logo

స్నేహితుడి భార్యపై అత్యాచారయత్నం

స్నేహితుడి భార్యపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తిని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఘటన నాలుగు రోజుల క్రితం జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది.

Updated : 05 Feb 2023 04:51 IST

నిందితుడిని చూపుతున్న శామీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌కుమార్‌, ఎస్సైలు

భర్తకు చెప్పినా పట్టించుకోక బాధితురాలి ఆత్మహత్యాయత్నం

శామీర్‌పేట, న్యూస్‌టుడే: స్నేహితుడి భార్యపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తిని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఘటన నాలుగు రోజుల క్రితం జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శామీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ వి.సుధీర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లాకు చెందిన చక్రధర్‌గౌడ్‌(36), బాధిత మహిళ భర్త స్నేహితులు. కొన్నేళ్ల క్రితం మహిళ కుటుంబం మేడ్చల్‌ జిల్లా తూంకుంటకు బతుకుదెరువుకొచ్చింది. చక్రధర్‌గౌడ్‌, బాధితురాలి భర్త గత నెల 31న జీడిమెట్లలో విందు చేసుకున్నారు. అనంతరం బాధితురాలి భర్త తన వాహనం తెచ్చుకొనేందుకు అల్వాల్‌ వెళ్లగా.. చక్రధర్‌గౌడ్‌ అతని ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. మహిళ తన భర్తే వచ్చాడని తెరిచింది. నిందితుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా.. ఆమె కేకలు వేయగా పారిపోయాడు. భర్త వచ్చిన తరువాత జరిగిన విషయం వివరించినా.. మద్యం మత్తులో పట్టించుకోలేదు. బాధితురాలు దిగాలుగా ఉంటూ రెండు రోజుల కిందట నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి చేరుకుంది. దాంతో కుటుంబ సభ్యులు అల్వాల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాధితురాలు తల్లితో కలిసి శనివారం శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని