ఉపాధి పూర్తి చేస్తేనే.. అనుమతి
గ్రామాల్లో వలసలను నివారించి సొంతూరులోనే పనులు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం’ అమలు చేస్తోంది. కూలీలకు ఉపాధితో పాటు అన్నదాతలకు చేయూత అందించేందుకు వివిధ కార్యక్రమాలు
ఆగిన పనులు కొలిక్కితెచ్చేందుకు కొత్త మార్గదర్శకాలు
న్యూస్టుడే, బొంరాస్పేట, కొడంగల్ గ్రామీణం
క్షేత్ర స్థాయిలో కూలీలు
గ్రామాల్లో వలసలను నివారించి సొంతూరులోనే పనులు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం’ అమలు చేస్తోంది. కూలీలకు ఉపాధితో పాటు అన్నదాతలకు చేయూత అందించేందుకు వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవటం, ప్రారంభించిన పనులు మధ్యలోనే ఆగిపోవటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా నిధులు నిరుపయోగంగా మారుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు అధికారులు తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు. నిధులు మంజూరైన తర్వాత చేపట్టిన పనులు పూర్తి చేయకుంటే కొత్తవి మంజూరు చేయరని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం
ఇదీ పరిస్థితి: జిల్లాలో 19 మండలాల్లో 2,00,593 జాబ్కార్డులు ఉండగా 2.70 లక్షల మంది కూలీలు ఉపాధి పథకంలో పనులు చేస్తున్నారు. చెరువుల పూడిక తీత, పంట పొలాలను చదును చేయటం, విద్యాలయాల్లో వంటగదులు, శౌచాలయాలు, ఇంకుడు గుంతలు ఇలా 260 రకాల పనులు చేసుకునేందుకు అవకాశాలు కల్పించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని కూలీలకు ఉపాధి కల్పించేందుకు 5,894 పనులు మంజూరు చేశారు. అందులో 4,401 పనులు వ్యవసాయ అనుబంధం, 1,720 నీటి వనరుల అభివృద్ధికి కేటాయించారు. కొన్ని గ్రామాల్లో చేపట్టిన పనులు పూర్తి చేయకుండానే కొత్తగా మరొకటి ప్రారంభిస్తున్నారు. దీంతో అసంపూర్తివి అందుబాటులోకి రాకుండా పోతున్నాయి. ఇక నుంచి ఈ సమస్య ఉండదు. గ్రామానికి మంజూరు చేసిన పనులు పూర్తి చేసిన తర్వాతనే కొత్తవి ఇవ్వాలని నిబంధనలు అమలు చేయనున్నారు.
గ్రామ పంచాయతీకి 20 చొప్పున...
ఇక నుంచి గ్రామ పంచాయతీకి 20 చొప్పున ఉపాధి పనులు చేపట్టేందుకు అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నెల నుంచి అమలు చేసేలా నిర్దేశించారు. పూర్తయిన వాటికి సంబంధించిన వివరాలను పూర్తిగా నమోదు చేసిన తర్వాతే మరోదాన్ని నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. నూతనంగా విడుదల చేసిన ఆదేశాలు అభివృద్ధికి దోహదం చేసేలా ఉన్నాయని పనులు పక్కాగా సాగేందుకు అవకాశాలున్నట్లు పథకం అమలు అధికారులు భావిస్తున్నారు. ఉపాధి పనుల్లో పారదర్శకత కోసం ఇప్పటికే ‘నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం (ఎన్ఎంఎంఎస్) విధానాన్ని తీసుకొచ్చారు. కూలీల వివరాలు క్షేత్రస్థాయిలో చరవాణిలో ఫొటో తీసి వారి పేరు, హాజరు నమోదు చేయాలి. ఒకరి పేరుతో మరొకరు పనులు చేసుకునేందుకు అవకాశాలు లేకుండా లెక్క పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఎంతో ప్రయోజనం కలుగుతుంది
- కృష్ణన్, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి, వికారాబాద్
అసంపూర్తి పనులతో ఉపయోగం ఉండదని ప్రభుత్వం గుర్తించింది. పంచాయతీ కార్యదర్శులకు తోడుగా క్షేత్రసహాయకులు విధుల్లో చేరటంతో పనుల్లో వేగం పెరుగుతుంది. ప్లాంటేషన్ పనులు నిరంతరం కొనసాగే ప్రక్రియ కావటంతో ఇందుకు మినహాయింపు ఇచ్చారు. గుర్తించే సమయంలోనే ప్రాముఖ్యతను గమనించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంధ్రాలో ఓటుంది.. తపాలా ఓటును పంపండి
[ 05-05-2024]
నగరంలో ఎన్నికల విధులకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగంపై అయోమయంలో పడ్డారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్కు వరుస కట్టిన వినతులే అందుకు నిదర్శనం. -
టక్కరి దొంగ.. పోలీసులతోనే ఉపాధి పొంది మస్కా కొట్టి చోరీలు
[ 05-05-2024]
అతను దొంగ.. సుమారు వందకుపైగా కేసుల్లో శిక్ష అనుభవించాడు.. మార్పు వచ్చినట్టు నటించాడు.. పోలీసులతోనే స్వయం ఉపాధి పొందాడు.. నిజంగా మార్పు రాలేదు. -
సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
[ 05-05-2024]
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. -
పజ్జన్న అంటే ప్రజల మనిషని తెలుసు
[ 05-05-2024]
జనంలో ఉండే నేతకే సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు పట్టం కడతారని, అభ్యర్థిత్వం ప్రకటించినప్పుడే తన గెలుపు ఖరారైందని భారాస అభ్యర్థి పద్మారావుగౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
అన్నీ ఒకేచోట.. ఇబ్బంది లేదిక
[ 05-05-2024]
ఇంధనాలన్నీ ఒకే చోట ఉండేలా కొత్త బంకులు అందుబాటులోకి వస్తున్నాయి. నగరంలో విద్యుత్తు వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతుండటంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్లను నెలకొల్పారు. -
ఒకటిన్నర ఎకరా మించితే.. టీడీఆర్ కష్టం
[ 05-05-2024]
అభివృద్ధి పనుల కోసం భూసేకరణ చేపట్టి టీడీఆర్ (అభివృద్ధి బదలాయింపు హక్కు) ఇచ్చే ప్రక్రియపై గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. -
అదనంగా 60శాతం ఈవీఎంలు
[ 05-05-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల సంఖ్య పెరగడంతో..ఎన్నికల అధికారులు 60శాతం ఈవీఎంలను అదనంగా తెప్పించారు. -
రాళ్లే బద్దలవుతుంటే.. రికార్డులెంత
[ 05-05-2024]
నగరంలో రోజురోజుకు భానుడు మరింత భగ్గుమంటున్నాడు. జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం రికార్డు స్థాయిలో 44.5 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. -
ఆనాటి బరిలో ఇద్దరే
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు జరుగుతున్నపుడు పలు పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 40మంది కంటే ఎక్కువగా బరిలో ఉంటున్నారు. కానీ 1957 ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి కేవలం ఇద్దరు అభ్యర్థులే బరిలో నిలిచారు. -
మండుటెండల్లో.. ఠండా పానీ
[ 05-05-2024]
చలివేంద్రం అంటే.. రెండు మట్టి కుండలు.. వాటిపైన ప్లాస్టిక్ గ్లాసు గుర్తుకొస్తుంది. తొలిసారి జలమండలి వినూత్న పద్ధతిలో చలివేంద్రాలను తీసుకొచ్చింది. -
ముమ్మరంగా నేతల ప్రచారాలు
[ 05-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికస్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో కూడా అధికారం చేపడుతుందని టీపీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీగౌడ్, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. -
ప్రజాశ్రేయస్సే అధికారులకు పరమావధి కావాలి
[ 05-05-2024]
సివిల్ సర్వీసెస్ అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు తలొగ్గకుండా ప్రజాశ్రేయస్సు, దేశ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. -
దేశవ్యాప్తంగా మోదీ నామస్మరణే
[ 05-05-2024]
దేశంలోని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి, సంక్షేమమే లక్ష్యంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి విజయవంతంగా అమలుచేస్తోందని కేంద్ర మంత్రి, భాజపా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్రెడ్డి పేర్కొన్నారు. -
‘అల్లాహ్ మీద ఒట్టు.. జీవితంలో ఎవరిపై జులుం చేయలేదు’
[ 05-05-2024]
మతాల మధ్య చిచ్చుపెడుతున్న మోదీ సర్కారును ఓడించేందుకు అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని మజ్లిస్ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. -
గెలుపు, ఓటమికి మధ్య నోటా దోబూచులాట!
[ 05-05-2024]
ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ఓటర్లు తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు ఎన్నికల కమిషన్ కల్పించిన అవకాశం నోటా (నన్ ఆఫ్ ది ఎబౌవ్). -
పోటీ త్రిముఖం.. ప్రచారం బహుముఖం
[ 05-05-2024]
చేవెళ్ల పార్లమెంటు స్థానానికి ఈసారి పేరుకే 43 మంది బరిలో ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్, భాజపా, భారాసల మధ్యే ‘త్రిముఖ’ పోటీ నెలకొంది. -
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్
[ 05-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అంకితభావంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. -
కలిసికట్టుగా ‘కొండా’ను గెలిపిద్దాం: భాజపా
[ 05-05-2024]
ప్రతి ఒక్కరు ఐక్యతగా పనిచేసి ఎంపీ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్రెడ్డి విజయానికి కృషిచేద్దామని ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు, భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్ పటేల్ అన్నారు. -
పాలమూరుకు జాతీయ హోదా ఎందుకివ్వలేదు?
[ 05-05-2024]
పాలమూరుకు నరేంద్ర మోదీ చుట్టంలా వస్తారు.. పోతారు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రాణం తీసిన.. ఫొటో సరదా..
[ 05-05-2024]
క్వారీ గుంతలో సరదాగా ఈత కొడుతూ ఫొటో దిగాలనే ప్రయత్నంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పో యాడు. ఈ ఘటన కీసర మండలం అంకిరెడ్డిపల్లి మహాలక్ష్మీ క్రషర్ క్వారీ గుంత వద్ద జరిగింది. -
ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు
[ 05-05-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులే కాదు.. అప్పుడప్పుడు పేర్లు కంగారు పెడుతుంటాయి. ఒకే పేరుతో ఇద్దరు పోటీ చేసేటప్పుడు మరింత ఎక్కువ ఆందోళన ఉంటుంది. -
శంషాబాద్లో చిక్కిన చిరుత అమ్రాబాద్కు తరలింపు
[ 05-05-2024]
శంషాబాద్ విమానాశ్రయంలో ట్రాప్ బోనులో చిక్కిన మగ చిరుతను శనివారం హైదరాబాద్ నెహ్రూ జూపార్కు అధికారులు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులోకి వదలి పెట్టారు. -
క్రిశాంక్ కస్టడీకి కోర్టు అనుమతి
[ 05-05-2024]
భారాస సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్ మన్నె క్రిశాంక్ను ఒకరోజు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ శనివారం నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు