుకువచ్చే విధంగా వారం రోజుల ముందు నుంచే పక్క ప్రణాళికను రూపొందించారు. అనుకున్నట్లుగానే భూదేవిని సాయితేజ, శివలు దిండుతో నోరు, ముక్కు మూయగా నర్సింహ చేతులు పెట్టుకొని చింటు, సాయిగౌడ్లు కాళ్లను గట్టిగా పట్టుకొని చనిపోయిందని నిర్ధారించుకొని బంగారం, నగదుతో పరారయ్యారు. సొమ్ముపై ఆశతో ఆ నలుగురు కలిసి సాయితేజను చంపేశారు. గురువారం రాత్రి శివను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతని నుంచి రూ.లక్ష, 22 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
[ 29-04-2024]
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
[ 29-04-2024]
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
బెట్టింగ్ భూతం.. దా‘రుణాలు’ అనంతం
[ 29-04-2024]
బెట్టింగ్ వ్యసనం ప్రాణాలు తీస్తోంది. అప్పులపాలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంకొందరు బరితెగించి చోరీలు, హత్యలు చేస్తున్నారు. -
కారు రూపురేఖలు మార్చి.. భయభ్రాంతులకు గురిచేస్తూ..
[ 29-04-2024]
రూపురేఖలు మార్చిన ఓ కారుతో రహదారులపై శబ్దాలు చేస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రాజాసింగ్.. రాస్తా అలగ్: ప్రచారానికి దూరంగా భాజపా ఎమ్మెల్యే
[ 29-04-2024]
ఆయన ఎవరి మాట వినరు.. ఆయన మాట పార్టీ వినదు. అందుకేనేమో ఆయన కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. -
అరచేతిలో ఏఐ..ప్రచారానికి సై
[ 29-04-2024]
మేము గెలిస్తే కూడళ్లను అభివృద్ధి చేస్తాం.. రహదారులను విస్తరిస్తాం.. గ్రామాలు, పట్టణాలను సుందరీకరిస్తాం.. ఎన్నికల ప్రచారంలో నేతలు ఇలా హామీలు ఇస్తుంటారు. -
ఎందుకీ నిర్లిప్తత.. ఓటేద్దాం పదపద
[ 29-04-2024]
ప్రతి ఎన్నికల్లో రాజధానిలో పోలింగ్ శాతం తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రకరకాల కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నా ఓటర్ల నిర్లిప్తత సైతం దీనికి తోడవుతోంది. -
ఎండలు సలసల.. మీటర్లు గిరగిరా
[ 29-04-2024]
నగరంలో విద్యుత్తు డిమాండ్ 4వేల మెగావాట్లను దాటింది. ఇందులో పావువంతు ఒక్క మేడ్చల్ జోన్ పరిధిలోనే ఉంటోంది. వెయ్యి మెగావాట్లకు ఈ జోన్ డిమాండ్ చేరువైంది. -
నీటి ట్యాంకర్లకు ట్రాకింగ్
[ 29-04-2024]
ఫుడ్ డెలివరీ యాప్స్లో ఏదైనా ఆర్డర్ చేసిన తర్వాత డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడు.. ఎన్ని నిమిషాల్లో మన ఇంటికి చేరుకుంటాడో ఇట్టే తెలుకోవచ్చు. -
అభ్యర్థుల తరపున అన్నీ తామై..
[ 29-04-2024]
చోటామోటా నాయకులు అని కొట్టి పారేయకండి.. ఎన్నికల వేళ వాళ్లే నేతలకు అండాదండా అవుతున్నారు. బూత్ స్థాయిలో ఎవరు ఎవరికి ఓటేస్తారో కచ్చితంగా చెప్పేయగలరు. -
ఓటు మన ప్రాథమిక హక్కు
[ 29-04-2024]
ఓటుని వినియోగించుకోవడం మన ప్రాథమిక హక్కని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి అన్నారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ ఉద్యానవనం వద్ద ఆదివారం ఉదయం -
ఓట్ల పండగకు దూరంగా ఉంటే ఎలా?
[ 29-04-2024]
చట్టసభలకు ప్రాతినిథ్యం వహించే ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న Ëపోలింగ్ ప్రక్రియలో మేధావులు, విద్యావేత్తలు, యువకులు, విద్యార్థులు సరిగా పాల్గోవడం లేదు. -
ఓటు సమ్మేళనాలు
[ 29-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నంచేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేస్తారు. అదే లోక్సభ ఎన్నికల్లో.. -
ఫలితాల్లో.. పత్తాలేని కొత్త పార్టీలు
[ 29-04-2024]
ప్రధాన పార్టీలు మినహాయిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేర్వేరు పార్టీల అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వడం లేదు. 1శాతం ఓట్లను పొందలేక చతికిలపడుతున్నారు. -
అంకురాల ప్రోత్సాహానికి స్టార్టప్ మిక్సర్
[ 29-04-2024]
అంకుర సంస్థలు ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నా మనసును తొలిచే మొదటి ప్రశ్న పెట్టుబడి ఎలా? ఆ తర్వాత మార్కెటింగ్, బ్రాండింగ్ పెంచుకోవడం, -
పుడమికి బలం.. జగతికి జీవాధారం
[ 29-04-2024]
తాగునీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపుదలకు ‘ఇంకుడు గుంతలకు’ మించిన చక్కటి మార్గం మరొకటి లేదు. -
రసవత్తరం..చేవెళ్ల పోరు
[ 29-04-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికలు ప్రతిసారీ రసవత్తరంగా సాగుతాయి. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంటుంది. -
ఓటు.. ఐదు రూపాలు
[ 29-04-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి ఓటును నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి వేస్తారు. అయితే ఓటును ఐదు విధాలుగా వినియోగించుకునే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పించింది. -
పోలీసుల అదుపులో ద్విచక్ర వాహనాల దొంగ
[ 29-04-2024]
తాండూరు పట్టణంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం.. కాపాడిన కానిస్టేబుల్
[ 29-04-2024]
వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. హుస్సేన్సాగర్లో దూకేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్, మరికొందరు -
వేసవిలో నగరానికి అదనపు జలాలు
[ 29-04-2024]
గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సరఫరాకు డిమాండ్ పెరిగిందని.. -
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట మోసం
[ 29-04-2024]
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట నలుగురి నుంచి రూ.65,36,590 మేర కొల్లగొట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఎస్సార్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్