నియంత్రణలోనే క్షయ
ఉమ్మడి జిల్లాలో క్షయ (టీబీ) నియంత్రణలో ఉంది. ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రెండు జిల్లాల్లో క్రమంగా తగ్గుతుండగా.. మూడు జిల్లాల్లో మాత్రం నిలకడగా ఉంది.
న్యూస్టుడే, పాలమూరు: ఉమ్మడి జిల్లాలో క్షయ (టీబీ) నియంత్రణలో ఉంది. ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రెండు జిల్లాల్లో క్రమంగా తగ్గుతుండగా.. మూడు జిల్లాల్లో మాత్రం నిలకడగా ఉంది. మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో గుర్తించిన రోగుల సంఖ్య తక్కువగా ఉండగా, నాగర్కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం కంటే ఎక్కువ మందిని గుర్తించారు. గత మూడేళ్ల క్రితంతో పోలిస్తే క్షయ బారిన పడుతున్నవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికి తిరిగి క్షయ అనుమానితులను గుర్తించి వారికి పరీక్షలు చేస్తున్నారు. ఈ ఏడాది జవనరిలో అనుమానితులకు ఎక్స్రే, తెమడ పరీక్షలు నిర్వహించగా.. చాలా తక్కువ మందికి మాత్రమే నిర్ధారణ అయిది. వివిధ జబ్బులతో పీహెచ్సీలకు వచ్చేవారిలో కూడా ఎవరికైనా లక్షణాలు కనిపించినా క్షయ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. శుక్రవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
ప్రత్యేక ఆసుపత్రులు..
ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్, కోయిలకొండ, బాదేపల్లి, భూత్పూర్, నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వనపర్తి, ఆత్మకూరు కొత్తకోట, గద్వాల, అయిజ, అలంపూర్, నారాయణపేట, కోస్గి, మక్తల్ తదితర ప్రాంతాల్లో క్షయ రోగులకు ప్రత్యేక ఆసుపత్రులు ఉన్నాయి. ఒక్కోచోట ఇద్దరు వైద్య సిబ్బంది ఉండి సేవలు అందిస్తున్నారు. వారిలో సీనియర్లు చికిత్స అందించే పర్యవేక్షకులు, మరొకరు ల్యాబ్ పర్యవేక్షకులు ఉంటున్నారు. వారు ప్రతిరోజు అనుమానితులకు క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, వ్యాధి ఉన్నట్లు తేలినవారికి మందులు అందిస్తున్నారు. రోగులకు బలవర్ధక ఆహారం కోసం ప్రభుత్వం తరఫున నెలకు రూ.500 చొప్పున ఆరు నెలల పాటు వారికి ఆర్థిక సాయం కూడా అందిస్తారు. గతంలో సరైన చికిత్స లేక క్షయ బాధితులు కోలుకోలేక మృత్యువాత పడేవారు. ఇప్పుడు ఆధునిక చికిత్సా విధానం, మంచి మందులు అందుబాటులో ఉండటంతో క్షయ ప్రాణాంతకం కాదని వైద్యులు ధైర్యం చెబుతున్నారు. బాధితులు ఆరు నెలల నుంచి ఏడాది పాటు క్రమం తప్పక మందులు వాడితే వ్యాధి పూర్తిగా నయమవుతుందని అంటున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో మూడేళ్ల కిందట 2,130 మంది క్షయ బాధితులు ఉంటే.. ఇప్పుడు వారి సంఖ్య 1,870కి పడిపోయింది.
రోగులకు మందులు ఇస్తున్న జిల్లా టీబీ నిర్మూలన అధికారి డా.రఫిక్ తదితరులు
గాలి ద్వారా ఒకరినుంచి మరొకరికి..
క్షయ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. రోగులు దగ్గినా, తుమ్మినా ఆ తుంపర్లలో బ్యాక్టీరియా గాలి ద్వారా ఇతరులకు వ్యాపించి టీబీ సోకుతుందని అంటున్నారు. ఇంట్లో ఎవరికైనా వ్యాధి నిర్ధారణ అయితే.. వారిని వేరే గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గతంలో ఆసుపత్రుల్లో పెట్టి ప్రత్యేకంగా చికిత్స చేసేవారు. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యుల సంరక్షణలోనే వైద్య సేవలను అందిస్తున్నారు. ప్రతిరోజూ వారికి బలవర్ధకమైన ఆహారం, వేళకు మందులు అందిస్తే త్వరగా కొలుకొని సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధి ఉన్నవారు మద్యం, పొగతాగడం పూర్తిగా మానేయాలని చెబుతున్నారు.
ఈ లక్షణాలు ఉంటే..
* పది రోజులకు మించి జ్వరం వస్తుండటం, 15 రోజులైనా దగ్గు తగ్గకపోవడం, ఎక్కువగా చెమట పట్టడం, బరువు తగ్గుతుండటం తదితర లక్షణాలు ఉంటే క్షయ అనుమానితులుగా భావిస్తున్నారు. అలాంటి వారు సమీపంలోని టీబీ ఆసుపత్రికి వెళ్లి ఎక్స్రే తీయించుకోవడం, తెమడ, సిబినాయట్, ట్రూనాయట్ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే మందులు వాడాలని అంటున్నారు.
మహబూబ్నగర్ : క్షయ నిర్ధారణ పరీక్షల కోసం సేకరించిన నమూనాలు
నిరంతర పర్యవేక్షణ...
- డా.రఫిక్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి, మహబూబ్నగర్
క్షయను నియంత్రించడానికి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. గ్రామాలు, పట్టణాలు తదితర ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ప్రతి రోజూ అనుమానితులను గుర్తించి వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నాం. రోగులకు ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటికి వెళ్లి మందులు అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం క్షయ క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూరీడు చిన్నబోయేలా ఓటెత్తాలి?
[ 07-05-2024]
పాలమూరులో ఎండలు మండిపోతున్నాయి. ప్రతి రోజు సగటున గరిష్ఠంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇప్పట్లో ఎండలు తగ్గేలా లేవు. మరోవారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. -
నిలిచిన ఈఎస్ఐ వైద్యసేవలు
[ 07-05-2024]
మహబూబ్నగర్ పట్టణం ఏనుగొండలోని ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) ఆసుపత్రికి తాళం పడింది. ప్రభుత్వం అద్దె బకాయిలు మంజూరు చేయడం లేదని భవనం యజమాని ఆసుపత్రికి తాళం వేయటంతో వైద్యసేవలు నిలిచిపోయాయి. -
మరో రెండు రోజులు కొనుగోళ్లు బంద్
[ 07-05-2024]
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు అమ్మకానికి వారం రోజులుగా భారీగా ధాన్యం వస్తోంది. సోమవారం 700 మంది రైతులు వివిధ పంటలు 17,233 క్వింటాళ్లు తీసుకురావడంతో మార్కెట్ యార్డు మొత్తం నిండిపోయింది. -
ప్రజలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం
[ 07-05-2024]
తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలను వంచించిందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కరసింగ్ ధామి ఆరోపించారు. -
నల్లమలలో వన్యప్రాణులకు ఆపద
[ 07-05-2024]
సాంకేతికత అభివృద్ధి.. కొన్నింటికి ప్రమాదకరంగా మారాయి. ప్రధానంగా నల్లమల అడవిలో, కృష్ణాతీరంలో వన్యప్రాణులకు, వివిధ రకాల చెట్ల జాతులకు ఆపద వచ్చింది. -
ఉల్లి రైతుకు కన్నీరు
[ 07-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లి ధరలు తగ్గటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజురోజుకు మార్కెట్లో ఉల్లి ధరలు పడిపోతుండటంతో రైతులకు పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. -
గెలిస్తే చాలు.. వసతులు వేలు
[ 07-05-2024]
ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తోంది? వారికి వచ్చే నిధుల సంగతేంటి? అనే విషయాలను తెలుసుకుందాం.! -
అప్పుడు అవినీతిపరుడు.. ఇప్పుడు ఆదర్శప్రాయుడా?
[ 07-05-2024]
కొద్ది నెలల క్రితం రాష్ట్రానికి వచ్చినప్పుడు మాజీ ఐపీఎస్ అధికారి అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రూ. 1.20 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ.. ఆయన కుమార్తెపై అవినీతి ఆరోపణలు ఉన్నందున వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
మద్యం మత్తులో భర్తపై గొడ్డలితో దాడి
[ 07-05-2024]
మద్యం మత్తులో భర్తపై గొడ్డలితో దాడిచేసి హతమార్చిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన భార్య, భర్తలు లక్ష్మి, నాగయ్య వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. -
గర్భంలోనే శిశువు మృతి
[ 07-05-2024]
నెలలు నిండిన మగబిడ్డ గర్భంలోనే తనువు చాలించాడ]ని తెలిసి ఆ కన్నతల్లి కడుపుకోతతో విలవిలలాడింది. విషాదభరితమైన ఈ సంఘటన గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. -
చెలమ నీరే దిక్కు
[ 07-05-2024]
మిషన్ భగీరథ నీరు అరకొరగా రావడం, స్థానిక నీరు అపరిశుభ్రంగా వస్తుండటంతో మండలంలోని తుమ్మిళ్ల గ్రామంలో చాలా మంది ప్రజలకు చెలమల నీరే ఆధారమైంది. -
అందరికీ పోస్టల్ బ్యాలెట్
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. -
పకడ్బందీగా పోలింగ్ నిర్వహించాలి
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. -
భారాస, భాజపా నిరుపేదల ద్రోహులు
[ 07-05-2024]
భారాస, భాజపా నాయకులు నిరుపేద ద్రోహులని పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. చర్లపల్లి, హన్మాన్పల్లి, కొండాపూర్, కిష్టాపూర్, రాంకిష్టాయపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్నికరెడ్డితో కలిసి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
[ 07-05-2024]
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులకు షీటీం పోలీసులు పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
భారాస కనుమరుగు కావడం ఖాయం
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో భారాస కనుమరుగు కావడం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన మండలంలోని తెల్లరాళ్లపల్లితండా, రేమద్దుల, బుసిరెడ్డిపల్లి గ్రామాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. -
సీఎంఆర్ బియ్యం సమకూరేనా?
[ 07-05-2024]
మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యానికి ప్రభుత్వం ఎన్నో సార్లు గడువు పెంచినా.. వారిలో మాత్రం చలనం రావడం లేదు. -
భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదం
[ 07-05-2024]
కేంద్రంలో భాజపా మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదమని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.