Education In USA: బీఏ.. నర్సింగ్.. బిజినెస్.. అంతా అమెరికాకే
అమెరికా చదువుకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేది ఇంజినీరింగ్ విద్యార్థులే అన్న అభిప్రాయం మారుతోంది.
యూఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్కు పోటెత్తిన విద్యార్థులు
ఔత్సాహికులతో కిటకిటలాడిన ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రాంగణం
ఈనాడు, హైదరాబాద్: అమెరికా చదువుకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేది ఇంజినీరింగ్ విద్యార్థులే అన్న అభిప్రాయం మారుతోంది. అత్యధిక శాతం మంది ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధ లాంటి కోర్సుల్లో చేరేందుకే వెళ్తున్నా.. ఇతర కోర్సులు చదువుతూ ఆ దేశానికి ఉన్నత విద్యకు వెళ్లాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్న వారూ పెరుగుతున్నారు. హైదరాబాద్లో శనివారం నిర్వహించిన యూఎస్ఏ ఎడ్యుకేషన్ ఫెయిర్కు వచ్చిన పలువురు విద్యార్థులను పలకరించగా... అనేక మంది ఇంజినీరింగేతర విద్యార్థులు ఉండటం విశేషం. బీఏ, బీఎస్సీ, నర్సింగ్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ తదితర కోర్సులు చదువుతున్న వారూ బీఎస్, ఎంఎస్ కోర్సుల కోసం ఆయా వర్సిటీల ప్రతినిధులతో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. కొందరు వచ్చే జనవరి, ఫిబ్రవరిలో ప్రవేశాలు పొందేందుకు సిద్ధమవుతుండగా మరికొందరు చదువు పూర్తయిన తర్వాత వెళ్లే ఉద్దేశంతో సమాచారం సేకరించడానికి హాజరయ్యారు. ముందుగా రిజిస్టర్ చేసుకున్న 3 వేల మందే కాకుండా ఇతరులు కూడా వందలాది మంది తరలిరావడంతో నోవాటెల్ ప్రాంగణం కిటకిటలాడింది. నాలుగైదు సంవత్సరాల క్రితం బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం కొలువులకు రాజీనామా చేసి అమెరికాలో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ ఎన్నేళ్లు ఉన్నా ఆశించినంత ఆదాయం ఉండదని, దానికితోడు ఒత్తిడి అధికమని భావిస్తున్న వారు అటువైపు చూస్తున్నారు.
డేటా సైన్స్ చదువుదామని.. : మనోజ్, సాఫ్ట్వేర్ ఇంజినీరు
హైదరాబాద్లో 2018లో బీటెక్ సీఎస్ఈ పూర్తయ్యింది. అప్పటి నుంచి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. నా వార్షిక వేతనం రూ.12.50 లక్షలు. అమెరికాలో ఎంఎస్ డేటా సైన్స్ చేయాలని అనుకుంటున్నా. వచ్చే జనవరి, ఫిబ్రవరిలో వెళ్లాలన్న ప్రణాళికలో భాగంగా ఈ ప్రదర్శనకు వచ్చా.
నర్సింగ్ కోర్సంటే వారూ ఆశ్చర్యపోయారు : సుధీర, హైదరాబాద్
మా పెద్ద కుమార్తె అమెరికాలో ఎంఎస్ చదివి ఉద్యోగం చేస్తోంది. చిన్న కుమార్తె సహన బీఎస్సీ నర్సింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. అమెరికాలో ఎంఎస్ నర్సింగ్ చదివేందుకు అవసరమైన సాధికారిక సమాచారం కోసం వచ్చాం. ఒక్కో స్టాల్లో అడుగుతూ పోతే కొన్ని చోట్ల కోర్సు ఉందని వర్సిటీల ప్రతినిధులు చెప్పారు. మీరొక్కరే నర్సింగ్ గురించి అడిగిందని వారూ ఆశ్చర్యపోయారు.
నడవలేకున్నా.. చక్రాల కుర్చీలో వచ్చి
ఓక్రిడ్జ్ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి పేరు సిద్ధీ. ఇటీవల ప్రమాదవశాత్తూ కాలికి గాయమైంది. అమెరికాలో బిజినెస్ విభాగంలో అండర్ గ్రాడ్యుయేట్ చేయాలని నిర్ణయానికి వచ్చాడు. ఆ వివరాల కోసం చక్రాల కుర్చీలో తన తల్లిదండ్రులతో కలిసి ఎడ్యుకేషన్ ఫెయిర్కు వచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్నటి వరకు సీబీఐ, ఈడీ.. ఇప్పుడు దిల్లీ పోలీసులు: రేవంత్రెడ్డి
[ 29-04-2024]
అమిత్షా వీడియో మార్ఫింగ్ వ్యవహారంలో తనతోపాటు పలువురికి దిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
[ 29-04-2024]
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
[ 29-04-2024]
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
బెట్టింగ్ భూతం.. దా‘రుణాలు’ అనంతం
[ 29-04-2024]
బెట్టింగ్ వ్యసనం ప్రాణాలు తీస్తోంది. అప్పులపాలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంకొందరు బరితెగించి చోరీలు, హత్యలు చేస్తున్నారు. -
కారు రూపురేఖలు మార్చి.. భయభ్రాంతులకు గురిచేస్తూ..
[ 29-04-2024]
రూపురేఖలు మార్చిన ఓ కారుతో రహదారులపై శబ్దాలు చేస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రాజాసింగ్.. రాస్తా అలగ్: ప్రచారానికి దూరంగా భాజపా ఎమ్మెల్యే
[ 29-04-2024]
ఆయన ఎవరి మాట వినరు.. ఆయన మాట పార్టీ వినదు. అందుకేనేమో ఆయన కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. -
అరచేతిలో ఏఐ..ప్రచారానికి సై
[ 29-04-2024]
మేము గెలిస్తే కూడళ్లను అభివృద్ధి చేస్తాం.. రహదారులను విస్తరిస్తాం.. గ్రామాలు, పట్టణాలను సుందరీకరిస్తాం.. ఎన్నికల ప్రచారంలో నేతలు ఇలా హామీలు ఇస్తుంటారు. -
ఎందుకీ నిర్లిప్తత.. ఓటేద్దాం పదపద
[ 29-04-2024]
ప్రతి ఎన్నికల్లో రాజధానిలో పోలింగ్ శాతం తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రకరకాల కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నా ఓటర్ల నిర్లిప్తత సైతం దీనికి తోడవుతోంది. -
ఎండలు సలసల.. మీటర్లు గిరగిరా
[ 29-04-2024]
నగరంలో విద్యుత్తు డిమాండ్ 4వేల మెగావాట్లను దాటింది. ఇందులో పావువంతు ఒక్క మేడ్చల్ జోన్ పరిధిలోనే ఉంటోంది. వెయ్యి మెగావాట్లకు ఈ జోన్ డిమాండ్ చేరువైంది. -
నీటి ట్యాంకర్లకు ట్రాకింగ్
[ 29-04-2024]
ఫుడ్ డెలివరీ యాప్స్లో ఏదైనా ఆర్డర్ చేసిన తర్వాత డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడు.. ఎన్ని నిమిషాల్లో మన ఇంటికి చేరుకుంటాడో ఇట్టే తెలుకోవచ్చు. -
అభ్యర్థుల తరపున అన్నీ తామై..
[ 29-04-2024]
చోటామోటా నాయకులు అని కొట్టి పారేయకండి.. ఎన్నికల వేళ వాళ్లే నేతలకు అండాదండా అవుతున్నారు. బూత్ స్థాయిలో ఎవరు ఎవరికి ఓటేస్తారో కచ్చితంగా చెప్పేయగలరు. -
ఓటు మన ప్రాథమిక హక్కు
[ 29-04-2024]
ఓటుని వినియోగించుకోవడం మన ప్రాథమిక హక్కని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి అన్నారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ ఉద్యానవనం వద్ద ఆదివారం ఉదయం -
ఓట్ల పండగకు దూరంగా ఉంటే ఎలా?
[ 29-04-2024]
చట్టసభలకు ప్రాతినిథ్యం వహించే ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న Ëపోలింగ్ ప్రక్రియలో మేధావులు, విద్యావేత్తలు, యువకులు, విద్యార్థులు సరిగా పాల్గోవడం లేదు. -
ఓటు సమ్మేళనాలు
[ 29-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నంచేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేస్తారు. అదే లోక్సభ ఎన్నికల్లో.. -
ఫలితాల్లో.. పత్తాలేని కొత్త పార్టీలు
[ 29-04-2024]
ప్రధాన పార్టీలు మినహాయిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేర్వేరు పార్టీల అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వడం లేదు. 1శాతం ఓట్లను పొందలేక చతికిలపడుతున్నారు. -
అంకురాల ప్రోత్సాహానికి స్టార్టప్ మిక్సర్
[ 29-04-2024]
అంకుర సంస్థలు ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నా మనసును తొలిచే మొదటి ప్రశ్న పెట్టుబడి ఎలా? ఆ తర్వాత మార్కెటింగ్, బ్రాండింగ్ పెంచుకోవడం, -
పుడమికి బలం.. జగతికి జీవాధారం
[ 29-04-2024]
తాగునీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపుదలకు ‘ఇంకుడు గుంతలకు’ మించిన చక్కటి మార్గం మరొకటి లేదు. -
రసవత్తరం..చేవెళ్ల పోరు
[ 29-04-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికలు ప్రతిసారీ రసవత్తరంగా సాగుతాయి. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంటుంది. -
ఓటు.. ఐదు రూపాలు
[ 29-04-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి ఓటును నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి వేస్తారు. అయితే ఓటును ఐదు విధాలుగా వినియోగించుకునే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పించింది. -
పోలీసుల అదుపులో ద్విచక్ర వాహనాల దొంగ
[ 29-04-2024]
తాండూరు పట్టణంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం.. కాపాడిన కానిస్టేబుల్
[ 29-04-2024]
వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. హుస్సేన్సాగర్లో దూకేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్, మరికొందరు -
వేసవిలో నగరానికి అదనపు జలాలు
[ 29-04-2024]
గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సరఫరాకు డిమాండ్ పెరిగిందని.. -
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట మోసం
[ 29-04-2024]
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట నలుగురి నుంచి రూ.65,36,590 మేర కొల్లగొట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఎస్సార్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం