రోగి తత్వం.. హోమియో వైద్యం
రోగి తత్వాన్ని పూర్తిగా పరీక్షించి.. దాని ఆధారంగా ఒక్కో రోగికి ఒక్కోలా మందులు ఇచ్చే వైద్యమే హోమియోపతి. ఈ వైద్యంపై అనేక విమర్శలు ఉన్నప్పటికీ.. మన దేశంలో రెండు వందల ఏళ్లుగా ప్రజల నమ్మకాన్ని చూరగొన్నది.
మిర్యాలగూడ పట్టణం, మేళ్లచెరువు, న్యూస్టుడే: రోగి తత్వాన్ని పూర్తిగా పరీక్షించి.. దాని ఆధారంగా ఒక్కో రోగికి ఒక్కోలా మందులు ఇచ్చే వైద్యమే హోమియోపతి. ఈ వైద్యంపై అనేక విమర్శలు ఉన్నప్పటికీ.. మన దేశంలో రెండు వందల ఏళ్లుగా ప్రజల నమ్మకాన్ని చూరగొన్నది. ఆంగ్ల వైద్యంలో నయం కాని అనేక వ్యాధులను హోమియోపతి వైద్యంలో నయం చేసి చూపించారు వైద్యులు. హోమియోపతి వైద్యానికి పితామహుడిగా చెప్పుకునే జర్మనీకి చెందిన డాక్టర్ సామ్యేల్ హానిమాన్ జయంతి సందర్భంగా ఏటా ఏప్రిల్ 10న ‘ప్రపంచ హోమియోపతి’ దినోత్సవం నిర్వహించుకుంటున్నారు.
దీర్ఘకాలిక రోగాలకు..
ఒకప్పుడు దేశంలో అనేక మందిని బలిగొన్న మెదడు వాపు వ్యాధిని హోమియో మందుల ద్వారానే తరిమి కొట్టామంటున్నారు వైద్యులు. ఇటీవల కాలంలో అనేక మంది పలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి బాధపడుతున్నారు. వాటిలో అనేక వ్యాధులకు అల్లోపతిలో తప్పనిసరిగా శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ హోమియోపతిలో కేవలం మందుల ద్వారానే నయం చేసి చూపిస్తున్నారు వైద్యులు. నొప్పుల కోసం ఆంగ్ల మందులు వాడడంతో ఇతర అవయవాలపై ప్రభావం పడుతుందని.. కానీ ఇతర అవయవానికి ఎటువంటి ఆపద కలుగకుండా వ్యాధిని నయం చేయడమే హోమియోపతి ప్రత్యేకత అంటున్నారు నిపుణులు. కీళ్ల నొప్పులు, గొంతులో గడ్డలు, స్వైన్ఫ్లూ, కొవిడ్ వంటి వ్యాధులను హోమియో మందులతో నయం చేయవచ్చంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో మందుల వాడకం..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాథమిక వైద్య కేంద్రాల్లో హోమియో మందులు అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి వంటి ప్రాంతాల్లో ప్రైవేట్ హోమియో వైద్యశాలలు, మందుల దుకాణాలు సైతం నిర్వహిస్తున్నారు. అనేక మంది రోగులు వివిధ రోగాలను నయం చేసుకునేందుకు హోమియోనే ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల కేవలం హైదరాబాద్లో మాత్రమే ఉండడంతో పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం హోమియో వైద్యానికి తగిన ప్రచారం కల్పించడంతో పాటు తగిన నిధులు కేటాయించి.. హోమియో వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు.
ఇతర సమస్య రాకుండా వైద్యం..
డాక్టర్ నితిన్ ప్రసాద్ రాయ్, ఆర్బీఎస్కే వైద్యాధికారి, మిర్యాలగూడ
ఆంగ్ల మందులు వాడకం వల్ల తక్షణమే వ్యాధి నయమవుతుంది కానీ.. ఇతర అవయవాలపై దుష్ప్రభావాలు కలిగిస్తాయి. హోమియో వైద్యంలో ఇతర అవయవాలకు ఎలాంటి హాని జరగకుండా మందులు వాడుతారు. హోమియో వైద్యంలో ఒక్కో రోగిని పూర్తిగా పరిశీలించి.. వారి తత్వాన్ని బట్టి మందులు సిఫారసు చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
[ 29-04-2024]
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.8 లక్షల నగదు దగ్ధం అయ్యింది. -
భువనగిరి బరిలో 39 మంది
[ 29-04-2024]
భువనగిరి పార్లమెంటు స్థానానికిగాను 12 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా పోటీలో 39 మంది మిగిలారు. -
పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు
[ 29-04-2024]
భువనగిరి బరి నుంచి తాము తప్పుకునే ప్రసక్తే లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు స్పష్టం చేశారు. -
గెలుపు వ్యూహం..!
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపు కోసం భాజపా వ్యూహాలు రచిస్తోంది. -
సాగు ప్రణాళిక ఖరారు.. విత్తనాలకు ప్రతిపాదనలు
[ 29-04-2024]
నల్గొండ జిల్లా వానాకాలం పంటల సాగుపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. సాగును అంచనా వేసి అవసరమైన విత్తనాలు కోసం జిల్లాలో ప్రణాళిక సిద్ధం చేసింది. -
భానుడు భగ్గుమనె..!
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాపై ఆదివారం భానుడు నిప్పులు చెరిగాడు. ఏడు మండలాల్లో 45 డిగ్రీల సెల్సియస్కు పైగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నిబంధనలకు నీళ్లు..!
[ 29-04-2024]
కోదాడ పట్టణంలో సుమారు 30 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో పురపాలిక నుంచి అనుమతి తీసుకున్నవి ఐదు మాత్రమే. -
మడిగల్లోనే దశాబ్దాలుగా..!
[ 29-04-2024]
దేవరకొండ రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రం, పురపాలికలో ఏ దుకాణాలు అద్దెకు తీసుకోవాలన్నా.. రూ.వేలు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి. -
నల్లబజార్కు భారత్ సరకులు..!
[ 29-04-2024]
మార్కెట్లో నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలలుగా రాయితీపై సరఫరా చేస్తున్న ‘భారత్ దాల్’ను మిర్యాలగూడ కేంద్రంగా కొందరు అక్రమార్కులు ప్యాకెట్లు చింపి.. బస్తాల్లో నింపి ఏపీలోని పలు జిల్లాలకు తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. -
ద్వితీయ శ్రేణి.. గుంభనం వీడదేమీ!
[ 29-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు.. లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అగ్రనాయకుల హడావుడి తప్ప కిందిస్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. -
ఒక్కొక్కరికి ఒక్కోలా.. అందరూ వినియోగించుకునేలా
[ 29-04-2024]
ఓటును అందరూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఉపయోగించుకోలేరు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు, సైనికులు, గుఢాచారి వ్యవస్థల్లో పనిచేసే వారు తమ ఓటును ఉపయోగించుకునేందుకు వివిధ మార్గాలను ఎన్నికల సంఘం కల్పించింది. -
రఘువీర్ 44.. నర్సయ్య 65
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల నుంచి బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ 44 ఏళ్లలో అతి చిన్న వయస్కుడిగా నిలవగా... భువనగిరి భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ 65 ఏళ్లతో అత్యధిక వయస్కుడిగా నిలిచారు. -
ప్రేమజంట బలవన్మరణం
[ 29-04-2024]
ఆరేళ్లుగా ప్రేమించుకుంటూ.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. -
ఓటెత్తేలా.. స్ఫూర్తి చాటేలా..!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. -
700 ఏళ్ల నాటి సంకెళ్ల బావి
[ 29-04-2024]
అది చరిత్ర పుటల్లో శిథిలమైన మహానగరం.. చుట్టూ అడవి.. ఎతైన కొండలు..కోటలు.. ఇంకొంచెం తొంగిచూస్తే మరెన్నో చారిత్రక విశేషాలు. -
త్వరలో భారాస కనుమరుగు: రాజగోపాల్రెడ్డి
[ 29-04-2024]
భారాస త్వరలో కనుమరుగవుతుందని కాంగ్రెస్ భువనగిరి లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి జోస్యం చెప్పారు. -
ఆమె కోసం..!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో మహిళా శక్తే ప్రాధాన్యంగా కనిపిస్తోంది. అభ్యర్థులు, నాయకుల దృష్టి మహిళా ఓటర్లపైన పడింది. -
డిజిటల్ లావాదేవీలపై నిఘా..
[ 29-04-2024]
ఆలేరుకు చెందిన ఓ ఖాతాదారుడు భువనగిరిలో నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్ బ్యాంకు నుంచి అధికారులు ఫోన్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’