నగరంలో నడవగలరా?
మీరు రహదారి విస్తరించండి... మేం ఆక్రమిస్తాం అంటూ వ్యాపారులు.. వాణిజ్య సముదాయాలవారు, దుకాణదారులు, తోపుడుబండ్లు, పండ్ల వ్యాపారులు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో మార్గాలను కబళించేస్తున్నారు. ప్రజలు, ప్రయాణికులు, పాదచారులకు ఉపయోగపడుతున్న ప్రధాన రహదారులు, అనుసంధాన రహదారులను
ఆక్రమణలకు గురవుతున్న కాలిబాటలు
రహదారులు విస్తరిస్తున్నా ప్రయోజనం శూన్యం
సనత్నగర్ బస్టాప్, కాలిబాట పూర్తిగా కబ్జా చేసిన వ్యాపారులు
రహదారులపై ప్రమాదాల్లో గాయపడుతున్న, మృతుల్లో రెండో స్థానం పాదచారులదేనని పోలీసుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, రెజిమెంటల్బజార్, పంజాగుట్ట, అమీర్పేట, కాచిగూడ: మీరు రహదారి విస్తరించండి... మేం ఆక్రమిస్తాం అంటూ వ్యాపారులు.. వాణిజ్య సముదాయాలవారు, దుకాణదారులు, తోపుడుబండ్లు, పండ్ల వ్యాపారులు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో మార్గాలను కబళించేస్తున్నారు. ప్రజలు, ప్రయాణికులు, పాదచారులకు ఉపయోగపడుతున్న ప్రధాన రహదారులు, అనుసంధాన రహదారులను వీరు తమ హక్కుగా భావించి వ్యాపారాలు, వ్యాపార విస్తరణకు వాడేస్తున్నారు. మెట్రో నగరాల్లో జాతీయ, అంతర్జాతీయ నిబంధనలు, ప్రజారవాణా మార్గదర్శకాల ప్రకారం రహదారులపై పాదచారులు నడిచేందుకు కాలిబాటలు తప్పనిసరి. పలుమార్లు కోర్టుల హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అధికారులు కొన్నిచోట్ల ఫుట్పాత్లు నిర్మిస్తున్నారు. వాహనాలు పెరిగిపోవడంతో రహదారులూ విస్తరిస్తున్నారు. ఇంత చేస్తున్నా నిత్యం రద్దీగా ఉండే ఆబిడ్స్, కోఠి, సికింద్రాబాద్లలో పాదచారులు నడిచేందుకు ఒక్కచోటా కాలిబాట లేదు. వాణిజ్య ప్రాంతాల్లో దుకాణ నిర్వాహకులు వాటిని ఆక్రమించుకుని వాహనాలు ఉంచడం లేదా వినియోగదారుల వాహనాలను అక్కడ ఉంచే సదుపాయం కల్పిస్తున్నారు.
రూ.కోట్లు వెచ్చించినా ఏడాది రెండేళ్లకు మళ్లీ మామూలే
రహదారుల విస్తరణ కోసం జీహెచ్ఎంసీ పాత, కొత్త భవనాలు కూలగొట్టేందుకు రూ.కోట్లు వ్యయం చేస్తోంది. పనులు పూర్తయిన ఒకటి, రెండేళ్లలోనే ట్రాఫిక్ కష్టాలు మళ్లీ మొదటికి వస్తున్నాయి. ప్రధాన ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్, ఖైరతాబాద్, ఆబిడ్స్, కోఠి, మలక్పేట, మెహిదీపట్నం, సనత్నగర్, బాలానగర్, చింతల్, ఎల్బీనగర్, చైతన్యపురి రహదారులను వ్యాపారులు ఆక్రమించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారులు విస్తరిస్తుంటే... సరిగ్గా విస్తరించిన ప్రాంతం వరకు షోకేసులు, గొడుగులు, చెప్పుల స్టాండ్లు, హోటళ్ల ముందు పాన్షాప్లు ఉంచుతున్నారు. లక్డీకాపూల్లో పోస్టాఫీస్ నుంచి టెలిఫోన్ భవన్ వరకు రహదారి విస్తరించారు. పాదచారులు నడిచేందుకు ఫుట్పాత్ నిర్మించారు. ఫుట్పాత్ మొత్తాన్నీ అక్కడి వ్యాపారులు ఆక్రమించారు.
పంజాగుట్ట కూడలిలోని మెరీడియన్ రెస్టారెండ్ వద్ద అక్రమ పార్కింగ్
లోకాయుక్త ఆదేశాలు.. కాగితాల్లో కమిటీలు
రహదారులపై ఆక్రమణల తొలగింపు, ఫుట్పాత్ నిర్వహణపై వార్డుకో కమిటీ వేయాలని లోకాయుక్త ఐదేళ్ల కిందట జీహెచ్ఎంసీ కమిషనర్కు తెలిపింది. కార్పొరేటర్ అధ్యక్షుడిగా కమిటీ ఏర్పాటుచేసి సభ్యులుగా జీహెచ్ఎంసీ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, సిటీ ప్లానర్, ట్రాఫిక్ విభాగం ఏసీపీ లేదా ఇన్స్పెక్టర్ను నియమించాలని సూచించింది. ఈ కమిటీ నెలకోసారి సమావేశమై డివిజన్ పరిధిలో ఫుట్పాత్ల నిర్వహణ, అక్రమణలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపట్టాలని, మేయర్, జీహెచ్ఎంసీకి నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటివరకు కమిటీలు ఏర్పడలేదు. లోకాయుక్త ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయి.
ఎక్కడెలా ఉందంటే..
అమీర్పేట వద్ద పూర్తిగా రోడ్డు ఆక్రమించి విక్రయాలు
* సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్ద నుంచి పాలికబజార్, మోండా మార్కెట్ సుభాష్ రోడ్డులో బాటా వరకు, రోడ్డు ఇరువైపులా ఫుట్పాత్లపై దుకాణదారులు, రోడ్డుమీద చిరువ్యాపారులు కొనసాగుతుండటంతో అటు వచ్చే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
* ఈఎస్ఐ నుంచి ఎర్రగడ్డ రైతుబజార్ వరకు సుమారు 300 వరకు తోపుడు బండ్లు, పండ్ల వ్యాపారులు కాలిబాటను ఆక్రమించుకుని వ్యాపారం సాగిస్తున్నారు.
* పంజాగుట్ట కూడలిలో అక్రమ వాహన పార్కింగ్లతో అవస్థలు తీవ్రమయ్యాయి. పంజాగుట్ట కూడలిలోని మెరీడియన్ రెస్టారెంట్ వద్ద రోడ్డుపై రోజంతా కార్లు, పెద్ద వాహనాల పార్కింగ్తో ట్రాఫిక్ సమస్యలేర్పడుతున్నాయి.
* అమీర్పేట నుంచి ఖైరతాబాద్ రోడ్డులో పంజాగుట్ట కూడలి వద్ద రోడ్డుపైనే వాహనాలు నిలుపుతున్నారు. ఇక్కడే ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఉంది. కూడలిలో ఎప్పుడూ ట్రాఫిక్ సిబ్బంది ఉంటారు. రోడ్డుపై అక్రమ పార్కింగ్ను మాత్రం పట్టించుకోవడం లేదు.
* కాచిగూడ స్టేషన్ రోడ్డులో పాదబాటలు ఆక్రమణకు గురయ్యాయి. వాణిజ్య సముదాయం పార్కింగ్ సెల్లార్లలో వ్యాపార కార్యకలాపాలతో వాహనాలను పాదబాటపై నిలుపుతున్నారు. టూరిస్ట్ హోటల్ చౌరస్తాలో దుకాణదారులు పాదబాటలను చిరు వ్యాపారులకు అద్దెకిచ్చుకున్నారు. కాచిగూడ చౌరస్తాలో ఫ్రీలెఫ్ట్ వైపు ఉన్న నోపార్కింగ్ బోర్డు వద్ద రోజంతా వాహనాలు ఉంచుతున్నా పట్టించుకోరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..