logo

స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదే

స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిదేనని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు

Published : 29 Mar 2024 06:10 IST

మాట్లాడుతున్న మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి

మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిదేనని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు. మంత్రాలయం మండలం మాధవరంలో గురువారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాక ముందు మద్యపానం నిషేదం చేస్తామని చెప్పి జే బ్రాండ్స్‌ తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను తీస్తున్న జగన్‌కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. విద్యుత్తు బిల్లులు పూర్తిగా తగ్గిస్తానని చెప్పి పలుమార్లు పెంచి ప్రజలపై భారం మోపారని ధ్వజమెత్తారు. మాట తప్పిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని