logo

భాజపాతోనే తెలంగాణ అభివృద్ధి

తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యవుతుందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ అన్నారు. సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం పట్టణంలోని

Published : 01 Jul 2022 03:01 IST

కేంద్రమంత్రి వీరేంద్ర కుమార్‌

సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌, వేదికపై గంగాడి కృష్ణారెడ్డి, సుద్దాల దేవయ్య, బొడిగ శోభ

చొప్పదండి, న్యూస్‌టుడే: తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యవుతుందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ అన్నారు. సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం పట్టణంలోని జీఆర్‌ఆర్‌ గార్డెన్‌లో నియోజకవర్గ భాజపా నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పేదల కోసం పనిచేసేది మోదీ ప్రభుత్వమన్నారు. ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో యువకులకు సరైన న్యాయం జరగలేదని విమర్శించారు.కేవలం కేసీఆర్‌ కుటుంబమే లాభపడిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు సైనికుల్లా  కృషి చేయాలని కోరారు.  అనంతరం కొలిమికుంటలో దళిత కార్యకర్త ఇంట్లో భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, జిల్లా నాయకులు లక్ష్మినారాయణ, ప్రభాకర్‌ యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, శంకర్‌, సత్యనారాయణ, కృష్ణారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, కోటేష్‌, తిరుపతి, లింగయ్య, ప్రశాంత్‌ పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని