logo

ఇసుకను తరలిస్తున్న మినీ డీసీఎం పట్టివేత

తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మినీ డీసీఎంను పట్టుకొని కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు.

Published : 17 Apr 2024 17:38 IST

రాజోలి: తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మినీ డీసీఎంను పట్టుకొని కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు. రాజోలి గ్రామానికి చెందిన తిరుమలేశ్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాడు. ఇందులో భాగంగానే బుధవారం తెల్లవారుజామున కూడా ఇసుకను పీ.గార్లపాడు మీదుగా తరలిస్తున్నాడు. అయితే.. గస్తీ ముగించుకొని అటుగా వస్తున్న పోలీసు సిబ్బంది వాహనాన్ని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు