బీఎస్పీ అభ్యర్థులుగా మరో ఆరుగురు ఖరారు
బహుజన సమాజ్పార్టీ తరఫున మరో ఆరు స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం సోమవారం ఖరారు చేసింది.
ఈనాడు, కరీంనగర్: బహుజన సమాజ్పార్టీ తరఫున మరో ఆరు స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం సోమవారం ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే నాలుగు స్థానాల్లో రంగంలో నిలిచే అభ్యర్థులను ఈ నెల 3వ తేదీన ప్రకటించగా.. తాజాగా మరో ఆరుగురి పేర్లను పార్టీ వెల్లడించింది. దీంతో మొత్తంగా 10 మందికి టికెట్లు లభించాయి. తాజాగా ప్రకటించిన జాబితాలో కోరుట్ల స్థానం నుంచి నిశాంత్ కార్తికేయగౌడ్, జగిత్యాల నుంచి బల్కం మల్లేశ్యాదవ్, రామగుండం నుంచి అంబటి నరేశ్యాదవ్, హుజూరాబాద్ నుంచి పల్లె ప్రశాంత్గౌడ్, సిరిసిల్ల నుంచి పిట్టల భూమేశ్ ముదిరాజ్, వేములవాడ నుంచి గోలి మోహన్లకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు ప్రకటించిన బీఎస్పీ పోటీదారుల్లో ఎక్కువగా యువకులు, విద్యావంతులే ఉండటం గమనార్హం. ఇంతకుముందు మొదటి జాబితాలో నిషాని రామచంద్రం (మానకొండూర్), నక్క విజయ్కుమార్ (ధర్మపురి), దాసరి ఉష (పెద్దపల్లి), కొంకటి శేఖర్ (చొప్పదండి)పేర్లు ఖరారయ్యాయి. కరీంనగర్, మంథని, హుస్నాబాద్ అభ్యర్థులు ఇంకా ఎవరనేది తేలాల్సి ఉంది.
- పేరు
- నియోజకవర్గం
- వయసు
- తల్లిదండ్రులు
- భార్య
- పిల్లలు
- స్వగ్రామం
- నిశాంత్ కార్తికేయగౌడ్
- నియోజకవర్గం: కోరుట్ల
- 39
- అరుణ, నరేందర్గౌడ్
- సవ్యశ్రీ
- పార్వతీ
- మెట్పల్లి
కోరుట్ల : రెండున్నరేళ్లుగా రాజకీయాల్లో తిరుగుతున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో బీసీఏ పూర్తిచేసిన తరువాత సినిమా ఇండస్ట్రీపై ఉన్న ఆసక్తితో డైరెక్టరుగా మారాలనుకున్నారు. ఎంఏలో సినిమా రంగానికి సంబంధించిన ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసి డైరెక్టర్గా అవకాశాల కోసం కొన్నాళ్లు తిరిగారు. కొందరి వద్ద సహాయకుడిగా పనిచేసి అనుభవం సంపాదించారు. తరువాత తన తల్లి పూదరి అరుణ మెట్పల్లి జడ్పీటీసీ సభ్యురాలిగా గతంలో కొనసాగడంతో రాజకీయాల్లోకి వచ్చారు. బీఎస్పీలో చేరి ప్రస్తుతం టికెట్ను పొందారు.
- పల్లె ప్రశాంత్గౌడ్
- హుజూరాబాద్
- 32
- స్వరూప, శంకరయ్య
- కన్నూర్
హుజూరాబాద్ గ్రామీణం: యువ నాయకుడైన పల్లె ప్రశాంత్గౌడ్ స్వగ్రామం హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం కన్నూర్ (రాములపల్లి). ఎంఏ ఎల్ఎల్బీ చదివిన ఈయన కొన్ని నెలలుగా బీఎస్పీ తôఫున నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. న్యాయవాద వృత్తిలో రాణిస్తూనే నియోజకవర్గ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. తాజాగా టికెట్ ఇవ్వడంతో హుజూరాబాద్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడి టికెట్ కోసం పలువురు పోటీ పడినప్పటికీ పార్టీ అధిష్ఠానం మాత్రం ప్రశాంత్గౌడ్కు ప్రాధాన్యమిచ్చింది.
- అంబటి నరేశ్ యాదవ్
- రామగుండం
- 36
- లక్ష్మి, మొండయ్య
- జ్యోతి
- నిత్యశ్రీ, నిహర్ష
- గోదావరిఖని
గోదావరిఖని: పీజీలో రాజనీతిశాస్త్రం చదివిన ఈ యువ నాయకుడు పాల వ్యాపారం చేస్తూ సింగరేణిలో ఉద్యోగాన్ని పొందారు. కొన్నాళ్ల తరువాత ఉద్యోగాన్ని వదిలిపెట్టి కార్మికుల సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఆర్ఎఫ్సీఎల్ సహా సింగరేణి కార్మికుల పక్షాన పలు ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారు. నియోజకవర్గంలో కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటం చేసిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. కొన్ని నెలల కిందట బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్కుమార్ పెద్దపల్లికి వచ్చిన సందర్భంలో పార్టీలో చేరారు. తరువాత పార్టీని విస్తరించేందుకు నియోజకవర్గంలో ఇటీవల విస్తృతంగా పర్యటిస్తున్నారు. టికెట్ రావడంతో పోటీకి సిద్ధమవుతున్నారు.
- బల్కం మల్లేశ్యాదవ్
- జగిత్యాల
- 48
- జమున
- పవన్
- హిమ్మత్రావుపేట
జగిత్యాల : కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేటకు చెందిన మల్లేశ్యాదవ్ బీఎస్పీలో కొన్నాళ్లుగా నియోజకవర్గ స్థాయి నాయకుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో హిమ్మత్రావుపేట ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచి మండల పరిషత్తు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో భారాసలో చురుగ్గా పని చేశారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. పార్టీ అధిష్ఠానం ఈయనకు జగిత్యాల నుంచి బరిలో నిలిచే అవకాశాన్ని కల్పించింది.
- పిట్టల భూమేశ్ ముదిరాజ్
- సిరిసిల్ల
- దేవవ్వ, రాములు
- జ్యోతి
- రాహుల్, శాంతన్
- తిమ్మాపూర్, చందుర్తి మండలం
సిరిసిల్ల గ్రామీణం : న్యాయవాద వృత్తిలో ఉన్న భూమేశ్ 2002లో బీఎస్పీలో చేరి వివిధ పార్టీ పదవుల్ని అందుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. సిరిసిల్ల కోర్టులో న్యాయవాదిగా పని చేస్తూనే రాజకీయాల్లో రాణిస్తున్నారు. తిమ్మాపూర్ గ్రామ సర్పంచిగా గతంలో పని చేశారు. ఇదే సమయంలో సర్పంచుల ఫోరం రాష్ట్ర కమిటీకి సలహాదారుగా వ్యవహరించారు. ఇక్కడి ప్రజల సమస్యలపై పలు పోరాటాలు, ఆందోళనలు చేపట్టారు. పార్టీ అధిష్ఠానం టికెట్ను ఇవ్వడంతో సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
- గోలి మోహన్
- వేములవాడ
- 46
- మల్లమ్మ, నారాయణ
- జ్యోత్స్నరాణి
- అక్షయ, ఆద్య
- నూకలమర్రి
వేములవాడ : ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసిన గోలి మోహన్ 2010లో అమెరికా వెళ్లి శాస్త్రవేత్తగా పని చేశారు. 2013లో ఆద్యగోలి ఫౌండేషన్ను ప్రారంభించి వేములవాడ నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. యువత కోసం ఉపాధి మేళాలను నిర్వహించి కొందరికి ఉద్యోగావకాశాల్ని అందించారు. ఆధునిక విధానాలతోపాటు సేంద్రియ సాగును ప్రోత్సహించే విధంగా రైతులకు నియోజకవర్గవ్యాప్తంగా పలు అవగాహన సదస్సులను నిర్వహించారు. మేలైన పంటల సాగు దిశగా రైతుల్ని ప్రోత్సహిస్తున్నారు. భారాసలో కొన్నాళ్లు కొనసాగిన ఆయన ఇటీవల బీఎస్పీలో చేరారు. టికెట్ను దక్కించుకుని పోటీ అవకాశాన్ని పొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారం
[ 27-04-2024]
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
82 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం నామపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించి 34 మందివి తిరస్కరించి, 82 మందివి ఆమోదించారు. -
గ్యారంటీలను అమలు చేస్తాం : మంత్రి పొన్నం
[ 27-04-2024]
‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సవాల్ విసిరారు. -
అభ్యర్థులను చూసి ఓటు వేయండి
[ 27-04-2024]
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
[ 27-04-2024]
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వేసవి వేళ.. ఆటల వేడుక
[ 27-04-2024]
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. -
బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం
[ 27-04-2024]
ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్