logo

Naresh: యూట్యూబ్‌ ఛానళ్లపై నటుడు నరేశ్‌ పరువునష్టం దావా

నటులు నరేశ్‌, పవిత్రపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోలింగ్‌ వ్యవహారం కోర్టుకు చేరింది.

Updated : 13 Dec 2022 10:00 IST

ఈనాడు, హైదరాబాద్‌: నటులు నరేశ్‌, పవిత్రపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోలింగ్‌ వ్యవహారం కోర్టుకు చేరింది. ఈ విషయంపై నరేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తమ వ్యక్తిగత జీవితంపై దుష్ప్రచారం చేస్తూ పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ పలు యూట్యూబ్‌ ఛానళ్లు, వ్యక్తులపై నరేశ్‌ క్రిమినల్‌ పరువునష్టం దావా వేశారు. సోమవారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. యూట్యూబ్‌ ఛానళ్లకు నోటీసులు ఇచ్చి 12 మందిపై విచారణ చేపట్టాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని