మున్సిపల్ సిబ్బందిపై రాళ్లతో దాడి
రాజేంద్రనగర్ సర్కిల్లో ప్రదాన రహదారిపై కొబ్బరిబొండాలను విక్రయించేవారు మున్సిపల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.
దాడికి పాల్పడుతున్న కొబ్బరి బొండాల వ్యాపారి కుటుంబ సభ్యులు
రాజేంద్రనగర్, న్యూస్టుడే: రాజేంద్రనగర్ సర్కిల్లో ప్రదాన రహదారిపై కొబ్బరిబొండాలను విక్రయించేవారు మున్సిపల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. సులేమాన్నగర్ సమీపంలో ప్రధాన రహదారిపై కొబ్బరిబొండాలను విక్రయించడంపై స్థానికులు జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దానిపై చర్యలు తీసుకోవాలని ఆయన సర్కిల్ అధికారులను ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్ వాహనంతో పొరుగు సేవల సిబ్బంది సురేష్, అరుణ్, ఓంప్రకాష్ తదితరులు శుక్రవారం దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడ వ్యాపారులు లేకపోవడంతో కొబ్బరిబొండాలను తమ వాహనంలో వేస్తుండటం గమనించిన వ్యాపారి కుటుంబసభ్యులు ముగ్గురు వారిపై రాళ్లతో, కర్రలతో దాడిచేశారు. దీంతో సురేష్, ఓంప్రకాష్కు గాయాలైనట్లు మున్సిపల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబ్బందిపై వరుస దాడులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికుల సంఘ రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్రెడ్డి ఆరోపించారు.
నగ్న వీడియోలు తీసిన నకిలీ ఆర్ఎంపీ వైద్యుడి అరెస్టు
అహ్మద్
తాండూరు టౌన్, న్యూస్టుడే: తాండూరు పట్టణంలో ఆర్ఎంపీ వైద్యుడిగా చెలామణి అవుతూ, ఓ మహిళను నగ్నంగా వీడియోలు తీసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన అహ్మద్ ఆర్ఎంపీ వైద్యుడిగా క్లీనిక్ నిర్వహిస్తున్నాడు. అక్కడికి వచ్చే మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఇదే క్రమంలో ఓ మహిళతోనూ ఇలాగే వ్యవహరించి, ఆమెను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశాడు. దీంతో బాధితురాలు ఈ నెల 11వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అహ్మద్ పట్టణాన్ని వదిలి పరారయ్యాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, ఎట్టకేలకు మహబూబ్నగర్ జిల్లా ఉద్దండాపూరు వద్ద శుక్రవారం పట్టుకున్నారు. అతని వద్ద ఆర్ఎంపీగా గుర్తించే ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేవని డీఎస్పీ చెప్పారు. అత్యాచారం కేసుతో పాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ, ప్రివెంటు యాక్ట్, చీటింగ్ కేసులు నమోదు చేశామని వివరించారు.
తల్లికి మాత్రలు తెచ్చేందుకు వెళ్లి విద్యార్థి దుర్మరణం
సుదీప్ పట్నాయక్
పటాన్చెరు అర్బన్, న్యూస్టుడే: తల్లికి మాత్రలు తెచ్చేందుకు వెళ్లి ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి దుర్మరణం చెందాడు. పటాన్చెరు ఠాణా పోలీసుల కథనం ప్రకారం.. పటాన్చెరు సీతారామపురం కాలనీలో ఉంటున్న సుదీప్ పట్నాయక్(15) పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం వార్షిక పరీక్షలు రాస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి బాలుడి తల్లికి పంటినొప్పి రావడంతో మాత్రలు తెచ్చేందుకు ద్విచక్ర వాహనం తీసుకొని బయల్దేరాడు. శాంతినగర్లో స్నేహితుడు జస్వంత్ను ఎక్కించుకుని జాతీయ రహదారిపైకి వస్తున్నాడు. పెట్రోల్ తక్కువగా ఉందని నోవాపాన్ కూడలికి సమీపంలో ఉన్న బంక్కు వెళ్లి పెట్రోల్ పోయించుకుని తిరిగి వసున్నారు. ఆ సమయంలో వాల్యూజోన్ మార్ట్ సమీపంలో ముందు వెళుతున్న వాహనాన్ని బలంగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. సుదీప్ పట్నాయక్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. జస్వంత్కు గాయాలు కాగా.. ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
40 పాత ద్విచక్ర వాహనాలు దగ్ధం
ఆసిఫ్నగర్, న్యూస్టుడే: ఆసిఫ్నగర్ పాత పోలీస్స్టేషన్లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. నిజాం హయాంలోని ఈ ఠాణాను కూల్చివేయడంతో ప్రస్తుతం ఖాళీగా ఉంది. కొన్నేళ్ల క్రితం వివిధ కేసుల కిందË స్వాధీనం చేసుకున్న వాహనాలను అక్కడ ఉంచారు. ప్రమాదంలో దాదాపు 40 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఖాళీ స్థలంలో పొదలు దట్టంగా పెరిగాయని, ఎండాకాలం కావడంతో మొక్కలు ఎండిపోయాయి. గురువారం రాత్రి ఓ పెళ్లి బరాత్లో టపాసుల పేల్చడంతో నిప్పురవ్వలు పడి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే ఈ జాగా ప్రహరీని ఆనుకొని ఉన్న నియంత్రిక పనిచేయకపోవడంతో విద్యుత్తు అధికారులు మొబైల్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు.
దొంగతనాలతో జల్సాలు...ఐదుగురి అరెస్టు
చోరీకి దొంగల ముఠా ఉపయోగించిన పరికరాలు
శామీర్పేట, న్యూస్టుడే: సైబరాబాద్ కమిషనరేట్లోని నిర్మానుష్య ప్రదేశాలు, వ్యవసాయ క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని 18 చోరీలకు పాల్పడిన ఓ ముఠాను శామీర్పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన షేక్ఖాదర్(32), షేక్ఖయ్యూమ్(30), షేక్నయీం(25), షేక్మహ్మద్(21), షేక్రహీం(27)లు ముఠాగా ఏర్పడ్డారు. ఆటోలో వచ్చి బోరు మోటార్లు, రాగి తీగలు, వాహనాల బ్యాటరీలు, నిర్మాణంలో ఉన్న ఇళ్లలోని ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వస్తువులు, దేవాలయాల్లోని హుండీలు, గ్యాస్ సిలిండర్లు, ఇత్తడి వస్తువులను చోరీ చేస్తున్నారు. చోరీ సొత్తు అమ్ముకుని ఆ డబ్బుతో జల్సాలు చేస్తారు. ఈ ముఠా శామీర్పేట ఠాణా పరిధిలో 6 చోరీలకు పాల్పడ్డారు. శుక్రవారం ప్యాసింజర్ ఆటోలో ఉప్పరిపల్లి అవుటర్ రింగ్ సర్వీస్ రోడ్డులో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద స్పానర్స్, ఎలక్ట్రికల్ హ్యండ్ గ్రైండర్, చిన్న గునపం, కట్టింగ్ ప్లేయర్లు, రింగ్ పానాలు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలతో ద్విచక్ర వాహనాల విక్రయం
స్వాధీనం చేసుకున్న వాహనాలు, చిత్రంలో నిందితుడు మహ్మద్ అక్బరుద్దీన్
అబిడ్స్, న్యూస్టుడే: నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు, నంబరు ప్లేట్లు సృష్టించి ద్విచక్ర వాహనాలు విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి అబిడ్స్ పోలీసులకు అప్పగించారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాల్ వివరాల ప్రకారం.. కింగ్కోఠి షేర్గేట్కు చెందిన మహ్మద్ అక్బరుద్దీన్(34) వృత్తిరీత్యా లేథ్ మెషిన్ వర్కర్. అతనికి కింగ్కోఠిలో నియామత్ ఇంజినీరింగ్ వర్క్స్ ఉంది. అక్రమ సంపాదనకు పథకం వేశాడు. పాత ద్విచక్ర వాహనాలను స్క్రాప్ డీలర్లు, ఫైనాన్సర్ల నుంచి ఎలాంటి పత్రాలు లేనివి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాడు. అనంతరం వాటి విడిభాగాలు ఇంజన్, ఛాసిస్, ఇతర భాగాలతో నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు, నంబరు ప్లేట్లు సృష్టించి విక్రయించి ఆర్జిస్తున్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. ఏడు ద్విచక్ర వాహనాలు, కట్టింగ్ మిషన్, ఆల్ఫాబెటికల్ ఐరన్ బిట్స్/డైలు (40), నంబరు ప్లేటు కలిగిన ఐరన్ బిట్స్/డైలు (09) స్వాధీనం చేసుకున్నారు.
తుక్కు దుకాణంలో అగ్నిప్రమాదం
తగలబడుతున్న దుకాణం
శంషాబాద్, న్యూస్టుడే: శంషాబాద్ పట్టణంలో శుక్రవారం ఓ తుక్కు దుకాణంలో మంటలు చెలరేగాయి. ఎల్పీజీ గ్యాస్ కంపెనీకి ఆనుకొని మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన గ్యాస్ ఏజన్సీ సిబ్బంది సిలిండర్లను వెంటనే బయటకు తరలించారు. ఆర్జీఐఏ పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. అహ్మద్నగర్కు చెందిన సాధిక్, జహంగీర్ ఇద్దరు బంధువులు. వీరు ఆర్బీనగర్లోని రాళ్లగూడ రహదారి పక్కన కొన్నేళ్ల కిందట దుకాణం ఏర్పాటు చేసి కేబీఎన్ పేరుతో తుక్కు వ్యాపారం చేస్తున్నారు. ఎప్పటిలా గురువారం రాత్రి వారు దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లారు. ఉదయం తుక్కు దుకాణంలో మంటలు వస్తున్నాయని కాలనీవాసులు వారికి సమాచారం అందించారు. వెంటనే వచ్చి స్థానికులతో కలిసి మంటలను ఆర్పడానికి యత్నించినా ఫలితం లేదు. అగ్నిమాపక శకటాలు ఆలస్యంగా వచ్చాయి. తుక్కు దుకాణం వద్ద బార్ నిర్వాహకులు చెత్త కుప్పలకు నిత్యం నిప్పు పెడుతున్నారన్నారని, ఆ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
వృద్ధుడి మెడలో గొలుసు అపహరణ
సైదాబాద్: వృద్ధుడి మెడలో బంగారు గొలుసు అపహరించిన ఘటన సైదాబాద్ ఠాణా పరిధిలో జరిగింది. గొలుసు తెంపుకొని పారిపోతున్న దొంగను ఇద్దరు యువకులు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. మాదన్నపేటకు చెందిన ప్రకాశ్గౌడ్ వెల్డింగ్ పనులు చేస్తాడు. శుక్రవారం సాయంత్రం శంకేశ్వర్బజార్ పెట్రోల్ బంకు వద్ద కారులోంచి అతను దిగాడు. ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతన్ని బెదిరించారు. అతని మెడలోని రెండు తులాల బంగారు గొలుసు అపహరించి పారిపోతుండగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నించి రహదారిపై పడిపోయాడు. సమీపంలో ఉన్న ఇద్దరు యువకులు గమనించి ఆటోలో పారిపోతున్న సింగరేణి కాలనీ గుడిసెల ప్రాంతానికి చెందిన కొర్ర స్వామి నాయక్(40)ను వెంబడించి పట్టుకున్నారు. ఆటోలో ఉన్న మరో వ్యక్తి పరారయ్యాడు.
పోలీసులు న్యాయం చేయడం లేదని..
పెట్రోల్ సీసాతో శ్రీనివాస్
యూసుఫ్గూడ, న్యూస్టుడే: మధురానగర్ పోలీసులు తనకు న్యాయం చేయడంలేదంటూ, రహ్మత్నగర్ వీడియోగల్లీ ప్రాంతానికి చెందిన యోగా శిక్షకుడు శ్రీనివాస్ ఓ గదిలోకి వెళ్లి గడియ వేసుకొని, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్చల్ చేశాడు. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. భార్యతో విభేదాలు రావడంతో శ్రీనివాస్ దంపతులు ఏడేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈనెల 17న అతడు ఇంట్లో భోజనం చేస్తుండగా ఓ వ్యక్తి వచ్చి ప్లేటు తన్ని, బయటికి నెట్టేడయంతో డయల్ 100కు కాల్ చేశాడు. ఇంతలో వచ్చిన వ్యక్తి పారిపోయాడు. పోలీసులు తనను ఠాణాకు తీసుకొచ్చారని, అదే సమయంలో భార్య, పిల్లలు రాగా, తన ఫిర్యాదు తీసుకోకుండా, భార్య తనపై ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్నారని ఆరోపించాడు. పోలీసులు తనకు న్యాయం చేయడంలేదని, ఆత్మహత్యే శరణ్యమని పేర్కొన్నాడు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా.. శ్రీనివాస్ భార్య, పిల్లల్ని వేధిస్తుండటంతో వారు ఆమె తల్లి ఇంట్లో ఉంటున్నారని, అమ్మమ్మ మనుమరాలికి ఇచ్చిన ఇంటి స్థలాన్ని విక్రయించడంతో శ్రీనివాస్ వచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడని, అతడి కూతురు ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబరు 198/24 కేసు నమోదు అయ్యిందన్నారు. అయితే, తన మామ తనకు స్థలం ఇచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించినందుకు శ్రీనివాస్పై నాలుగేళ్ల కిత్రం జూబ్లీహిల్స్ ఠాణాలోనూ కేసు నమోదు అయిందని ఇన్స్పెక్టర్ డి.మధుసూదన్ రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
[ 28-04-2024]
హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. -
భువనేశ్వర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
[ 28-04-2024]
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒడిశా రాజధాని భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. -
రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు
[ 28-04-2024]
రిజర్వేషన్ల అంశంపై ఆర్ఎస్ఎస్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. -
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు
[ 28-04-2024]
నగరంలో కాలేయ కొవ్వు (ఫ్యాటీ లివర్) సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ తర్వాత చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం పెట్టగా.. ఇప్పటికీ కొన్ని కొనసాగిస్తున్నాయి. -
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
[ 28-04-2024]
వద్దని చెప్పినా వినకుండా తనకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న.. తమ్ముడి భార్య అమ్మమ్మ ఇంటికి నిప్పంటించిన ఘటన నగరంలో ఐదో ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. -
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
[ 28-04-2024]
ఈ చిత్రం చూశారా.. ఓయూ ఆర్ట్స్ కళాశాల అనుకుంటున్నారా.. అయితే మీరు పొరబడినట్లే. ఇది కైరోలోని ఈజిప్ట్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్. దీని ఆర్కిటెక్ట్ మొనేసర్ ఎర్నెస్ట్ జాస్పర్. -
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
[ 28-04-2024]
తెలంగాణలో తొలిసారిగా ఓ తమిళపార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తోంది. తమిళనాడు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్న విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ తరఫున హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులుగా జె.పద్మజ, పగిడిపల్లి శ్యామ్లు నామినేషన్లు దాఖలు చేశారు. -
ఎండకు తాళలేం.. ఎన్నికల విధులకు వెళ్లలేం
[ 28-04-2024]
ఎన్నికల విధుల పట్ల కొందరు ఉద్యోగులు ఆసక్తి చూపట్లేదు. రకరకాల కారణాలు చెప్పి మినహాయింపు కోరుతున్నారు. నిత్యం సుమారు వంద నుంచి 200ల మంది ఉద్యోగులు లేఖలు ఇస్తుండటమే అందుకు నిదర్శనం. -
సాధించేందుకు పట్టు.. తెలిసిందే లోగుట్టు
[ 28-04-2024]
మొన్నటి వరకు ఆ ముగ్గురు నేతలు భారాసలో కీలకంగా ఉన్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్కు రాజకీయంగా సన్నిహితంగా మెలిగినవారే. ఇప్పుడు అదే నేతలు కాంగ్రెస్లో చేరి రాజధాని పరిధిలోని మూడు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులుగా బరిలో నిలిచారు. -
నాలుగు స్థానాలు.. బరిలో 168 మంది
[ 28-04-2024]
హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసింది. మల్కాజిగిరిలో ఏకంగా 114మంది నామపత్రాలు సమర్పించడంతో శుక్రవారం అర్ధరాత్రి వరకూ పరిశీలన కొనసాగింది. -
బెట్టింగ్ కోసం వృద్ధురాలిని హతమార్చిన యువకుడు
[ 28-04-2024]
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కి పాల్పడిన యువకుడు.. వృద్ధురాలిని హతమార్చి పరారయ్యాడు. చివరికి చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన ఆదిభట్ల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. -
గంజాయి తాగొచ్చి వేధిస్తున్నాడని తమ్ముడి హత్య
[ 28-04-2024]
మద్యం, గంజాయికి బానిసయ్యాడు. మత్తులో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను వేధించడం, ఇంట్లోని డబ్బు, వస్తువులు తీసుకెళ్తున్న తమ్మున్ని అన్న హత్య చేశాడు. -
నాలా.. సాఫీగా సాగేలా
[ 28-04-2024]
నాలా పూడికతీత పనుల్లో జీహెచ్ఎంసీ వేగం పెంచింది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో గుత్తేదారులు పనులు ఆపేయగా.. కమిషనర్ రోనాల్డ్రాస్ భరోసా ఇవ్వడంతో నెలరోజులుగా పనులు ఊపందుకున్నాయి. -
ప్రత్యర్థుల లోపాలను ఎత్తిచూపుతూ..
[ 28-04-2024]
నగరంలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. నామినేషన్ల దాఖలు పూర్తికావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టిపెట్టారు. -
యువ వాటరూ.. నీదే జోరు
[ 28-04-2024]
యువ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే గెలుపు తథ్యమని భావిస్తున్న నాయకులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో దాదాపు సగం మంది ఓటర్లు 18 నుంచి 39 ఏళ్లలోపు వారే ఉండటంతో వీరిని తమవైపు తిప్పుకొంటే గెలుపు ఖాయమనే ధీమాలో నేతలున్నారు. -
అసత్య ప్రచారాలకు ‘మిత్ వర్సెస్ రియాలిటీ’తో చెక్
[ 28-04-2024]
అసత్య ప్రచారాలపై నియంత్రణ లేకుండా పోతోంది.. ఫలితంగా వాస్తవ సమాచారం దారి తప్పుతోంది. సామాజిక మాధ్యమాలు వేదికగా నిత్యం వివిధ అంశాలపై కోకొల్లలుగా వార్తలు, వదంతులు పుట్టుకొస్తున్నాయి. -
ఆలిన్లో అదుపులోకి అగ్నికీలలు
[ 28-04-2024]
ఆలిన్ ఫార్మా పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు చల్లారక పోవడంతో భారీ నష్టం వాటిల్లింది. 24 గంటలు దాటినా మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో అటుగా ఉండే పరిశ్రమలు, కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. -
డార్మెటరీలో దోస్తీ.. చోరీలతో మస్తీ
[ 28-04-2024]
ఎంజీబీఎస్ వద్ద ఉన్న డార్మెటరీలో పరిచయమై సెల్ఫోన్, ద్విచక్రవాహనాలను దొంగలిస్తూ జల్సాలు చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. -
నగరవాసి.. నీటికి అల్లాడి
[ 28-04-2024]
వేసవికి భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు, జలమండలి సరఫరా చేసే నీటి పరిమాణం సైతం తగ్గుతోంది. అవసరాలకు సరిపడా నీరు లభించక అల్లాడుతున్న జనాన్ని ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు. -
బామ్మర్దికి వీడియోకాల్.. ఆపై బలవన్మరణం
[ 28-04-2024]
బామ్మర్దికి వీడియోకాల్ చేసి ఓ వ్యక్తి ఉరి వేసుకున్న ఘటన శనివారం కీసర మండలం చీర్యాలలో జరిగింది. సీఐ వెంకటయ్య వివరాల ప్రకారం. బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామానికి చెందిన పర్వతం మహేశ్యాదవ్(38)కు 12 ఏళ్ల క్రితం కీసర శివాజీ నగర్ కాలనీకి చెందిన భవానీతో వివాహమైంది. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 28-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గెలుపు బాధ్యత మీదే!
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతలు ఎన్నికల ప్రచారానికి మరింత పదును పెడుతున్నారు. ఉదయం మొదలు రాత్రి వరకు తమ పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులపై స్థానిక నాయకులను అడిగి తెలుసుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వెంకటగిరిలోజగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!