పేలుడు పదార్థాల రవాణాపై నియంత్రణ ఏది?
గత నెల 27న మరిపెడ ఠాణా పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. వీరారం క్రాస్ రోడ్డు సమీపంలో తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో 50 ఎలక్ట్రానిక్ డిటోనెటర్లు, 32 జిలిటెన్ స్టిక్స్, 20 బాక్సుల్లో జిలిటెన్ స్టిక్స్ బూస్టర్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
గత నెల 27న మరిపెడ ఠాణా పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. వీరారం క్రాస్ రోడ్డు సమీపంలో తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో 50 ఎలక్ట్రానిక్ డిటోనెటర్లు, 32 జిలిటెన్ స్టిక్స్, 20 బాక్సుల్లో జిలిటెన్ స్టిక్స్ బూస్టర్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లాలో లైసెన్స్ తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అనుమతులు లేని వారికి విక్రయిస్తున్నారని పోలీసులు నిర్ధారించారు.
ఈనాడు, మహబూబాబాద్, నెహ్రూసెంటర్: జిల్లాకు అనుమతులు లేకుండా అడ్డదారిలో పేలుడు పదార్థాలు వస్తున్నాయి. స్థిరాస్తి వ్యాపారం జోరందుకోవడంతో గుట్టలన్న ప్రాంతాల్లో వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమయంలో గుట్టలను తొలగించేందుకు జిలెటిన్ స్టిక్స్ లాంటి పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నారు. చాలా వరకు అక్రమంగా తెచ్చి ఉపయోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన యంత్రాంగం ‘మామూలు’గా తీసుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిఘా లేకపోవడంతో వాటి వినియోగం వల్ల ప్రమాదాలు జరిగిన ఘటనలున్నాయి. గతంలో నెల్లికుదురు మండలంలోని ఓ క్వారీలో రాళ్లను పగలగొట్టడానికి వినియోగించిన జిలెటిన్ స్టిక్స్ చెందిన పూస పేలి ఒక మహిళ మృతి చెందారు. గూడూరులోని ఓ క్వారీలోనూ ప్రమాదవశాత్తు బాంబు పేలడంతో ఒకరు మృతి చెందారు.
ఫిర్యాదులొస్తేనే
స్థిరాస్తి వెంచర్ల ఏర్పాటులో భాగంగా అక్కడక్కడ అడ్డొచ్చిన రాళ్లను పగలగొట్టేందుకు కంప్రెషర్లతో వాటికి రంధ్రాలు చేసి అందులో జిలెటిన్ స్టిక్స్ పూసలను పెట్టి పేలుస్తున్నారు. కంప్రెషర్ నిర్వాహకులు చాలా వరకు అనుమతులు లేకుండానే వినియోగిస్తున్నట్లు తెలిసింది. అలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన సంబంధిత అధికారులు ఫిర్యాదులొస్తేనే పట్టుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. గత ఏడాది నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం శివారులో, పెద్దనాగారం స్టేజీ వద్ద, కౌసల్యదేవిపల్లిలో అనుమతుల లేకుండా జిలెటెన్ స్టిక్స్ ఉపయోగించి పేలుళ్లు నిర్వహిస్తుండగా సమీపంలోని వారు చేసిన ఫిర్యాదుతో పోలీసులు వాటిని పట్టుకుని బాధ్యులపై కేసులు నమోదు చేశారు. మూడు చోట్ల 30 జిలెటిన్ స్టిక్స్ను పట్టుకున్నట్లు సమాచారం. క్వారీల్లో వినియోగిస్తున్న భారీ పేలుడు పదార్థాలతో ఇళ్ల గోడలకు పగుళ్లు వస్తున్నాయంటూ నెల్లికుదురు మండలంలోని తండావాసులు ఆందోళన చేసిన సంఘటనలున్నాయి.
నిబంధనలు బేఖాతరు!
పేలుడు పదార్థాలను వినియోగించే వారికి పోలీసుల అనుమతి ఉండాలి. గనులశాఖకు సమాచారం అందించాలి. వాటి వివరాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయడంతో పాటు పోలీసులకు తెలియజేయాలి. నిపుణుల పర్యవేక్షణలో పేలుళ్లు జరపాలి. చాలా వరకు ఈ నిబంధనలు అమలు కావడం లేదు.
నివారణకు ప్రత్యేక చర్యలు
- జోగుల చెన్నయ్య ఏఎస్పీ మహబూబాబాద్
జిల్లాలో పేడులు పదార్థాల అక్రమ వ్యాపారంపై ప్రత్యేక నిఘా ఉంచి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో వెంచర్ల ఏర్పాటు, రాళ్లు పగులగొట్టే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా పెట్టాం.సంబంధిత కార్యాలయాల్లో రిజిస్టర్లను పరిశీలిస్తున్నాం. అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు విక్రయిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సభ విజయవంతం.. పార్టీ శ్రేణుల్లో ఆనందం
[ 01-05-2024]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్ రెడ్డిలు సభా ఏర్పాట్లను దగ్గరుండి చూశారు. -
‘పది’లో సత్తా చాటారు
[ 01-05-2024]
రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రంలో గతేడాది 11వ స్థానం రాగా.. ఈసారి జిల్లాను 10వ స్థానంలో నిలిపారు. -
‘సాగునీరు అందించే బాధ్యత నాదే’
[ 01-05-2024]
భీమదేరపల్లి మండలంలోని పొలాలకు సాగునీరు అందించే బాధ్యత తనదని, మీ ఆశీర్వాదంతో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీగా రాజేందర్రావును గెలిపించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
పదిలో నాలుగో స్థానం..!
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లా మంచి ఫలితాలను సాధించింది. గతేడాదితో పోలిస్తే ఆరడుగులు ముందుకేసి రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. -
పదిలో 16వ స్థానం
[ 01-05-2024]
రాష్ట్ర విద్యా శాఖ అధికారులు మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 16వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానం కైవసం చేసుకోగా ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది.. -
పది మెట్లు పైకి..
[ 01-05-2024]
పదోతరగతి ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. జిల్లా 94.62 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో 8178 మంది బాలబాలికలు పరీక్ష రాయగా 7,738 మంది ఉత్తీర్ణులయ్యారు. -
పదిలో 13వ స్థానం
[ 01-05-2024]
రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాకు 13వ స్థానం దక్కింది. 94.45 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత నమోదైంది. -
‘జిల్లా తరలింపు మాటలు నమ్మొద్దు’
[ 01-05-2024]
ములుగు జిల్లా తరలిపోతుందని ప్రతిపక్షాలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అలాంటి మాటలు నమ్మకూడదన్నారు. -
ఎంజీఎం ఆసుపత్రి ఏడీ సరెండర్
[ 01-05-2024]
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) లక్ష్మిరాజంను మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. -
యువతి ఆత్మహత్య.. ఖననం చేసిన ఆరు రోజులకు పోస్టుమార్టం
[ 01-05-2024]
యువతి ఆత్మహత్య చేసుకోగా.. ఆలస్యంగా గుర్తించిన పోలీసులు ఆరు రోజులకు పోసుమార్టం చేయించిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. కాజీపేట ఏసీపీ తిరుమల్ తెలిపిన వివరాల ప్రకారం.. -
రహదారి ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 01-05-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన తాడ్వాయి-పస్రా మధ్య మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
‘ఇన్నర్ రింగ్రోడ్డు’ భూ బాధితుల ఆందోళన
[ 01-05-2024]
ఖిలావరంగల్ పరిసర ప్రాంతాల మీదుగా నిర్మిస్తున్న అంతర వలయ రహదారి(ఇన్నర్ రింగ్ రోడ్డు) భూ బాధితులు మంగళవారం ఆందోళనకు దిగారు. -
వ్యాపారి అపహరణ కేసులో ఐదుగురి అరెస్టు
[ 01-05-2024]
హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన వ్యాపారి వలిపిరెడ్డి మధుసూదన్ను అపహరించిన కేసులో మంగళవారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు, ఒకరు పరారీలో ఉన్నట్లు సీఐ రవిరాజు తెలిపారు. -
లోక్సభ ఎన్నికలకు భద్రత కట్టుదిట్టం
[ 01-05-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించి పోటీచేసే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి.. వారికి గుర్తులు కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య వెల్లడించారు. -
దుకాణాల్లో అధికారుల తనిఖీలు.. కేసుల నమోదు
[ 01-05-2024]
వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో పలు దుకాణాల్లో మంగళవారం జిల్లా ఇన్స్పెక్టర్ బి.ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు చేపట్టి..