సోదరుడి వరుస వ్యక్తితో కలిసి వివాహిత ఆత్మహత్య
వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో కలిసి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆ మహిళ ఇంట్లోనే ఇద్దరు వేర్వేరు గదుల్లో ఫ్యానుకు ఉరివేసుకొని బలవన్మరణాలకు పాల్పడ్డారు.
రాజేంద్రనగర్, న్యూస్టుడే: వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో కలిసి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆ మహిళ ఇంట్లోనే ఇద్దరు వేర్వేరు గదుల్లో ఫ్యానుకు ఉరివేసుకొని బలవన్మరణాలకు పాల్పడ్డారు. రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని హైదర్గూడ గుమ్మకొండకాలనీలో ఈ ఘటన వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు, బాధిత కుటుంబ సభ్యులు, తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కాసరాబాదుకు చెందిన చామంతి(28)కి యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన సోమేష్తో 2010లో వివాహం జరిగింది. పదేళ్ల క్రితమే వారు రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని అత్తాపూర్కు వచ్చి స్థిరపడ్డారు. ఐదేళ్ల క్రితం హైదర్గూడ గుమ్మకొండకాలనీలో సోదరుడు నర్సింహులుతో కలిసి సోమేష్ ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. మొదటి అంతస్తులో భార్యాపిల్లలతో కలిసి నర్సింహులు ఉంటుండగా.. కింది అంతస్తులో సోమేష్ కుటుంబం నివసి స్తోంది. సోమేష్ పలు కార్యాలయాలకు నీటిని సరఫరా చేస్తుండగా ఆయన భార్య చామంతి ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నర్సింహులు బావమరిది అయిన యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం చిర్రగూడూరుకు చెందిన శేఖర్(25) ఆర్నెల్ల క్రితం బావ వద్దకే వచ్చి నివసిస్తుండడంతో రెండు కుటుంబాలతో సఖ్యతతో మెలుగుతున్నాడు. మంగళవారం ఉదయం సోమేష్, నర్సింహులు, ఆయన భార్య ముగ్గురూ సూర్యాపేటలో ఓ దశదినకర్మ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారు. ఉదయం ఎనిమిది గంటలకు పిల్లలను పాఠశాలకు పంపించిన చామంతి 10.30కు తల్లికి ఫోన్చేసి మాట్లాడింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి వచ్చిన పిల్లలు తలుపు తట్టగా తల్లి తీయలేదు. కిటికీ నుంచి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. హాల్లో చామంతి, పడకగదిలో శేఖర్ ఉరేసుకుని కనిపించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ధ్రువీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన భారాస ఎంపీపీ
[ 09-05-2024]
పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సమచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సతీమణి ప్రచారం
[ 09-05-2024]
రాయగిరి గ్రామంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి చామల డింపుల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. -
అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి: ఎమ్మెల్యే
[ 09-05-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పట్టణంలోని కిసాన్ నగర్, విద్యానగర్, బంజారహిల్స్, తారకరామ నగర్, పహాడినగర్లో కాంగ్రెస్ ప్రచారం చేసింది. -
పోలింగ్కు రెండు రోజుల ముందు నుంచి మద్యం విక్రయాలు బంద్
[ 09-05-2024]
ప్రశాంత వాతావరణంలో, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈనెల 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
‘ఇండియా కూటమి’ విజయం తథ్యం: ఉత్తమ్కుమార్ రెడ్డి
[ 09-05-2024]
నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వేలాది మంది కాంగ్రెస్లో చేరుతున్నారని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. -
ఎల్లయ్య హత్య కేసులో కొత్త మలుపు
[ 09-05-2024]
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట మండల కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య హత్య కేసు బుధవారం మరో కొత్త మలుపు తిరిగింది. -
అభ్యర్థి ముఖం చూపడాయె.. ఓటెవరికి వేద్దాం..!
[ 09-05-2024]
ఓ యాదన్న ఎటుబోతున్నవే.. రా.. ఈ రచ్చబండ కాడ కూర్చోని మంచి, చెడ్డలు మాట్లాడుకుందాం..! పిలిచాడు రామస్వామి గాడేందో మైక్ సప్పుడైతాంది. ఏందో.. ఏమిటో? చూసొద్దామని పోతున్నా బదులిచ్చిండు యాదయ్య. -
పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యం
[ 09-05-2024]
గతంలో ఎన్నడూ లేని విధంగా 200 ఓటర్లున్నా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఎండ వేడిమి నియంత్రణతో పాటూ ఓటేయడానికి వచ్చే ఓటరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోక్సభ పరిధిలోని 2,061 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. -
కురుక్షేత్రం ఓ పాఠమే
[ 09-05-2024]
ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండగలో వర్గాలుగా విడిపోయి.. ప్రత్యర్థులుగా మారడం, దశాబ్దాల వైరంతో రగిలిపోవటం చూస్తుంటాం. -
అగ్రనేతలొస్తున్నారు..!
[ 09-05-2024]
మరో రెండు రోజుల్లో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది.ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నాయి. -
ఓటర్లకు ఆహ్వానం
[ 09-05-2024]
ఓ శుభకార్యానికి ఆహ్వానం వస్తే అందరం ఆ తేదీ గుర్తు పెట్టుకుని తప్పకుండా హాజరవుతాం. అలాంటిది ఏకంగా మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ఠం చేసే, మన భవితను తీర్చిదిద్దే ఓటుకు రమ్మని ఓటరును ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది అనుకున్నారేమో..! -
ఈవీఎంల కేటాయింపు పూర్తి
[ 09-05-2024]
భువనగిరి లోక్సభ స్థానం ఎన్నికకు 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2,141 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతున్నాయి. -
ఎంపీ నిధుల కేటాయింపు ఇలా..!
[ 09-05-2024]
దేశ అభ్యున్నతికి పార్లమెంటు ఒక దిక్సూచి. ప్రగతికి నాంది అక్కడి నుంచే మొదలవుతుంది.లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తూ.. కేటాయించే నిధులను ప్రణాళికాబద్దంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
పదమూడోసారి.. 2వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు
[ 09-05-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్లతో పాటే పోలింగ్ కేంద్రాలు సైతం పెరుగుతూ వస్తున్నాయి. 1977 నుంచి 2019 వరకు లోక్సభకు 12 సార్లు ఎన్నికలు జరగ్గా, త్వరలో 13వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. -
భాజపాని విమర్శిస్తే.. అవినీతిపరులా: జూలకంటి
[ 09-05-2024]
భాజపా, మోదీని విమర్శించే వారు.. అవినీతి పరులంటూ ముద్రలు వేస్తున్నారని, కానీ ఆ పార్టీకి చెందిన వారే అత్యంత అవినీతి పరులని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. -
నోటా.. వచ్చిందిలా
[ 09-05-2024]
ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత. నచ్చని అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశం లేకపోవడం వల్ల రకరకాల పద్ధతుల్లో గతంలో తమ వ్యతిరేకతను తెలిపేవారు. -
ఐదేళ్లలో.. మూడు లక్షలు పెరిగె..!
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ- 2024 ప్రక్రియలో భాగంగా.. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాల తుది ఓటరు జాబితా ఇటీవలే విడుదలైంది. -
నీటికుంట.. తీర్చును తంటా!
[ 09-05-2024]
నీటి నిల్వ సాంద్రత పెరిగేలా ఉపాధి హామీ పథకంలో కమ్యూనిటీ ఫారం పాండ్స్ (నీటి కుంటలు) నిర్మాణం చేపడుతున్నారు. -
భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు
[ 09-05-2024]
కాంగ్రెస్ నాయకుడు, జనశక్తి మాజీ సభ్యుడు వడ్డె ఎల్లయ్య అంత్యక్రియలు పోలీసుల భారీ బందోబస్తు నడుమ సూర్యాపేట మండలం ఎల్కారం గ్రామంలో బుధవారం రాత్రి పూర్తిచేశారు. -
ఆరుబయట నిలిపితే.. అంతే
[ 09-05-2024]
ఈ చిత్రంలో ముఖానికి కర్చీఫ్ కట్టుకొని ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మార్చి 28న కోదాడ పట్టణంలోని ఓ వైన్స్ దుకాణం ముందు రాత్రి సమయంలో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం మీద కాసేపు కూర్చొని, తర్వాత అతడి దగ్గర ఉన్న దొంగ కీ సాయంతో దాన్ని తీసుకుపోయాడు. -
ర్యాలీలో.. జాలీగా
[ 09-05-2024]
రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును నిర్భయంగా, ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?
-
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్
-
భైంసాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
సంక్షోభం వేళ చౌతాలాకు షాక్.. భాజపా గూటికి పార్టీ ఎమ్మెల్యేలు..!