మ్యాట్రిమోనీ వేదిక.. పెళ్లి మాటున వంచన
జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి.. నిత్య పెళ్లి కొడుకులా మారాడు. మ్యాట్రిమోనీ వేదికల ద్వారా యువతుల్ని మోసం చేస్తున్నాడు. ఓ యువతికి దగ్గరై రూ.70 లక్షలు కొట్టేశాడు.
రాజేశ్
ఈనాడు, హైదరాబాద్: జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి.. నిత్య పెళ్లి కొడుకులా మారాడు. మ్యాట్రిమోనీ వేదికల ద్వారా యువతుల్ని మోసం చేస్తున్నాడు. ఓ యువతికి దగ్గరై రూ.70 లక్షలు కొట్టేశాడు. అప్పులు చేయడంతోపాటు బ్యాంకు రుణం, బంగారం తాకట్టుపెట్టి మరీ ఈ సొమ్ము అప్పగించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి, సైబర్క్రైమ్ ఏసీపీ రవీంద్రరెడ్డి, ఇన్స్పెక్టర్ రవికుమార్ శనివారం ఓ ప్రకటనలో కేసు వివరాలు వెల్లడించారు.
అప్పులు చేయించి సొమ్ము స్వాహా
ఏపీ లోని కృష్ణా జిల్లాకు చెందిన ద్రోణాదుల రాజేశ్(40) ఆన్లైన్ ట్రేడింగ్ చేసేవాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురై.. తేలిగ్గా డబ్బు కొట్టేయడానికి మ్యాట్రిమోనీ వేదికల ద్వారా యువతుల్ని మోసగించాలని నిర్ణయించుకుని.. తెలుగు మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో పెళ్లి సంబంధాల కోసం సంప్రదించేవాడు. ఎవరైనా సంప్రదిస్తే మాట కలిపి కొన్నాళ్లు స్నేహం చేశాక మోసం మొదలుపెడతాడు. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని.. ఈ కష్టాలు తొలగిపోతే పెళ్లికి చేసుకుంటానని వంచిస్తాడు. నమ్మిన యువతులు బాధితుడికి డబ్బు చెల్లించి మోసపోతారు. నగరానికి చెందిన ఓ యువతిని మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా సంప్రదించాడు. నిందితుడు తాను ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నానని.. పెళ్లికి ముందు సాయం కావాలని కోరాడు. అతని మాటలు నమ్మిన యువతి గతేడాది ఏప్రిల్లో రూ.2 లక్షలు ఇచ్చింది. తర్వాత ఆమెను నేరుగా కలిసి డబ్బు సాయం చేస్తే అంతా చక్కదిద్దుకుని పెళ్లి చేసుకుంటానని.. అప్పు తర్వాత చెల్లిస్తానని కట్టుకథలు చెప్పాడు. నిజమేనని భావించి అప్పు చేసి కొంత మొత్తం ఇచ్చింది. అవి చాలవని చెప్పడంతో ఆమె పేరుతో బ్యాంకు నుంచి ఇంటి రుణం, బంగారు నగల్ని తాకట్టుపెట్టి, ప్రైవేటు రుణ సంస్థల నుంచి వ్యక్తిగత రుణం తీసుకుని మొత్తం రూ.70 లక్షలు ఇచ్చింది. ఈ సొమ్మంతా వసూలు చేసిన నిందితుడు.. తర్వాత తాను పెళ్లి చేసుకోలేనని, అందంగా లేవంటూ మానసికంగా ఇబ్బందులకు గురిచేశాడు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని చెప్పినా పట్టించుకోలేదు. బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెట్టింగ్ భూతం.. దా‘రుణాలు’ అనంతం
[ 29-04-2024]
బెట్టింగ్ వ్యసనం ప్రాణాలు తీస్తోంది. అప్పులపాలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంకొందరు బరితెగించి చోరీలు, హత్యలు చేస్తున్నారు. -
కారు రూపురేఖలు మార్చి.. భయభ్రాంతులకు గురిచేస్తూ..
[ 29-04-2024]
రూపురేఖలు మార్చిన ఓ కారుతో రహదారులపై శబ్దాలు చేస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రాజాసింగ్.. రాస్తా అలగ్
[ 29-04-2024]
ఆయన ఎవరి మాట వినరు.. ఆయన మాట పార్టీ వినదు. అందుకేనేమో ఆయన కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. -
అరచేతిలో ఏఐ..ప్రచారానికి సై
[ 29-04-2024]
మేము గెలిస్తే కూడళ్లను అభివృద్ధి చేస్తాం.. రహదారులను విస్తరిస్తాం.. గ్రామాలు, పట్టణాలను సుందరీకరిస్తాం.. ఎన్నికల ప్రచారంలో నేతలు ఇలా హామీలు ఇస్తుంటారు. -
ఎందుకీ నిర్లిప్తత.. ఓటేద్దాం పదపద
[ 29-04-2024]
ప్రతి ఎన్నికల్లో రాజధానిలో పోలింగ్ శాతం తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రకరకాల కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నా ఓటర్ల నిర్లిప్తత సైతం దీనికి తోడవుతోంది. -
ఎండలు సలసల.. మీటర్లు గిరగిరా
[ 29-04-2024]
నగరంలో విద్యుత్తు డిమాండ్ 4వేల మెగావాట్లను దాటింది. ఇందులో పావువంతు ఒక్క మేడ్చల్ జోన్ పరిధిలోనే ఉంటోంది. వెయ్యి మెగావాట్లకు ఈ జోన్ డిమాండ్ చేరువైంది. -
నీటి ట్యాంకర్లకు ట్రాకింగ్
[ 29-04-2024]
ఫుడ్ డెలివరీ యాప్స్లో ఏదైనా ఆర్డర్ చేసిన తర్వాత డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడు.. ఎన్ని నిమిషాల్లో మన ఇంటికి చేరుకుంటాడో ఇట్టే తెలుకోవచ్చు. -
అభ్యర్థుల తరపున అన్నీ తామై..
[ 29-04-2024]
చోటామోటా నాయకులు అని కొట్టి పారేయకండి.. ఎన్నికల వేళ వాళ్లే నేతలకు అండాదండా అవుతున్నారు. బూత్ స్థాయిలో ఎవరు ఎవరికి ఓటేస్తారో కచ్చితంగా చెప్పేయగలరు. -
ఓటు మన ప్రాథమిక హక్కు
[ 29-04-2024]
ఓటుని వినియోగించుకోవడం మన ప్రాథమిక హక్కని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి అన్నారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ ఉద్యానవనం వద్ద ఆదివారం ఉదయం -
ఓట్ల పండగకు దూరంగా ఉంటే ఎలా?
[ 29-04-2024]
చట్టసభలకు ప్రాతినిథ్యం వహించే ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న Ëపోలింగ్ ప్రక్రియలో మేధావులు, విద్యావేత్తలు, యువకులు, విద్యార్థులు సరిగా పాల్గోవడం లేదు. -
ఓటు సమ్మేళనాలు
[ 29-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నంచేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేస్తారు. అదే లోక్సభ ఎన్నికల్లో.. -
ఫలితాల్లో.. పత్తాలేని కొత్త పార్టీలు
[ 29-04-2024]
ప్రధాన పార్టీలు మినహాయిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేర్వేరు పార్టీల అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వడం లేదు. 1శాతం ఓట్లను పొందలేక చతికిలపడుతున్నారు. -
అంకురాల ప్రోత్సాహానికి స్టార్టప్ మిక్సర్
[ 29-04-2024]
అంకుర సంస్థలు ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నా మనసును తొలిచే మొదటి ప్రశ్న పెట్టుబడి ఎలా? ఆ తర్వాత మార్కెటింగ్, బ్రాండింగ్ పెంచుకోవడం, -
పుడమికి బలం.. జగతికి జీవాధారం
[ 29-04-2024]
తాగునీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపుదలకు ‘ఇంకుడు గుంతలకు’ మించిన చక్కటి మార్గం మరొకటి లేదు. -
రసవత్తరం..చేవెళ్ల పోరు
[ 29-04-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికలు ప్రతిసారీ రసవత్తరంగా సాగుతాయి. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంటుంది. -
ఓటు.. ఐదు రూపాలు
[ 29-04-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి ఓటును నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి వేస్తారు. అయితే ఓటును ఐదు విధాలుగా వినియోగించుకునే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పించింది. -
పోలీసుల అదుపులో ద్విచక్ర వాహనాల దొంగ
[ 29-04-2024]
తాండూరు పట్టణంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం.. కాపాడిన కానిస్టేబుల్
[ 29-04-2024]
వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. హుస్సేన్సాగర్లో దూకేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్, మరికొందరు -
వేసవిలో నగరానికి అదనపు జలాలు
[ 29-04-2024]
గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సరఫరాకు డిమాండ్ పెరిగిందని.. -
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట మోసం
[ 29-04-2024]
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట నలుగురి నుంచి రూ.65,36,590 మేర కొల్లగొట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఎస్సార్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపారు.