రామతత్వం నాయకత్వం
పాలన గురించి ప్రస్తావించినప్పుడు రామరాజ్యం పేరు రాకమానదు. ఎందుకంటే ఎన్ని కోణాల్లో చూసినా శ్రీరాముడు మంచి నాయకుడు.
కోస్గి, షాద్నగర్-న్యూస్టుడే: పాలన గురించి ప్రస్తావించినప్పుడు రామరాజ్యం పేరు రాకమానదు. ఎందుకంటే ఎన్ని కోణాల్లో చూసినా శ్రీరాముడు మంచి నాయకుడు. నవమి రోజున ఆ పాలకుడిలోని లక్షణాలు ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీచేస్తున్న నాయకులు కొంతైనా పుణికిపుచ్చుకోవాలి. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొందరు నాయకులు ప్రజలకు మంచి చేసి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాగే నేటి నాయకులూ రామచంద్ర ప్రభువు నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసుకుందాం.
ధర్మం, వినయం: శ్రీరాముడు ఎన్ని కష్టాలు ఎదురైనా ఏనాడూ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. వినయం ఆయన విజయంలో కీలకపాత్ర వహించింది. పెద్ద రాజ్యానికి రాజైనా ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోయేవారు. అహం అన్నది లేకుండా ఉండేవారు. వాలి బలవంతుడైనా సుగ్రీవునిని చేరదీశాడు. న్యాయం, ధర్మం ఉన్నవారికే మద్దతు అని చాటి చెప్పారు. ఉమ్మడి జిల్లాలో కొందరు నాయకులు పదవి ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరించి ఓటమి చెందడం మనం చూశాం.
నైపుణ్యాల వినియోగం: ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుంది. దాన్ని చక్కగా వినియోగించుకుంటేనే నాయకుడు విజయపథంలో పయనిస్తాడు. రామచంద్రుడు అలా పనులను విభజించబట్టే ఫలితం సాధించాడు. కొడుకు, సోదరుడు, భర్త, స్నేహితుడు, రాజు... ఇలా అన్ని పాత్రలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. శత్రువైన రావణుడు సోదరుడు విభీషణుడు రాముని మంచితనానికి దాసోహమయ్యాడు. అందరినీ కలుపుకుని పోయినప్పుడు నాయకులు రాణిస్తారనేది గుర్తించాలి.
భావవ్యక్తీకరణ: ఎలాంటి ప్రచార సాధనాలు లేని సమయంలో తన వారిని సమన్వయం చేసుకుంటూ సీతను వెతకడం, సుగ్రీవునితో స్నేహం, లంకకు చేరుకోవడం, పరిమిత వానర సైన్యంతో రావణయుద్ధం చేసి విజయం సాధించడం గొప్ప విషయం. మానవవనరుల సమర్థ వినియోగం, కిందవారిని నాయకులుగా తయారు చేయడంలో నాయకుడి విజయం ఆధారపడి ఉంటుందన్నది ఈ విషయం తెలియజేస్తుంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు, ప్రసార సాధనాలు విస్తృతమైనందున ప్రజలను చక్కగా ఆకట్టుకోవచ్చు.
ఆదర్శం: ఆడే మాటపై ఎరుక, పలికే పదం సత్యం, వ్యవహారంలో ఆదర్శం రాముడి లక్షణాలు. ప్రజాప్రతినిధి ఆదర్శప్రాయుడై ఉండాలి. ఆయన చర్యలు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఉమ్మడి జిల్లాలో కొందరు నాయకులు దశాబ్దాలు గడిచినా ప్రజల నోళ్లలో నానుతున్నారు. కొన్ని అభివృద్ధి పనుల పేరుచెబితే వారే గుర్తొచ్చేలా పాటుపడ్డారు. నాయకులు తమ హయాంలో ప్రజలపై బలమైన ముద్ర వేయాల్సి ఉంది.
వ్యూహం: రావణుడితో సాగిన హోరాహోరీ పోరులో ప్రశాంతంగా తన వ్యూహాలకు ప్రభువు పదునుపెట్టారు. ఎన్నికల సంగ్రామంలోనైనా, పనులను సాధించడంలోనైనా నాయకులకు కావలసినది చక్కని వ్యూహం. సమయానికి తగిన యుక్తి. ఆవేశ,కావేషాలకు గురైతే అసలుకే మోసం వస్తుంది.
నీతి, నిజాయతీ, క్రమశిక్షణ: ప్రతి పని నీతి, నిజాయతీ, క్రమశిక్షణతో పూర్తి చేశారు. పెద్దలను గౌరవిస్తూ, తల్లిదండ్రులతో పాటు ప్రజల మాటలకు ఎంతో విలువనిచ్చారు. నాయకులు ఆ విధంగా నిస్వార్థంతో వ్యవహరిస్తే ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజా మన్నన పొందుతారు.
సహనమే ప్రగతి: అందివచ్చిన రాజపదవి చేజారినా రాముడు ఎక్కడా కుంగిపోలేదు. కుటుంబ సమేతంగా 14 సంవత్సరాల అరణ్యవాసం చేశాడు. కష్టాలు అధిగమించి మళ్లీ రాజై మన్నన పొందారు. ప్రస్తుత నాయకులు అపజయం ఎదురైనా జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్లీ ప్రజామన్నన పొందేవరకు వేచిచూసే సహనం కొరవడుతోంది.
నిబద్దత: నాయకుడిగా ఎదగాలనుకునేవారు నిబద్ధతతో సేవచేయాలి. ప్రజాహితమే లక్ష్యంగా పనిచేయాలి తప్ప, రాగద్వేషాలకు తావివ్వకూడదు. ఓట్లేయలేదని కొన్ని గ్రామాల ప్రజలకు సౌకర్యాలు అందించకపోవడం వంటి దుర్గుణాలు ఉండకూడదు. ప్రత్యర్థిపై ద్వేషంతో అభివృద్ధిని అడ్డుకోవడం అన్యాయం. అభివృద్ధి పనుల్లో పర్సంటేజీలు తీసుకుంటూ పనుల్లో జాప్యం, నాణ్యత లోపంతో చేపట్టి ప్రజల ఉసురును పోసుకోకూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సార్వత్రికం... తీర్పు ప్రత్యేకం
[ 30-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో శాసనసభకు, పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటోంది. -
ప్రశ్నార్థకం.. జలాశయాల నిర్మాణం
[ 30-04-2024]
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణం 2007లో పునాది పడింది. 2012లో 50 శాతం పూర్తయి నీటి తోడిపోత మొదలై సాగునీరందింది. -
పాలమూరు పోరు @50
[ 30-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల లెక్క తేలింది. -
దృష్టి మరల్చేందుకే రిజర్వేషన్లపై దుష్ప్రచారం : అరుణ
[ 30-04-2024]
బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని భాజపాపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు. -
వనిత..కలత!
[ 30-04-2024]
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక ఓటర్లు అతివలే. పురుష ఓటర్ల కంటే వారు 1,13,920 మంది ఎక్కువగా ఉన్నారు. -
ఏ సభలో ఎంత మంది సభ్యులు?
[ 30-04-2024]
భారత పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి. దిగువ సభను లోక్సభ అంటారు. దీనినే ప్రజా ప్రతినిధుల సభ అని కూడా పిలుస్తారు. ఈ సభలో మొత్తం 552 మంది సభ్యులు ఉంటారు. -
కాంగ్రెస్వి మోసపూరిత హామీలు: భారాస
[ 30-04-2024]
రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్దానికి జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో పేదల సంక్షేమానికి పాటుపడిన కేసీఆర్ నాయకత్వంలోని భారాసను గెలిపించాలని పార్టీ నాగర్కర్నూల్ లోకసభ స్థానం అభ్యర్థి ప్రవీణ్కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
దశాబ్దాల కల నెరవేరదేమి?
[ 30-04-2024]
ఉమ్మడి జిల్లాలో కేంద్ర విద్యాలయాల ఏర్పాటుపై కొన్నేళ్లుగా వివక్ష కొనసాగుతోంది. కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయం, సైనిక స్కూళ్లకు మంచి డిమాండ్ ఉంది. -
మైలారం గుట్టపై తవ్వకాలకు ససేమిరా
[ 30-04-2024]
రాళ్లతో వ్యాపారం చేస్తూ రూ.కోట్లు గడిస్తున్న మైనింగ్ మాఫియా మైలారం గుట్టపై తవ్వకాలకు సిద్ధమైంది. గుట్టపై కన్నేసిన వ్యాపారులు 2017లోనే మైనింగ్, పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు 20 ఏళ్ల వరకు అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
గెలుపు ఖాయం.. భారీ మెజార్టీయే లక్ష్యం
[ 30-04-2024]
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా కావటంతో ఇక్కడి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి కృషిచేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సూచించారు. -
రక్తనిధి కేంద్రంలో... తగ్గుతున్న నిల్వలు
[ 30-04-2024]
పట్టణంలోని జనరల్ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో రోజు రోజుకు రక్తపు నిల్వలు తగ్గుతున్నాయి. అత్యవసర పరిస్థితిలో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పేదోళ్లు ఇంటర్ చదవద్దా?
[ 30-04-2024]
ఉమ్మడి పాలమూరులో వెనకబడిన జిల్లా నారాయణపేట. కార్మికులు, వలస కూలీల జిల్లాగా పేరుంది. -
ఇండియా కూటమిని గెలిపిద్దాం : మంత్రి జూపల్లి
[ 30-04-2024]
ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపిద్దామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. -
నాడు మామ.. నేడు అల్లుడు
[ 30-04-2024]
మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఆడబిడ్డ పోటీ చేస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని, ఓడించేందుకు నాడు మామ, నేడు అల్లుడు కుట్ర చేస్తున్నారని భాజపా లోక్సభ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
ఇథనాల్ పాపం భాజపా, భారాసలదే
[ 30-04-2024]
కేంద్రం, రాష్ట్రంలోని భాజపా, భారాస ప్రభుత్వాల అనుమతులతోనే మరికల్ మండలం చిత్తనూరు శివారులో అప్పట్లో ఇథనాల్ కంపెనీ ఏర్పాటైందని మహబూబ్నగర్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. -
రూ. 50 కోసం దుకాణాలకు నిప్పు
[ 30-04-2024]
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ పక్కన ఉన్న వీధి వ్యాపారుల షెడ్డులో డబ్బా దుకాణాలు దహనం చేసిన నిందితుడిని గుర్తించి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై గోవర్దన్ సోమవారం తెలిపారు. -
కస్తూర్బా విద్యాలయం సిబ్బందిపై వేటు
[ 30-04-2024]
కేజీబీవీలో నలుగురు సిబ్బందిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో ఇందిర ఉత్తర్వ్యులు జారీ చేశారు.