నకిలీల నివారణకు నిరంతర నిఘా
వ్యవసాయ సీజన్ ఆరంభం కానుండటంతో కల్తీ ఎరువులు, విత్తనాలు, మందుల విక్రయాలను అరికట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు.
ఎరువుల దుకాణాల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలు
పెద్దకొత్తపల్లిలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు, పోలీసులు
కొల్లాపూర్ గ్రామీణం, న్యూస్టుడే : వ్యవసాయ సీజన్ ఆరంభం కానుండటంతో కల్తీ ఎరువులు, విత్తనాలు, మందుల విక్రయాలను అరికట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఖరీఫ్ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులతో కలిసి జిల్లావ్యాప్తంగా ఎరువులు, మందుల దుకాణాల్లో దాడులు, తనిఖీలు చేపడుతున్నారు. చాలా మండలాల్లో ధరల నియంత్రణ జరగడం లేదని అధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. దుకాణాల వద్ద ఎప్పటికప్పుడు ధరల పట్టిక ప్రదర్శించకపోగా, ఈ-పాస్ యంత్రాల ద్వారా విక్రయాలు జరగడం లేదన్న ఆరోపణలు ఉంటున్నాయి. పురుగు మందుల విక్రయాల్లో నిబంధనలు పాటించడం లేదని వ్యవసాయశాఖ అధికారులు గుర్తించి నోటీసులు సైతం ఇస్తున్నారు.
ఈసారైనా అమలయ్యేనా..
జిల్లాలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల దుకాణాలు విరివిగా వెలిశాయి. మానవ ఆరోగ్యానికి వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఎలాగో అవసరంలేని మందులు, ఎరువుల వాడకాన్ని నియంత్రించి, రైతులకు ఆర్థిక భారం తగ్గించేందుకు చీటీ విధానాన్ని ప్రభుత్వం మూడేళ్ల క్రితమే అమలుచేయాలని సూచించింది. అయినప్పటికీ ఎక్కడా ఈ విధానం అమలులోకి నోచుకోలేదు. అధికారులు కూడా ఉదాసీనత ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. దీంతో నకిలీ మందులు, ఎరువుల విక్రయాలు ఏటా వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు రైతులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. లైసెన్స్డ్, పీవోఎస్ యంత్రాల లావాదేవీలు నిర్వహించే గుర్తింపుఉన్న దుకాణాలనుంచే నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తేనే ప్రయోజనం నెరవేరనుంది. ఇప్పటి వరకు జిల్లాలో పీవోఎస్ యంత్రాలను సంబంధిత డీలర్లకు అందజేసినా సరిగా వినియోగించడం లేదన్న ఆరోపణలు ఉంటున్నాయి. దీంతో నిజమైన రైతుల వివరాలు నమోదు కావడం లేదు.
పెద్ద గ్రామాల దుకాణాల్లోనూ..
మండలాల్లో పురుగు మందులు, ఎరువుల దుకాణాల తనిఖీలకు మండలస్థాయి టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశారు. వ్యవసాయాధికారి, ఎస్సై, తహసీల్దార్లతో కూడిన బృందం దుకాణాలను పరిశీలిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో సైతం ఏటా విక్రయాలు జరుగుతున్నాయి. వ్యవసాయాధికారులు కేవలం మండలకేంద్రాలలోనే తనిఖీలు చేపడుతున్నారని, పెద్ద గ్రామాల్లోనూ వెలిసిన ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో సైతం తనిఖీలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
కొనుగోలులో జాగ్రత్తలు తప్పనిసరి..
విత్తనాల కొనుగోలులో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రైవేటు విత్తన, పురుగు మందుల సంస్థల ప్రచారాలకు ఆకర్షితులు కాకుండా వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు విధిగా పాటించాలి. సరిగా సీల్ చేసి, ధ్రువీకరణ పత్రం ఉన్నబస్తాల్లోని విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. బస్తాపై లాట్ నంబరు, విత్తన రకం, గడువు తేదీ తదితర వివరాలను పరిశీలించాలి. ముందస్తుగా విత్తనాలు మొలకెత్తే శాతాన్ని విత్తనప్యాకెట్పై చూసుకుని పంటపొలాల్లో విత్తుకోవాలి. విత్తనం వేసిన తర్వాత విత్తన ప్యాకెట్ల ఖాళీ కవర్లు, రసీదులను భద్రపర్చాలి. కొనుగోలు బిల్లుపై నంబర్, విత్తన రకం, గడువు తేదీ రాయించుకుని డీలర్ సంతకాలు తీసుకోవాలి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ధ్రువీకరించిన విత్తనాల కొనుగోలు సమయంలో బస్తాపై నీటివర్ణం ట్యాగు పరిశీలించాలి. వ్యవసాయశాఖ అధికారులు సూచించిన పురుగు మందులను అవసరం మేర మాత్రమే కొనుగోలు చేసి పిచికారీ చేయాలి. లైసెన్సు లేని డీలర్లు పురుగుమందులు విక్రయిస్తుంటే సమీప వ్యవసాయఅధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లాలి.
బృందాలతో.. : ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించాం. ఇలా మండలానికి 5 నుంచి 8 మంది ఏఈవోలు, ఒక ఏవో పనిచేస్తున్నారు. అనుమతిలేని దుకాణాలు, కల్తీ, నకిలీ విత్తనాలు విక్రయించకుండా నిరంతరం నిఘాతోపాటు తనిఖీలు చేపడుతున్నాం. డీలర్లు పీవోఎస్ యంత్రాల ద్వారానే లావాదేవీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం.
వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూదరుల స్థావరంపై పోలీసుల దాడి
[ 07-05-2024]
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండిలోని జూదరుల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. -
ఎస్సీ వర్గీకరణ భాజపాతోనే సాధ్యం: మందకృష్ణ మాదిగ
[ 07-05-2024]
ఎస్సీ వర్గీకరణ భాజపా తోనే సాధ్యమవుతుందని, రానున్న లోక్సభ ఎన్నికల్లో పూర్తి మద్దతు తెలుపుదామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. -
ప్రజలకు భరోసా కల్పించేందుకు బలగాల కవాతు
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రశాంతంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవచ్చనే భరోసా కల్పించేందుకు కేంద్ర బలగాల కవాతు నిర్వహిస్తున్నట్లుగా ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు -
కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుద్దాం
[ 07-05-2024]
ఎన్నికల నేపథ్యంలో భాజపా, భారాస చెప్పే మాయమాటలు నమ్మొద్దని, ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపిద్దామని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలి
[ 07-05-2024]
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల సమీపంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారు ఢీకొని వెంకటాపూర్ గ్రామానికి చెందిన నరేష్, పరశురాములు మృతి చెందారు. -
భాజపా, కాంగ్రెస్ పోటా పోటీగా ఎన్నికల ప్రచారం
[ 07-05-2024]
రాజోలి మండలంలోని గ్రామాల్లో మంగళవారం భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
గ్రామాల్లో భారాస నాయకుల ఇంటింటి ప్రచారం
[ 07-05-2024]
మండలంలోని రాజోలి, మాన్ దొడ్డి గ్రామాల్లో భారాస నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
సూరీడు చిన్నబోయేలా ఓటెత్తాలి?
[ 07-05-2024]
పాలమూరులో ఎండలు మండిపోతున్నాయి. ప్రతి రోజు సగటున గరిష్ఠంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇప్పట్లో ఎండలు తగ్గేలా లేవు. మరోవారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. -
నిలిచిన ఈఎస్ఐ వైద్యసేవలు
[ 07-05-2024]
మహబూబ్నగర్ పట్టణం ఏనుగొండలోని ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) ఆసుపత్రికి తాళం పడింది. ప్రభుత్వం అద్దె బకాయిలు మంజూరు చేయడం లేదని భవనం యజమాని ఆసుపత్రికి తాళం వేయటంతో వైద్యసేవలు నిలిచిపోయాయి. -
మరో రెండు రోజులు కొనుగోళ్లు బంద్
[ 07-05-2024]
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు అమ్మకానికి వారం రోజులుగా భారీగా ధాన్యం వస్తోంది. సోమవారం 700 మంది రైతులు వివిధ పంటలు 17,233 క్వింటాళ్లు తీసుకురావడంతో మార్కెట్ యార్డు మొత్తం నిండిపోయింది. -
ప్రజలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం
[ 07-05-2024]
తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలను వంచించిందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కరసింగ్ ధామి ఆరోపించారు. -
నల్లమలలో వన్యప్రాణులకు ఆపద
[ 07-05-2024]
సాంకేతికత అభివృద్ధి.. కొన్నింటికి ప్రమాదకరంగా మారాయి. ప్రధానంగా నల్లమల అడవిలో, కృష్ణాతీరంలో వన్యప్రాణులకు, వివిధ రకాల చెట్ల జాతులకు ఆపద వచ్చింది. -
ఉల్లి రైతుకు కన్నీరు
[ 07-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లి ధరలు తగ్గటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజురోజుకు మార్కెట్లో ఉల్లి ధరలు పడిపోతుండటంతో రైతులకు పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. -
గెలిస్తే చాలు.. వసతులు వేలు
[ 07-05-2024]
ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తోంది? వారికి వచ్చే నిధుల సంగతేంటి? అనే విషయాలను తెలుసుకుందాం.! -
అప్పుడు అవినీతిపరుడు.. ఇప్పుడు ఆదర్శప్రాయుడా?
[ 07-05-2024]
కొద్ది నెలల క్రితం రాష్ట్రానికి వచ్చినప్పుడు మాజీ ఐపీఎస్ అధికారి అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రూ. 1.20 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ.. ఆయన కుమార్తెపై అవినీతి ఆరోపణలు ఉన్నందున వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
మద్యం మత్తులో భర్తపై గొడ్డలితో దాడి
[ 07-05-2024]
మద్యం మత్తులో భర్తపై గొడ్డలితో దాడిచేసి హతమార్చిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన భార్య, భర్తలు లక్ష్మి, నాగయ్య వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. -
గర్భంలోనే శిశువు మృతి
[ 07-05-2024]
నెలలు నిండిన మగబిడ్డ గర్భంలోనే తనువు చాలించాడ]ని తెలిసి ఆ కన్నతల్లి కడుపుకోతతో విలవిలలాడింది. విషాదభరితమైన ఈ సంఘటన గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. -
చెలమ నీరే దిక్కు
[ 07-05-2024]
మిషన్ భగీరథ నీరు అరకొరగా రావడం, స్థానిక నీరు అపరిశుభ్రంగా వస్తుండటంతో మండలంలోని తుమ్మిళ్ల గ్రామంలో చాలా మంది ప్రజలకు చెలమల నీరే ఆధారమైంది. -
అందరికీ పోస్టల్ బ్యాలెట్
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. -
పకడ్బందీగా పోలింగ్ నిర్వహించాలి
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. -
భారాస, భాజపా నిరుపేదల ద్రోహులు
[ 07-05-2024]
భారాస, భాజపా నాయకులు నిరుపేద ద్రోహులని పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. చర్లపల్లి, హన్మాన్పల్లి, కొండాపూర్, కిష్టాపూర్, రాంకిష్టాయపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్నికరెడ్డితో కలిసి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
[ 07-05-2024]
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులకు షీటీం పోలీసులు పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
భారాస కనుమరుగు కావడం ఖాయం
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో భారాస కనుమరుగు కావడం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన మండలంలోని తెల్లరాళ్లపల్లితండా, రేమద్దుల, బుసిరెడ్డిపల్లి గ్రామాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. -
సీఎంఆర్ బియ్యం సమకూరేనా?
[ 07-05-2024]
మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యానికి ప్రభుత్వం ఎన్నో సార్లు గడువు పెంచినా.. వారిలో మాత్రం చలనం రావడం లేదు. -
భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదం
[ 07-05-2024]
కేంద్రంలో భాజపా మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదమని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి