ఆర్థిక స్వావలంబన.. ఉపాధి కల్పన
ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. తమ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు మహిళలు.
చిట్యాల, నల్గొండ టౌన్, న్యూస్టుడే
దుస్తుల డిజైన్ కటింగ్లో మహిళలకు సలహాలిస్తున్న పాపని వనజ
చెవులు వినిపిస్తే మాటలొస్తాయి!
ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు ఎండీ హజ్రా. చిరుమర్తి గ్రామానికి చెందిన హైమత్పాషా, గౌస్యాభేగంల రెండో కుమార్తె. ప్రస్తుతం ఏడేళ్ల వయసున్న ఈ చిన్నారికి చిన్నప్పటి నుంచే చెవులు వినిపించవు, మాటలు రావు. తల్లిదండ్రులు ఆమె వైద్యం కోసం పలు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. రూ.లక్షకు పైగా ఖర్చు చేశారు. అయినా ఫలితం లేదు. ఇక చేసేదేమి లేక గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు. తల్లి తోడుగా పాఠశాలలో వదిలి వెళ్తుంది. మళ్లీ సాయంత్రం వచ్చి తీసుకెళ్తుంది. తండ్రి కూలి పనులు చేస్తుండగా.. తల్లి పూర్తిగా పిల్లల సంరక్షణలోనే ఉంటుంది. దివ్యాంగురాలి పింఛన్ కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసినా మంజూరు కాలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. అయితే హజ్రాను వైద్యులకు చూపించినపుడు ఆమెకు చెవులు వినిపిస్తే మాటలు వచ్చే అవకాశం ఉందని చెప్పారని వారు చెబుతున్నారు. ఇందుకు అవసరమైన శస్త్రచికిత్సతోపాటు అత్యాధునిక వినికిడి పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఇందుకు రూ.లక్షకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తెలిపారని, ప్రభుత్వంగానీ, దాతలుగానీ ముందుకొచ్చి చిన్నారికి బంగారు భవిష్యత్తు కల్పించాలని వేడుకుంటున్నారు. - మాడ్గులపల్లి, న్యూస్టుడే
ఆసరా లేక అనాథ
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
విధి ఆడిన వింత నాటకంలో ఆ చిన్నారి బలిపశువుగా మారింది. అభం శుభం తెలియని చిన్నారికి పెద్ద కష్టం వచ్చి పడిండి. తను పుట్టగానే ప్రమాదం రూపంలో వచ్చి మృత్యువు తండ్రి రాములును బలితీసుకుంది. ఆమె వయస్సు ఆరు నెలలున్నప్పుడు అనారోగ్యంతో తల్లి బుజ్జిని కోల్పోయి అనాథగా మారింది. దీనికి తోడు పుట్టుకతోనే కుడి చేయి లేకపోవడం, ఆలనాపాలనా చూసే దిక్కులేక నానా అవస్థలు పడింది. ఈ దీనగాథ కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మీపురం కాలనీకి చెందిన సంపంగి అనూషది. అప్పటి నుంచి మేనమామ ఇంట్లో పెరిగింది. వారిది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం కావడంతో కష్టపడుతూనే పెంచారు. చిన్నారికి ప్రస్తుతం పదేళ్లు. ఏమనుకుందో ఏమో మేనమామ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు.. పట్టణంలో యాచిస్తోంది. వారు ఉంటున్న ఇళ్లు సైతం ఇబ్బందిగా మారింది. చిన్నపాటి వర్షం వచ్చినా కురుస్తుంది. బాలిక దుస్థితిని చూసి స్థానికులు జాలిపడుతున్నా సాయం అందించే వారు లేరు. ప్రభుత్వ అధికారులు కనీసం ఆమెకు దివ్యాంగ పింఛను మంజూరు చేయాలని కోరుతున్నారు. దాతలు ఆపన్నహస్తం అందిస్తే తోటి విద్యార్థుల మాదిరిగానే చదువుకుంటానని ఆశగా చెబుతోంది. దాయార్థుల సాయం కోసం దీనంగా వేడుకుంటుంది ఆ చిన్నారి. - కోదాడ పట్టణం, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష
[ 08-05-2024]
పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు ఉండాలని, విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె.గంగాధర్ మండల అభివృద్ది అధికారులకు, పంచాయితీ సెక్రటరీలకు సూచించారు. -
పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలి: కలెక్టర్
[ 08-05-2024]
పోలింగ్ ప్రక్రియను నిశితంగా గమనించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. -
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి: కలెక్టర్
[ 08-05-2024]
ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్చాయుత వాతావరణంలో ప్రజలందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని, అందుకోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే అన్నారు. -
భాజపా కార్యర్తల ర్యాలీ
[ 08-05-2024]
భువనగిరి పార్లమెంట్ భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపును కాంక్షిస్తూ బుధవారం పట్టణంలో భాజపా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
[ 08-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో ఆటో డ్రైవర్ డ్రెస్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమారెడ్డి ప్రచారం నిర్వహించారు. -
హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి
[ 08-05-2024]
భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మార్నింగ్ వాకర్స్ను కలిసి మాట్లాడారు. -
సమీక్షిస్తూ.. సౌకర్యాలు ఆరా తీస్తూ..!
[ 08-05-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గరిష్ఠంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో.. లోక్సభ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి స్థానాల్లో పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచడానికి నల్గొండ, భువనగిరి అధికార యంత్రాంగాలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. -
ప్రైవేటు పనులకు.. ప్రభుత్వ పరికరాలు
[ 08-05-2024]
జిల్లాలోని విద్యుత్తు సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయి. ప్రైవేటు వ్యాపారులతో విద్యుత్తుశాఖ సిబ్బంది కుమ్మక్కవుతున్నారు. ప్రభుత్వ పరికరాలను నిబంధనలకు విరుద్ధంగా గుత్తేదారులకు అప్పగిస్తున్నారు. -
ఓటు వేసేందుకు గుర్తింపుకార్డు తప్పనిసరి
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డుతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి గుర్తుగా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. -
పార్టీలు చిన్నవైనా.. ప్రభావం పెద్దది
[ 08-05-2024]
గడిచిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు చిన్నవైనా ప్రభావం పెద్దగానే చూపిన ఘటనలున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేసిన వైనం లేకపోలేదు. -
గెలిస్తే ఐదేళ్లకు సరిపడా ప్రగతి ప్రణాళికలు
[ 08-05-2024]
‘ మాది ప్రజలకు సేవ చేసే కుటుంబం. 30 ఏళ్ల క్రితం జానారెడ్డి హయాంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మారుమూల ప్రాంతాలకు రహదారుల నిర్మాణం జరిగింది. ఇప్పుడు గెలిపిస్తే రానున్న ఎన్నికల్లో నేను చేసిన పనులు చేప్పే ఓట్లడుగుతాను. -
ఓటుకు సెలవివ్వొద్దు..!
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల హడావుడి ముమ్మరమైంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం వాడీవేడిగా జరుగుతోంది. ఓటుహక్కుపై అధికార యంత్రాంగం విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. -
విదేశాల్లో ఓటుహక్కు ఇలా..
[ 08-05-2024]
ఓటు హక్కు సద్వినియోగంపై ఎన్నికల సంఘం అధికారులు అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తున్నప్పటికీ పోలింగ్ శాతం పెంపు పూర్తిస్థాయిలో ఉండటం లేదు. -
26 రోజుల పోరాటం.. 22 రోజులకు ఫలితం
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల పాట్లు మామూలుగా లేవు. నెలన్నర పాటు ఎన్నికల ప్రక్రియ నడవడం వారికి పరీక్షా సమయంగా మారింది. -
చివరి భూములకూ సాగు నీరందిస్తాం: జానారెడ్డి
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి, కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పాలని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ముడిమళ్ల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో రోడ్షో, కార్నర్ సమావేశం నిర్వహించారు. -
సేవ చేద్దాం.. ఆనందాలు పంచుదాం!
[ 08-05-2024]
కరోనాకు ముందు రక్తదాన శిబిరం అంటే ‘రెడ్ క్రాస్’ సంస్థ ఆధ్వర్యంలోనే ఏర్పాటయ్యేవి. రక్తదాన శిబిరాల నుంచి వైద్య శిబిరాల వరకు పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ.. ఎందరో ప్రజల మనసుల్లో నాటుకుపోయిన రెడ్ క్రాస్ సంస్థను విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది. -
శోభాయమానం.. నవ నృసింహుల సాలహారం
[ 08-05-2024]
మట్టపల్లి క్షేత్రంలో నవ నృసింహుల దివ్య స్వరూపాలతో సాలహారం నిర్మించాలన్న భక్తుల చిరకాల స్వప్నం సాకారమైంది. ఇక్కడి రాజ గోపురానికి ఇరువైపులా ఉభయ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన తొమ్మిది నారసింహ క్షేత్రాల్లోని స్వయంభువులను ఆలయ ప్రాకారంలో తీర్థజనులు సందర్శించేలా తీర్చిదిద్దారు. -
అక్రమ రవాణాకు చెక్
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. అంతర్రాష్ట్ర, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న నగదు, విలువైన ఆభరణాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నారు. -
ఫిర్యాదు వచ్చిందా.. చిటికెలో పరిష్కారం
[ 08-05-2024]
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను విజయవంతం చేయడంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లు కీలకంగా పనిచేశాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినందుకు రాష్ట్ర స్థాయిలో అవార్డు సైతం అందుకున్నారు. -
వర్షాలకు రూ.80 లక్షల నష్టం: ఎస్ఈ
[ 08-05-2024]
అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్తు శాఖకు రూ.80 లక్షల వరకు నష్టం జరిగినట్లు ఆ శాఖ ఎస్ఈ పాల్రాజు తెలిపారు. -
నిత్య కల్యాణం.. క్షేత్ర పాలకుడికి ఆరాధన
[ 08-05-2024]
యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రంలో మంగళవారం నిత్య కల్యాణోత్సవం, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన కైంకర్యాలు రాత్రి నిర్వహించిన శయనోత్సవంతో ముగిశాయి. -
వారి భవిత రాసేది.. యువతే..!
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల్లో యువతే నిర్ణయాత్మక శక్తిగా మారనుంది. తమ రాతను ఎలా మార్చుకోవాలో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. -
వేసవి శిబిరం.. క్రీడలకు ఊతం
[ 08-05-2024]
వేసవి క్రీడా శిక్షణ కేంద్రాలు బాలలతో సందడిగా మారాయి. జిల్లా వ్యాప్తంగా పది కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో, బాల్ బ్యాడ్మింటన్, తైక్వాండో క్రీడల్లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్