నిలువ నీడ.. యాడ?
బస్షెల్టర్ల ఏర్పాటులో జాప్యం, నిర్వహణ లోపం కారణంగా ఆర్టీసీ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
రద్దీ ప్రాంతాల్లో షెల్టర్లు లేక ప్రయాణికుల అవస్థలు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: బస్షెల్టర్ల ఏర్పాటులో జాప్యం, నిర్వహణ లోపం కారణంగా ఆర్టీసీ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో షెల్టర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు మండుటెండలో రహదారిపై నిరీక్షిస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు సైతం అవస్థలు పడుతున్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య పెరిగింది.. పథకం అమలు చేయడానికి పూర్వం నగరంలో రోజుకి సగటున 11 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు.. ప్రస్తుతం వారి సంఖ్య 16 లక్షలకు పెరిగింది. ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు కానరావడం లేదు. ట్రాఫిక్ ఆంక్షల పేరిట బస్టాప్ల వద్ద ప్రయాణికులు ఉన్నప్పటికీ డ్రైవర్లు బస్సుల్ని అక్కడ ఆపకుండా దూరంగా నిలుపుతున్నారు. దీంతో ప్రయాణికులు వాటి కోసం పరుగులు పెడుతున్నారు.
షాపింగ్మాల్స్ ముందు నిరీక్షణ..: అవసరమైన చోట షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు ఎండవేడిమి తాళలేక షాపింగ్మాల్స్ ముందు బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. మాల్స్ ద్వారాల నుంచి బయటకొచ్చే చల్లగాలిలో వారు సేదదీరుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏసీ షెల్టర్లు ఉన్నప్పటికీ అవి నిరుపయోగంగా మారాయి. వాటి నిర్వహణను అధికారులు విస్మరించారు. వాటిలోకి వెళ్లిన ప్రయాణికులు ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తార్నాక-ఉప్పల్ మధ్య పలు బస్టాప్ల ముందున్న స్థలాన్ని ద్విచక్ర వాహనాల పార్కింగ్కు ఉపయోగిస్తున్నారు. అమీర్పేట్ వద్ద షెల్టర్ లేకపోవడంతో సవ్య, అపసవ్య దిశలో వచ్చే వాహనాలను దాటి బస్సెక్కాల్సిన పరిస్థితి. ఈఎస్ఐ నుంచి కూకట్పల్లి వైపు వెళ్లే ప్రయాణికుల కోసం మూడు షెల్టర్లు ఏర్పాటు చేయగా.. దానిలో కూర్చున్నవారికి బస్సులు కనిపించడం లేదు. దీంతో వారు రహదారి పక్కనున్న చెట్ల కింద నిరీక్షిస్తున్నారు. ఆయా షెల్టర్లను ఆకతాయిలు ఆక్రమించుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గాంధీభవన్, నాంపల్లి, లక్డీకాపూల్, బేగంపేట్, పబ్లిక్గార్డెన్ తదితర ప్రాంతాల్లోని షెల్టర్లు లోపలకు ఉండటంతో వాటిలో ఉండే ప్రయాణికులకు బస్సుల రాక గుర్తించడం కష్టమవుతోంది.
బస్సెక్కాలంటే నడవాల్సిందే..
హిమాయత్నగర్ రోడ్డు, నారాయణగూడ, కాచిగూడ, అమీర్పేట్, కోరి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో షెల్టర్లు అందుబాటులో లేవు. ఆయా ప్రాంతాల్లో బస్సెక్కాలంటే సుమారు కి.మీ.దూరంలోని బస్టాప్ల వద్దకు నడిచి వెళుతున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఆటోలపై ఆధారపడుతున్నారు. హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, సోమాజిగూడ ప్రాంతాల్లో అవసరానికి మించి షెల్టర్లు నిర్మించారు. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా క్యాబ్లు, ద్విచక్ర వాహనాలపై ఆధారపడతారు. జనాలకు మాత్రం షెల్టర్లు లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెట్టింగ్ భూతం.. దా‘రుణాలు’ అనంతం
[ 29-04-2024]
బెట్టింగ్ వ్యసనం ప్రాణాలు తీస్తోంది. అప్పులపాలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంకొందరు బరితెగించి చోరీలు, హత్యలు చేస్తున్నారు. -
కారు రూపురేఖలు మార్చి.. భయభ్రాంతులకు గురిచేస్తూ..
[ 29-04-2024]
రూపురేఖలు మార్చిన ఓ కారుతో రహదారులపై శబ్దాలు చేస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రాజాసింగ్.. రాస్తా అలగ్: ప్రచారానికి దూరంగా భాజపా ఎమ్మెల్యే
[ 29-04-2024]
ఆయన ఎవరి మాట వినరు.. ఆయన మాట పార్టీ వినదు. అందుకేనేమో ఆయన కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. -
అరచేతిలో ఏఐ..ప్రచారానికి సై
[ 29-04-2024]
మేము గెలిస్తే కూడళ్లను అభివృద్ధి చేస్తాం.. రహదారులను విస్తరిస్తాం.. గ్రామాలు, పట్టణాలను సుందరీకరిస్తాం.. ఎన్నికల ప్రచారంలో నేతలు ఇలా హామీలు ఇస్తుంటారు. -
ఎందుకీ నిర్లిప్తత.. ఓటేద్దాం పదపద
[ 29-04-2024]
ప్రతి ఎన్నికల్లో రాజధానిలో పోలింగ్ శాతం తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రకరకాల కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నా ఓటర్ల నిర్లిప్తత సైతం దీనికి తోడవుతోంది. -
ఎండలు సలసల.. మీటర్లు గిరగిరా
[ 29-04-2024]
నగరంలో విద్యుత్తు డిమాండ్ 4వేల మెగావాట్లను దాటింది. ఇందులో పావువంతు ఒక్క మేడ్చల్ జోన్ పరిధిలోనే ఉంటోంది. వెయ్యి మెగావాట్లకు ఈ జోన్ డిమాండ్ చేరువైంది. -
నీటి ట్యాంకర్లకు ట్రాకింగ్
[ 29-04-2024]
ఫుడ్ డెలివరీ యాప్స్లో ఏదైనా ఆర్డర్ చేసిన తర్వాత డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడు.. ఎన్ని నిమిషాల్లో మన ఇంటికి చేరుకుంటాడో ఇట్టే తెలుకోవచ్చు. -
అభ్యర్థుల తరపున అన్నీ తామై..
[ 29-04-2024]
చోటామోటా నాయకులు అని కొట్టి పారేయకండి.. ఎన్నికల వేళ వాళ్లే నేతలకు అండాదండా అవుతున్నారు. బూత్ స్థాయిలో ఎవరు ఎవరికి ఓటేస్తారో కచ్చితంగా చెప్పేయగలరు. -
ఓటు మన ప్రాథమిక హక్కు
[ 29-04-2024]
ఓటుని వినియోగించుకోవడం మన ప్రాథమిక హక్కని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి అన్నారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ ఉద్యానవనం వద్ద ఆదివారం ఉదయం -
ఓట్ల పండగకు దూరంగా ఉంటే ఎలా?
[ 29-04-2024]
చట్టసభలకు ప్రాతినిథ్యం వహించే ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న Ëపోలింగ్ ప్రక్రియలో మేధావులు, విద్యావేత్తలు, యువకులు, విద్యార్థులు సరిగా పాల్గోవడం లేదు. -
ఓటు సమ్మేళనాలు
[ 29-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నంచేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేస్తారు. అదే లోక్సభ ఎన్నికల్లో.. -
ఫలితాల్లో.. పత్తాలేని కొత్త పార్టీలు
[ 29-04-2024]
ప్రధాన పార్టీలు మినహాయిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేర్వేరు పార్టీల అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వడం లేదు. 1శాతం ఓట్లను పొందలేక చతికిలపడుతున్నారు. -
అంకురాల ప్రోత్సాహానికి స్టార్టప్ మిక్సర్
[ 29-04-2024]
అంకుర సంస్థలు ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నా మనసును తొలిచే మొదటి ప్రశ్న పెట్టుబడి ఎలా? ఆ తర్వాత మార్కెటింగ్, బ్రాండింగ్ పెంచుకోవడం, -
పుడమికి బలం.. జగతికి జీవాధారం
[ 29-04-2024]
తాగునీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపుదలకు ‘ఇంకుడు గుంతలకు’ మించిన చక్కటి మార్గం మరొకటి లేదు. -
రసవత్తరం..చేవెళ్ల పోరు
[ 29-04-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికలు ప్రతిసారీ రసవత్తరంగా సాగుతాయి. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంటుంది. -
ఓటు.. ఐదు రూపాలు
[ 29-04-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి ఓటును నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి వేస్తారు. అయితే ఓటును ఐదు విధాలుగా వినియోగించుకునే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పించింది. -
పోలీసుల అదుపులో ద్విచక్ర వాహనాల దొంగ
[ 29-04-2024]
తాండూరు పట్టణంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం.. కాపాడిన కానిస్టేబుల్
[ 29-04-2024]
వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. హుస్సేన్సాగర్లో దూకేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్, మరికొందరు -
వేసవిలో నగరానికి అదనపు జలాలు
[ 29-04-2024]
గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సరఫరాకు డిమాండ్ పెరిగిందని.. -
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట మోసం
[ 29-04-2024]
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట నలుగురి నుంచి రూ.65,36,590 మేర కొల్లగొట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఎస్సార్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక