Tadipatri: తాడిపత్రి ముఠా తప్పుడు పనులు
డోన్ మండలం కొత్తకోట పరిధిలో ఎన్హెచ్-44 రహదారికి ఆనుకుని 21 సెంట్లు మిగులు భూమిగా ఉంది. ఇది ఆర్యవైశ్యులకు చెందినది కావడం..
ఎన్హెచ్-44 వెంట ఖాళీ స్థలాలపై కన్ను
నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్
న్యూస్టుడే, డోన్, ప్యాపిలి
డోన్ మండలం కొత్తకోట పరిధిలో ఎన్హెచ్-44 రహదారికి ఆనుకుని 21 సెంట్లు మిగులు భూమిగా ఉంది. ఇది ఆర్యవైశ్యులకు చెందినది కావడం.. ఈ భూమిని పక్కనే ఆంజనేయస్వామి ఆలయం ఉండటంతో నిర్వాహకులు వివిధ కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారు. దీనిపై కన్నేసిన తాడిపత్రికి చెందిన కొందరు ఆ గ్రామ కార్యదర్శి శివారెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి దొంగపత్రా(యాజమాన్య)లు సృష్టించారు. దర్జాగా ప్యాపిలి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించేశారు. రూ.40 లక్షల విలువైన స్థలాన్ని సొంతం చేసుకున్నారు. తన సంతకం ఫోర్జరీ చేశారు.. రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరుతూ కార్యదర్శి రిజిస్ట్రార్కు విన్నవించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా వెళ్తున్న హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారి ఇరువైపులా ఖాళీ స్థలాలపై అనంతపురం జిల్లా తాడిపత్రి ముఠా కన్నేసింది. తప్పుడు పత్రాలు సృష్టించి విలువైన భూములను కాజేస్తున్నారు.
రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని రిజిస్ట్రార్కు రాసిన వినతిపత్రం
జాతీయ రహదారి ఎన్హెచ్-44 ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు మండలం పంచలింగాలలో ప్రారంభమై ప్యాపిలి మండలం పోదొడ్డిలో ముగుస్తుంది. 80 కి.మీ మేర విస్తరించిన రహదారి కర్నూలు, కల్లూరు, కృష్ణగిరి, వెల్దుర్తి, డోన్, ప్యాపిలి మండలాల మీదుగా వెళ్తోంది. 2009లో నాలుగు వరుసలుగా విస్తరించారు. హైదరాబాద్- బెంగళూరు ప్రధాన రహదారి కావడంతో వెళ్లే వాహనాల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అన్ని కలిపి నిత్యం పదివేల వరకు వాహనాలు వెళ్తున్నాయి. ఇందులో సరకు రవాణా, కార్లు ఎక్కువగా ఉన్నాయి.
అధికారుల సహకారం
జాతీయ రహదారి-44కి ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాల వివరాలు మీ-భూమి పోర్టల్లో చూసి సేకరిస్తున్నారు. తర్వాత రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి ఆక్రమణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఖాళీ స్థలాల యజమానుల పేర్లతో నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. వాటిపై ఆయా గ్రామాల కార్యదర్శుల సంతకాలు ఫోర్జరీ చేస్తున్నారు. అన్ని డాక్యుమెంట్లు పూర్తి చేసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇందుకు ప్యాపిలి రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది సహకరిస్తున్నట్లు సమాచారం. రూ.లక్షల విలువైన భూమిని మొదట తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాత ఇతరులకు అంటగట్టేస్తున్నారు.
ధరలు పెరగడంతో
వాహనాల సంఖ్య పెరగడంతో ఎన్హెచ్-44ను ఆరు వరుసల రహదారిగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. ఇటీవల సర్వే చేపట్టారు. దీంతో రహదారికి ఇరువైపులా ఉన్న భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎకరా రూ.70 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు సుదూరం కావడంతో వాహనదారులు దారి మధ్య భోజనం, ఇతర అవసరాలకు దాబాలు, హోటళ్లను ఆశ్రయిస్తుంటారు. వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పెట్రోల్ బంక్లు, ఫంచర్ దుకాణాలు వెలుస్తున్నాయి. గిరాకీ బాగుండటంతో వీటి ఏర్పాటుకు చాలా మంది ముందుకొస్తున్నారు. సెంటు కన్నా తక్కువ స్థలం ఉన్నా సరిపోతుంది. ఖాళీ స్థలాలకు డిమాండ్ పెరగడంతో తాడిపత్రికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి తప్పుడు పత్రాలు సృష్టించి కాజేస్తున్నారు.
ప్యాపిలి మండలం వెంగళాంపల్లెకు చెందిన బోయపాటి జయశీల, బోయపాటి హేమ లతలకు సర్వే నంబరు-144-1ఏ, 1బి, 144-2ఏ, 2బి, 156, 157-2ఏలలో 13 ఎకరాలు ఉంది. కొంతభాగాన్ని హైదరాబాద్కు చెందిన ఓ సంస్థకు విక్రయించగా, 16 సెంట్లు ఉంచుకున్నారు. ఇక్కడ రస్తా కోసం కొంత భూమిని వదిలారు. రూ.లక్షల విలువైన దీనిపై తాడిపత్రి ముఠా ఓ కన్నేసింది. కార్యదర్శి మంజుల సంతకాన్ని ఫోర్జరీ చేసి 8 సెంట్ల చొప్పున ఓ మహిళ పేరిట ఉన్నట్లు దొంగ పత్రాల్ని తయారు చేయించారు. ఆమె మరో వ్యక్తికి మూడు సెంట్ల చొప్పున అమ్మేసింది. యజమానులకు ఈ విషయం తెలియడంతో కార్యదర్శిని ప్రశ్నించగా, సంతకం ఫోర్జరీ అయినట్లు గుర్తించి ఠాణాలో ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ‘మేటి’.. ఉపాధి లూటీ
[ 28-04-2024]
పేదల కడుపు నింపేందుకు రూపొందించిన ఉపాధి హామీ పథకం పెద్దలకు వరంలా మారింది. కూలీల కడుపుకొట్టి అధికార పార్టీ గ్రామ నాయకుల జేబులు నింపుకొంటున్నారు. -
‘పశ్చిమ’ రైతుకు జగన్ ఉరి
[ 28-04-2024]
నిత్యం కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రాంత పల్లెలను సస్యశ్యామలం చేసేందుకు 2003లో తెదేపా ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి బీవీ మోహన్రెడ్డి రూ.177 కోట్లతో గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. -
‘అధికారం’లో విభేదాల మంట
[ 28-04-2024]
కోడుమూరు నియోజకవర్గంలో అధికార పార్టీ వైకాపాలో విభేదాలు తారస్థాయికి చేరాయి.. ఏకంగా పార్టీ జెండాలను తగలబెడుతున్నారు.. గూడూరు మండలం ఆర్.కానాపురంలో సర్పంచి మునిస్వామి వర్గీయులు, జడ్పీటీసీ సభ్యుడు వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
జగనన్న పాలన.. అంగన్వాడీల వేదన
[ 28-04-2024]
తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.4500 తర్వాత రూ.7వేలు ఆ తర్వాత రూ.10,500లకు పెంచారు. -
రూ.50.13 లక్షల విలువ చేసే బంగారం సీజ్
[ 28-04-2024]
ఆదోని పట్టణంలో ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేకుండా బంగారు ఆభరణాలను తరలిస్తున్న ముంబయికి చెందిన వ్యక్తిని శనివారం రాత్రి అదుపులోకి తీసుకొని ఆభరణాలు సీజ్ చేసినట్లు శిక్షణ డీఎస్పీ ధీరజ్, సీఐ తేజమూర్తి తెలిపారు. -
పెత్తందారీ పాలనలో రాష్ట్రం నాశనం
[ 28-04-2024]
పెత్తందారీ పాలనలో రాష్ట్రం పూర్తిగా నాశనమైందని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ ఆరోపించారు. -
వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వం మరోసారి వచ్చిందంటే అరాచక పాలనే ఉంటుందని కర్నూలు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. -
తెదేపాతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యం
[ 28-04-2024]
తెదేపాతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యమని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. -
రాష్ట్ర భవిష్యత్తుకు ఆలోచించి ఓటెయ్యండి
[ 28-04-2024]
జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని ఎమ్మిగనూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. -
రాష్ట్రంలో కూటమి అభ్యర్థులదే విజయం
[ 28-04-2024]
ఏపీలో తెదేపా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. -
బాబు పర్యటనను విజయవంతం చేయండి
[ 28-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ కర్నూలు జిల్లా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి పిలుపునిచ్చారు. -
ఘాట్ రోడ్డుకు ‘జగన్’ గండం
[ 28-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు రాష్ట్ర రాజధానికి వెళ్లాలంటే కర్నూలు- గుంటూరు రహదారే కీలకం. ఇది నల్లమల మీదుగా వెళ్తోంది. -
‘ఆమె’ చేతిలో గెలుపు
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది.. తుది జాబితాను ఎన్నికల సంఘం ఈనెల 25న విడుదల చేసింది. -
బుగ్గన నామినేషన్ ఆమోదంపై న్యాయపోరాటం చేస్తాం: తెదేపా
[ 28-04-2024]
బుగ్గన నామినేషన్ ఆమోదంపై న్యాయపోరాటం చేస్తామని తెదేపా లీగల్సెల్న్యాయవాదులు శ్రీనివాసభట్టు, కోట్లహరిశ్చంద్రారెడ్డి, నాగేశ్వరరావుయాదవ్, శ్రీనివాసులు పేర్కొన్నారు. -
ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు
[ 28-04-2024]
ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనకూడదని నిబంధన ఉన్నా కొందరూ యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘించి వైకాపా ప్రచారంలో పాల్గొంటున్నారు. -
నేడు చంద్రబాబు రాక
[ 28-04-2024]
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించనున్నారు. -
‘ఏక’స్వామ్య కోటకు బీటలు
[ 28-04-2024]
అవుకు మండలంలో కాటసాని, చల్లా కోటకు బీటలు పడ్డాయి.. 50 ఏళ్ల తర్వాత అక్కడ తెదేపా ప్రచారానికి శ్రీకారం చుట్టింది.. ఆయా గ్రామాల్లో తెదేపా జెండాలు రెపరెపలాడుతున్నాయి. -
యువ ఓటర్లకు బహుమతి
[ 28-04-2024]
ఓటు హక్కు విలువను తెలియజేస్తూ 30 సెక్షన్ల నివిడి గల వీడియోను తయారు చేసి జిల్లా స్వీప్ నోడల్ అధికారికి మెయిల్...
తాజా వార్తలు (Latest News)
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!