త్రిముఖ పోరు.. పాగా వేసేదెవరు..?
గతంలో ఎన్నడూ లేని విధంగా జహీరాబాద్ లోక్సభ స్థానంలో ఈసారి త్రిముఖ పోరు నెలకొంది. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి.
జహీరాబాద్లో ప్రధాన పార్టీల ముమ్మర ప్రయత్నం
ఈనాడు, కామారెడ్డి : గతంలో ఎన్నడూ లేని విధంగా జహీరాబాద్ లోక్సభ స్థానంలో ఈసారి త్రిముఖ పోరు నెలకొంది. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్(సురేష్ షెట్కార్), 2014, 2019లో తెరాస(బీబీపాటిల్) అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్, భాజపా, భారాస అభ్యర్థులు ఎవరికివారు ఎత్తులు పైఎత్తులు వేస్తూ ప్రచారం నిర్వహిస్తుండడంతో సార్వత్రిక పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది.
అసెంబ్లీకి, లోక్సభకు మారుతున్న ఓటరునాడి
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఎల్లారెడ్డి స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం పరిధిలోని నాలుగు స్థానాల్లో భారాస, మూడింటిలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్కు ఆధిక్యం లభించింది. త్వరలో జరుగనున్న లోకసభ ఎన్నికల్లో ఓటరు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారో ఫలితాల అనంతరం తేలనుంది.
మండల స్థాయిలో సమావేశాలు
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 2009, 2014, 2019లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, భారాసల మధ్యనే పోరు సాగింది. ప్రస్తుతం త్రిముఖ పోరు నెలకొంది. భారాస, భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే మండల, నియోజకవర్గస్థాయుల్లో సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నాయి. నామపత్రాల దాఖలుకు మూడు పార్టీల అభ్యర్థులు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. తదనంతరం ప్రచారాన్ని హోరెత్తించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
[ 29-04-2024]
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన ఘటన సోమవారం మండల పరిధిలోని ఎదల్కన్ చెరువు వద్ద 161వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. -
మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 29-04-2024]
ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండెలా లక్ష్మీనారాయణ అన్నారు. -
ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించిన ఉపాధి కూలీలు
[ 29-04-2024]
ఉపాధి హామీ పథకం సీనియర్ మేట్ నాగరాజు పనితీరును నిరసిస్తూ సోమవారం బీర్కూర్ ఎంపీడీవో కార్యాలయాన్ని కూలీలు ముట్టడించారు. -
ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు.. 1,45,912
[ 29-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. 2014 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో 53 వేల ఓటర్లు మాత్రమే పెరిగారు. -
పోలీసు పరిశీలకుడికి స్వాగతం
[ 29-04-2024]
జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పోలీసు పరిశీలకుడు రాజేశ్ మీనా ఆదివారం కామారెడ్డికి చేరుకున్నారు. -
భానుడు భగభగ
[ 29-04-2024]
జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని రోజురోజుకూ పెంచుతున్నాడు. ఆదివారం అత్యధికంగా డోంగ్లిలో 44 డిగ్రీ సెల్సియస్ల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. అత్యల్పంగా పగటి పూట సదాశివనగర్లో 39.5 డిగ్రీల ఎండ కాచింది. -
ఆగని గంజాయి రవాణా
[ 29-04-2024]
జిల్లాల్లో ఒక్కో తీరున గంజాయి ఆనవాళ్లు కనిపిస్తున్నా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు కనిపించడం లేదు. ఇటీవల చాక్లెట్ల రూపంలో సైతం గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. -
నిఘా నేత్రం.. సమస్తం నిక్షిప్తం
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. -
‘గల్ఫ్ కార్మికులు ఇప్పుడు గుర్తుకొచ్చారా?
[ 29-04-2024]
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డికి ఇన్నాళ్లకు గల్ఫ్ కార్మికులు గుర్తుకొచ్చారా? అని ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. భాజపా జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
బరిలో ఉండేదెవరో?
[ 29-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎందరు అభ్యర్థులు పోటీలో ఉంటారనేది సోమవారం తేలనుంది. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. -
నేనండి..ఈవీఎంని
[ 29-04-2024]
ఓటరు మహాశయులకు నమస్కారాలు.. నేనండీ.. మీ ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్))ని. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలొచ్చిన ప్రతిసారి మీ ముందుకొస్తుంటాను కదా.. లోక్సభ ఎన్నికల సందర్భంగా మళ్లీ మనం కలవబోతున్నాం. -
ఎల్లలు దాటిన నాట్యాభినయం
[ 29-04-2024]
భారతీయ సంస్కృతిలో నృత్యానికి విశేష ఆదరణ ఉంది. దానిపై ఇందూరు కళాకారులు మక్కువ పెంచుకుని అంతర్జాతీయ వేదికల్లో నాట్యాభినయం చేస్తూ మురిపిస్తున్నారు. -
ముగ్గురూ.. గతంలో పోటీ చేసిన వారే
[ 29-04-2024]
ప్రస్తుతం జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు గతంలో ఎంపీలుగా పోటీ చేసిన అనుభవం ఉంది. -
స్కాన్ చేయండి... వివరాలు తెలుసుకోండి
[ 29-04-2024]
ఇది వరకు ఓటరు చీటీపై ఓటరు చిత్రంతో పాటు వివరాలు ఉండేవి. ఎన్నికల సంఘం ఓటరు చీటీపై గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మార్పులు చేసింది. -
కాలూరుకు చెందిన గర్భిణి మృతి
[ 29-04-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం కాలూరుకు చెందిన గర్భిణి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆదివారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. -
ప్రచారానికి పొలంబాట
[ 29-04-2024]
మండే ఎండలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. కొన్ని రోజుల కిందటి వరకు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకే పరిమితమైన అభ్యర్థులు, నాయకులు ప్రస్తుతం మరింత జోరు పెంచారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!