logo

ఎన్నికల విధులపై అలసత్వం వద్దు

ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది అలసత్వం లేకుండా అప్రమత్తతతో విధులు నిర్వహించాలన్నారు.

Published : 28 Mar 2024 19:56 IST

గోనెగండ్ల: ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది అలసత్వం లేకుండా అప్రమత్తతతో విధులు నిర్వహించాలన్నారు. ఈమేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి అధికారులకు సూచించారు. గోనెగండ్లలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశంలో ఎన్నికల సెక్టోరియల్ అధికారులు, బీఎల్వోలు, సంబంధిత సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధులను అధికారులు, సిబ్బంది జాగ్రత్తతో నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పార్వతి, ఎంపీడీవో సోనీ బాయి, ఆర్ఐ సుబ్బారెడ్డి, బీఎల్వోలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని