ఏళ్ల కల.. సాకారమైన వేళ
ఒకప్పుడు భద్రాచలం దండకారణ్యం.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఉండేవి. శ్రీరామ నవమి, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు కాలినడకన, ఎడ్లబండ్లపై యాత్రికులు వచ్చేవారు.
ప్రారంభానికి ముందు వంతెన
భద్రాచలం, భద్రాచలం పట్టణం, న్యూస్టుడే: ఒకప్పుడు భద్రాచలం దండకారణ్యం.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఉండేవి. శ్రీరామ నవమి, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు కాలినడకన, ఎడ్లబండ్లపై యాత్రికులు వచ్చేవారు. సారపాక వైపు గోదావరి అడ్డుగా ఉండటంతో పడవల సాయంతో రేవు దాటి భద్రాచలం చేరుకునేవారు. ఏడు దశాబ్దాల క్రితం రెండు భారీ పడవలు నదిలో ఢీకొనటంతో పెను ప్రమాదం సంభవించింది. వందల సంఖ్యలో జలసమాధి అయ్యారు. ఈ ఘటనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి 1959లో సుమారు రూ.70లక్షలు వెచ్చించి ఇక్కడ వంతెన నిర్మించటంతో రవాణా సదుపాయాలు మెరుగుపడ్డాయి. భక్తుల తాకిడి అధికమైంది. నదిలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పోయింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. 2022 జులైలో వచ్చిన వరదల తరుణంలో కొద్దిరోజుల పాటు వంతెనపై రాకపోకలు ఆగటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమస్యను ముందే గుర్తించిన ఉన్నతాధికారులు రెండో వంతెన నిర్మాణానికి దశాబ్దం క్రితమే ప్రతిపాదనలు రూపొందించారు.
మంత్రి తుమ్మల చొరవ..
ప్రస్తుతం వన్వే విధానంలో రెండో వంతెన అందుబాటులోకి వచ్చింది. భద్రాచలం నుంచి సారపాక వైపు పాత వంతెన మీదుగా వెళ్తుండగా.. సారపాక వైపు నుంచి రెండో వంతెన మీదుగా భద్రాచలం వస్తారు. రూ.98.45 కోట్లతో టెండర్లు పిలవగా రూ.65 కోట్లకు సదరు కంపెనీ హక్కులు దక్కించుకుంది. కొంత పని ప్రారంభమయ్యాక పిల్లర్ కూలటంతో తొలగించి మళ్లీ నిర్మించింది. గెడ్డర్ విరిగిపోవటంతో కొత్తగా తయారు చేయించింది. ఈ పరిస్థితిలో అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి చేయలేకపోయింది. మంత్రి తుమ్మల నాగేళ్వరరావు గతంలో వంతెనకు శంకుస్థాపన చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఆయన మంత్రి పదవి చేపట్టడంతో పనులను నిరంతరం పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో నవమికి రెండో వంతెన అందుబాటులోకి రావటం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది: కేసీఆర్
[ 29-04-2024]
కాంగ్రెస్, భాజపాకు ఓట్లు.. సీట్లు కావాలి కానీ, ప్రజా సమస్యలు పట్టవని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
బాధితుడికి ఆర్థిక సహాయం
[ 29-04-2024]
కామేపల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన కామ రాంబాబు కొద్ది రోజుల నుంచితీవ్రమైన జ్వరం, కామెర్ల వ్యాధితో బాధపడుతున్నాడు. -
భారాస హయాంలో అన్ని రంగాల్లోనూ అవినీతే: జేపీ నడ్డా
[ 29-04-2024]
దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ భాజపాయేనని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. -
ఇల్లందులో రూ.1.5 లక్షల నగదు పట్టివేత
[ 29-04-2024]
ఇల్లందు - ఖమ్మం రహదారిపై లలితాపురం చెక్పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. -
మూడు నెలలు ముహూర్తాలే లేవు!
[ 29-04-2024]
రానున్న మూడు నెలల పాటు శుభ ముహూర్తాలు లేవని వేద పండితులు చెబుతున్నారు. మూఢాల కారణంగా వివాహాది శుభకార్యాలు, నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు, శంకుస్థాపనలు వంటి శుభ కార్యక్రమాలను జరపడం కుదరదని చెబుతున్నారు. -
ప్రచారం ఉద్ధృతం
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో మళ్లీ పాగా వేయాలని భారాస సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత: నామా
[ 29-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నారాయణపురంలో ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. -
రాహుల్గాంధీని ప్రధాని చేయటమే లక్ష్యం: పొంగులేటి
[ 29-04-2024]
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని ప్రధాని చేయటమే లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మారేదెన్నడు.. అగ్గి ఆరేదెన్నడు?
[ 29-04-2024]
వేసవి అనగానే మనల్ని కలవరపెట్టేది అగ్ని ప్రమాదాలు. నిప్పు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో దాని వినియోగంలో ఏమరపాటు అంతే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. -
3న నామినేషన్ వేస్తా: తీన్మార్ మల్లన్న
[ 29-04-2024]
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) ఖమ్మంలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. -
చుకుబుకు రైలు.. గుండెల్లో గుబులు
[ 29-04-2024]
తెలంగాణలో రైల్వే అభివృద్ధికి దక్షిణ మధ్య రైల్వే చేపడుతున్న ఏర్పాట్లు జిల్లా రైతుల్లో ఆందోళనకు కారణమైంది. -
బాధితులకు భరోసా.. పోక్సో ఈ బాక్స్
[ 29-04-2024]
నిత్యం ఎక్కడో ఓ చోట బాలికలు, అభంశుభం తెలియని చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. -
తలరాతను మార్చే ఓట్లు తరలిపాయె..!
[ 29-04-2024]
రెండు లోక్సభ స్థానాల్లో తలరాతలను మార్చే కీలక ఓటు బ్యాంకు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు తరలిపోయింది. విభజన సమయంలో మిగతా నియోజకవర్గాల ఓట్లు, సీట్లుపై స్పష్టత ఉన్నప్పటికీ ఐదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఏపీకి వెళ్లాయి. -
టీటీలో జిల్లా మేటి!
[ 29-04-2024]
క్రీడా పోటీలు ఎప్పుడు ఎక్కడ జరిగినా ఆ ప్రాంతంలో ఆయా క్రీడాంశంలో ఉన్న స్థితిగతుల్ని వివరిస్తుంది. ఆ అంశంలో సాధన చేస్తున్న క్రీడాకారుల ప్రతిభా పాటవాలు ఏ దశలో ఉన్నాయనే విషయాలను తేటతెల్లం చేస్తాయి. -
కిరాణా కొట్లలో మద్యం విక్రయాలు
[ 29-04-2024]
ఖమ్మం కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఓ కిరాణా దుకాణంలో మద్యం సీసాలు దొరికాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందు ఈ ప్రాంతంలో నాలుగు బెల్ట్ దుకాణాలు ఉండేవి. -
ధర బాగుంది.. ధాన్యం బయటే అమ్మేద్దాం!
[ 29-04-2024]
యాసంగిలో వరి అత్యధిక విస్తీర్ణం సాగైన జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం ఒకటి. ప్రాజెక్టులు, ప్రధాన చెరువులు, వాగులు, గొట్టపు బావుల కింద సుమారు 60 వేల ఎకరాల్లో నాట్లు వేశారు. -
భారాస పదేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలే: రఘురాంరెడ్డి
[ 29-04-2024]
పదేళ్ల భారాస పాలన వైఫల్యాలమయం అని ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఎద్దేవా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!